”నింగి…నేల…నాదే ! ” – ఒక గొప్ప విభిన్న చిత్రం

ఆర్‌.సత్య
గాలి పటాలు ఎగరేస్తూ తోటిపిల్లలతో హాయిగా ఆడుకుంటూ ఉంటూంది ఓ అందమైన అమ్మాయి. Continue reading

Share
Posted in సినిమా సమీక్ష | 1 Comment

ఆర్‌.శాంతసుందరికిగారికి జాతీయ మానవహక్కుల కమీషన్‌ బహుమతి

డాక్టర్‌ జె. భాగ్యలక్ష్మి

21-22 , మే, 2009 తేదీలలో తీన్‌మూర్తి భవన్‌ ఆడిటోరియం న్యూఢిల్లీలో ”సమాచారం హక్కు, మానవహక్కులు, ప్రస్తుతి స్థితి” గురించి ఒక చర్చ ఏర్పాటు చేసింది. Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

కంటిచూపు

డా|| రోష్నీ

సర్వేంద్రియాణాం – నయనం ప్రధానం అన్నారు. అందుకే కంటిచూపు గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలు తెలుసుకుందాం. Continue reading

Share
Posted in ఆలోచిద్దాం | Leave a comment

ఓ లచ్చవ్వ

జనగామ రజిత
1958 ఏప్రిల్‌ 14న హన్మకొండలోని ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అనిశెట్టి రజిత, Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆశలు రేపుతున్న కొత్త కెరటాలు

రత్నమాల, మల్లీశ్వరి
వారికి జ్ఞానంపట్ల వినయం, సాహిత్యం అంటే మమకారం, కార్యాచరణపట్ల విశ్వాసం.
వారిలో ఉన్నదంతా చైతన్యమే. స్త్రీలు ఎన్నో కారణాలచేత వివిధరకాల వివక్షలకి గురవుతున్నారని అసమానతలు అణచివేతలనుంచి స్త్రీవాద సాహిత్యం స్త్రీలకి ఆసరాగా నిలబడగలదన్న నమ్మకంతో ఎదురుచూస్తున్న యువకెరటాలు వాళ్ళు.
2009 మార్చి 21, 22 తేదీల్లో వరంగల్‌లో మహిళాధ్యయనకేంద్రం, కాకతీయ విశ్వవిద్యాలయం మరియు ‘మనలో మనం’ రచయిత్రుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత, తెలంగాణ స్త్రీల సాహిత్యాధ్యయన సమావేశాల్లో ముగ్గురు విద్యార్ధినులు, ఇద్దరు స్కాలర్లు పత్రసమర్పణ చేశారు. పేరుమోసిన విమర్శకులు సైతం తీసుకోడానికి జంకిన అంశాలను తీసుకుని అతితక్కువ సమయంలో శక్తివంచన లేకుండా ప్రయత్నించి మంచి మెటీరియల్‌ని సేకరించడమే కాకుండా విశ్లేషణాత్మకంగా పరిశోధనా పత్రాలు సమర్పించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పాత శ్రీలక్ష్మి సమర్పించిన పత్రంలోని అంశాలు, వాటిపట్ల తనకున్న అవగాహన, స్థిరమయిన, స్పష్టమయిన స్వరంతో ప్రసంగించడం రచయిత్రలను ఆకట్టుకున్నాయి. జూపాక సుభద్ర రాసిన ‘కొంగు నా బొచ్చె మీన కావలుండె బొంత పేగ్గాదు’ అనే కవితకు జయప్రభ రాసిన ‘పైటని తగలెయ్యాలి’ కవితతో తులనాత్మక అధ్యయనం చేసి ఆ పత్రాన్ని వేదికపై చదివినపుడు రచయిత్రులు హోరుమనే చప్పట్లతో అభినందనలు తెలిపారు.
దళిత స్త్రీ వ్యాసప్రక్రియపై పత్రసమర్పణ చేసిన కందాళ శోభారాణి ఇదే విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖలో స్కాలర్‌. అనివార్య కారణాలచేత అతితక్కువ సమయంలో పత్రాన్ని తయారుచేయాల్సివచ్చినప్పటికీ జంకకుండా కాత్యాయనీ విద్మహే సలహాలను స్వీకరిస్తూ మంచి వ్యాసాన్ని తయారుచేసింది. అంతేకాకుండా ఈ సదస్సు నిర్వాహకులకు నిర్వహణలో పూర్తిస్థాయి సహాయసహకారాలను అందించింది.
ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు స్కాలర్‌ నిదానకవి నిశ్చల తెలంగాణికా రచయిత్రుల కథలపై పత్రసమర్పణ చేసింది. విస్తృతమయిన అంశాన్ని ఎంచుకోవడమే కాకుండా తగిన న్యాయం చేసింది నిశ్చల. కేవలం డేటా యివ్వడం కాకుండా కథలను విమర్శనాత్మకంగా పరిశోధించి కొన్ని ప్రతిపాదనలు కూడా చేసింది.
‘అసెంబ్లీలో ఉండాల్సిన అమ్మాయి’ గా ముదిగంటి సుజాతారెడ్డి ప్రశంసలు పొందిన జనగామ రజిత కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ ద్వితీయ చదువుతోంది. అనిశెట్టి రజిత రాసిన ‘ఓ లచ్చవ్వ’ దీర్ఘకవితపై విశ్లేషణ చేసింది. నాటకీయ హావభావాలతో అందరి హృదయాలకీ హత్తుకుపోయేట్లు ప్రసంగించింది.
కాకతీయ విశ్వవిద్యాలయంలోనే తెలుగు ఎం.ఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న సుమలత ‘గెద్దాడ కస్తూరి’ రాసిన ‘మాస్టారికో శిక్ష’ కథను విశ్లేషిస్తూ పత్ర సమర్పణ చేసింది. ప్రారంభంలో అంతమంది రచయిత్రుల సమక్షంలో ప్రసంగించడానికి జంకుతున్నట్లు కన్పించినా ప్రసంగం ముగిసేసరికి తనలో అంతులేని ఆత్మవిశ్వాసం కన్పించింది.
మొదటిరోజు సమావేశాలు ముగిసేసరికి రచయిత్రుల ఆసక్తి అంతా వీరితో మాట్లాడటంపైనే వుంది. ఈ క్రమంలో మేం కొంతసేపు ఈ అయిదుగురితో కలిసి సాహిత్య సామాజిక అంశాలపై చర్చించాము. అంతేకాకుండా ప్రస్తుత స్త్రీల సాహిత్యం ఎలావుంది? దాని ప్రభావం, ఇలాంటి ఉమ్మడివేదికల గురించి వారి అవగాహన సలహాలు మొదలైన అంశాలపై వారికి కామన్‌గా కొన్ని ప్రశ్నలు యిచ్చి సమాధానాలు తెలుసుకోవడం జరిగింది. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే
పాత శ్రీలక్ష్మి :- స్త్రీవాదం అంతకుముందు గుర్తింపుకిరాని ఎన్నో సమస్యల్ని చర్చించింది. స్త్రీలుగా చెప్పుకోడానికి యిబ్బంది పడే అనేక సమస్యల్ని ‘మల్టినేషనల్‌ ముద్దు’ లాంటి కవితలు నిర్భయంగా చెప్పాయి. మాకు ఈ సదస్సులో పత్రసమర్పణ చేసే అవకాశం రావడం ద్వారా మేము కూడా రాయగలం అన్న నమ్మకం ఏర్పడింది. మాలోని సృజనాత్మకతని మెరుగుపర్చుకోడానికి ‘మనలో మనం’ రచయిత్రుల వేదిక మాకు సహకరిస్తుందని బలంగా నమ్ముతున్నాం. పురుషులకి స్త్రీల సమస్యలు భిన్నంగా కన్పిస్తాయి, స్త్రీలు ఎంత బాగా రాసినప్పటికీ పురుష విమర్శకులు వాటిని అంగీకరించరు. యిలాంటి సమస్యలను గడ్డిపోచలన్నీ కలిసి బలమయిన తాడుగా మారినట్లు రచయిత్రులంతా కలిసి ఈ పితృస్వామిక సమాజాన్నీ, కులమత వివక్షలతో కూడిన సమాజాన్ని సమిష్టికృషి ద్వారా మార్చాలి.
కందాళ శోభారాణి :- తొలితరంతో పోలిస్తే స్త్రీల సాహిత్యం యిపుడు బలంగా వస్తోంది. ఇలాంటి వేదికల వలన రచయిత్రుల మధ్య భిన్నభావజాలాలకి సంబంధించిన అవగాహన పెరుగుతుంది. లోటుపాట్లు తెలుస్తాయి. మార్పు గురించిన చర్చలు చేసుకోవచ్చు. మిగతా సాహిత్య సంస్థల్లో రచయిత్రులకు గుర్తింపు ఉండదు. రచయిత్రులు విడిగా అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ప్రధానస్రవంతి సాహిత్యచరిత్రలో భాగం కోసం పోరాడాలి. వివిధ అస్తిత్వాల మధ్య సంఘర్షణ ఏర్పడినపుడు ఉమ్మడి శత్రువు అయిన పితృస్వామిక సంస్కృతికి లోకువ అవుతాం కాబట్టి జెండర్‌ అస్తిత్వచైతన్యం ప్రాధమిక ఉమ్మడి సూత్రంగా రచయిత్రులు స్వీకరించాలి.
నిదానకవి నిశ్చల : స్త్రీల సాహిత్యం యిప్పుడు పలుకోణాల్లోకి ప్రవేశించింది కాబట్టి ఆశాజనకంగా వుంది. యిలాంటి ఉమ్మడి వేదికల ద్వారా కొత్త రచయిత్రులు సాహిత్యంలో తమని గందరగోళపరిచే అంశాలపై స్పష్టమయిన సమాధానాలు పొందగలరు. సమకాలీన స్త్రీ సమస్యల మీద రచయిత్రులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. సాధారణ సమాజంలోకి పురుషాధిక్యతకు సాహిత్య సమాజం మినహాయింపు కాదు కాబట్టి రచయిత్రుల ఉమ్మడివేదిక సమర్ధవంతంగా పనిచేయాల్సిన అవసరం వుంది. ఈ వేదిక కేవలం సాహిత్యానికే పరిమితం కాకుండా సామాజిక సమస్యలతో సమన్వయం సాధించాలని కోరుకుంటున్నాను.
జనగామ రజిత : ఇప్పటివరకూ వచ్చిన స్త్రీల సాహిత్యం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఎలాంటి కమ్యూనికేషన్‌ సదుపాయాలూ లేని గిరిజన ప్రాంత స్త్రీలను గురించిన సాహిత్యం యింకా రావాల్సి వుంది. కొత్తగా రచనలు చేసేవారికి ఈ సదస్సులు, రచయిత్రులతో చర్చలు బాగా ఉపయోగపడుతున్నాయి. జాజుల గౌరి లాంటి రచయిత్రులు మంతో ఈ రెండురోజులూ స్నేహపూర్వకంగా మెలిగి తమ రచనానుభవాలను వివరిస్తుంటే ఎంతో నేర్చుకున్నట్లుగా అన్పిస్తోంది. నేనెందుకు రచనలు చేయకూడదు అన్పిస్తోంది. ఈ వేదిక తరచూ సమావేశమవుతూ వుండాలి. దాని ద్వారా స్త్రీ సమస్యల్ని కలసి గుర్తించడమూ, చర్చించడమూ రచయిత్రులకు ఉపయోగ కరంగా వుంటుంది. ఈ చర్చల ప్రభావం వారి సాహిత్యవ్యక్తీకరణపై కూడా ఉంటుంది.
సుమలత : విస్మరించబడిన ప్రాంతాల, దృక్పథాల స్త్రీల సమస్యల్ని వారే రాయాలి. ఆ చైతన్యాన్ని అందరూ అధ్యయనం చెయ్యాలి. మహిళా దినోత్సవం రోజు అందరినీ చూసి నేనూ రచనలు చెయ్యాలనుకున్నాను కానీ నాకా శక్తి లేదనిపించింది. కానీ ఈ రోజు ఈ వేదిక కార్యక్రమంలో పాలుపంచుకోవడం ద్వారా నాకు నమ్మకం పెరిగింది. ఇట్లా స్వేచ్ఛగా అభిప్రాయాలు పంచుకున్నట్లు పురుషులు వుండే వేదికలపై సాధ్యం కాదు. కొత్త రచయితల్ని ప్రోత్సహించడం ద్వారా కొత్త తరాన్ని తయారుచేసుకోగలం. యిప్పటికీ యువతరంలో సాహిత్యం పట్ల అనాసక్తి ఎక్కువ వుంది. దానిని పోగొట్టాలంటే యిలాంటి సదస్సుల అవసరం వుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

స్త్రీలపై హింసలన్నీ ఘోరమైన నేరాలే

కె.సత్యవతి

ఇటీవల ఏదో మీటింగులో కలిసిన ఒక పోలీస్‌ అధికారి ఓ వ్యాఖ్య చేసాడు. ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్‌ ఆర్డర్‌ మెరుగైంది. ఘోర నేరాల సంఖ్య చాలా తగ్గిపోయింది అన్నాడు. ఘోర నేరాలంటే ఏమిటి అని అడిగినపుడు కత్తులతో కుత్తుకలు Continue reading

Share
Posted in సంపాదకీయం | 3 Comments

భూమిక హెల్ప్‌లైన్‌ : మూడేళ్ళ ప్రయాణం

కె.హేమంత

భూమిక హెల్ప్‌లైన్‌ ఆక్స్‌ఫామ్‌ వారి ఆర్థిక సహాయంతో ఎంతో సమర్థవంతంగా నిర్వహించబడుతున్న విషయం అందరికీ విదితమే. అయితే ఆక్స్‌ఫామ్‌ వారు ఈమధ్య కొత్తగా చేపట్టిన DFID ప్రాజెక్ట్‌ కింద ”సివిల్‌ సొసైటీ రిసోర్స్‌ Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 2 Comments

వెనక్కే నడుద్దామా?

కొండేపూడి నిర్మల
దాదాపు గంటనుంచే నా బుర్ర తింటోంది ఎదురింటి బాలా త్రిపుర సుందరి. ముచ్చటకీ ముచ్చటకీ మధ్య ఊపిరి పీల్చుకునే విరామం యిచ్చినాగాని పారిపోవడానికి సిద్ధంగా వున్నాను. విరామం యివ్వదల్చు కోలేదు. ఉన్న పళాన  Continue reading

Share
Posted in మృదంగం | 2 Comments

మబ్బుల అడవిలో దాగున్న

సరోజినీ ప్రేమ్‌చంద్‌
శిలాలోలిత

రిసెర్చ్‌ చేస్తున్న రోజుల్లో కవయిత్రుల పుస్తకాలు ఎక్కడ దొరికినా చాలా సంతోషంగా అన్పించేది. కొత్తకొత్త కవిత్వాల కోసం అన్వేషిస్తుండేదానిని. ఫుట్‌పాత్‌ మీద పుస్తకాలు వెతుకుతుంటే ఈ ‘మబ్బుల అడవి’ అనే కవిత్వ Continue reading

Share
Posted in మనోభావం | Leave a comment

”ఒక్కరోజు”

ఆచంట శారదాదేవి

అప్పుడే తెల్లవారుతూంది. కిటికీలో నుంచి ఒక్క వెలుగు కిరణం శాంత ముఖం మీద పడింది.
శాంతకు మెలుకవ వచ్చింది. అయినా నిద్దురబద్ధకం వదలలేదు. నిద్ర కళ్ళతోనే కిటికీలోనుంచి బయటికి చూసింది. Continue reading

Share
Posted in కథలు | Leave a comment

రాగం భూపాలం

పి.సత్యవతి

విజయవాడలో మే నెలలో ఎండలు మెండుగా ఉండడం ఎంత నిజమో ప్రతి మేడేరోజున అందర్నీ అలరించే చల్లని సాయంత్రం కూడా అంత నిజం. ఈ సాయంత్రపు కవితా జల్లులతో తడిసి ముద్దవడానికి ఎండల్ని ధిక్కరిస్తూ కవులంతా Continue reading

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

ప్రేమ్‌చంద్‌ జీవిత చరిత్ర

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌.శాంతసుందరి
(గత సంచిక తరువాయి)

అప్పట్లో ధున్నూ చంటిపిల్లవాడు. రెండు నెలలుగా నేను నీళ్ల విరోచనాలతో బాధపడుతూ ఉన్నాను. తిండి తినలేకపోయే దాన్ని, మరి పిల్లాడికి పాలెలా వస్తాయి? డాక్టర్లు కూడా నన్ను పిల్లవాడికి పాలివ్వద్దనీ, Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

టాప్‌ గర్ల్స్‌

కారల్‌ చర్చిల్‌
అనువాదం : కె.సునీతారాణి

(కిందటి సంచిక తరువాయి)
నీ : మంచి బట్టలు వేసుకోవడం నీకిష్టం లేదా? నా బట్టలంటే నాకెంతో ఇష్టం. / రాజుగారి తమ్ముడికి సేక్‌ ఇవ్వడానికి నన్ను ఎనుకున్నారు. Continue reading

Share
Posted in నాటకం | Tagged | Leave a comment

”నేను మేధావుల మధ్యన సెక్స్‌ వర్కర్‌ని”.

నళినీ జమీలాతో జె.దేవిక ఇంటర్వ్యూ

మీ ఆత్మకథ మలయాళంలో వెలువడిన తర్వాత, ”ఇప్పుడిక నళిని సెక్స్‌ వర్కర్ల మధ్యన ఓ మేధావి అన్నమాట” అంటూ ఎవరో ఓ కామెంటు చేశారు. ”లేదు నేను మేధావుల మధ్యన సెక్స్‌ వర్కర్‌ని”అని మీరు ప్రతిస్పందించారు. దీన్ని కొంచెం వివరిస్తారా? Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఒక్కటైనా చాలు

ఇంద్రగంటి జానకీబాల

ఆత్రేయగారు ఎంత మంచి పాటలు వ్రాశారండీ! ఆయన పాటలున్నాయంటే ఆ సినిమా పెద్ద హిట్టే – మనసు కవిగా, మన సుకవిగా ఆయన తెలుగువారి గుండెల్లో స్థిరంగా వుండిపోయారు Continue reading

Share
Posted in పాటల మాటలు | 1 Comment

వీధిన పడ్డ జీవితం

విమల్‌ పాండేయ్

మూలం : హిందీ కథ అనువాదం : ఆర్‌. శాంతసుందరి

నగర జీవితం వాహనాల వేగంతో పోటీపడి పరుగులు పెడుతోంది. ఈ వీధులకి కళ్లూ, చెవులూ లేవు, కాళ్లు మాత్రమే ఉన్నాయి. వేలవేల కాళ్లతోఈ వీధులు తమ దారికి అడ్డొచ్చేవాటినన్నిటినీ తొక్కుకుంటూ Continue reading

Share
Posted in అనువాదాలు | Tagged | Leave a comment