ఆమె…
స్వర్గంలో ఉండనీ
నరకంలో ఉండనీ…
ఆకాశంలో ఉండనీ
పాతాళంలో ఉండనీ…
ఆమె…
ఎడారుల్లో ఉండనీ
మైదానాల్లో విహరించనీ…
ఆమె…
స్వర్గంలో ఉండనీ
నరకంలో ఉండనీ…
ఆకాశంలో ఉండనీ
పాతాళంలో ఉండనీ…
ఆమె…
ఎడారుల్లో ఉండనీ
మైదానాల్లో విహరించనీ…
ఈ కరోనా సమయంలో ఆటలు, పాటలు బాలానందాలు ఏమీ లేవు. అందుకు సంతోషం, ఆనందం మొత్తంగా తగ్గింది. ఇవన్నీ మేము మిస్సయిపోయాము. ఈ కరోనా వల్ల మాకు ఎనిమిది నెలలు బడి ఆగిపోయింది. బాలానందంలో మేము యాంకర్స్గా, చిన్నపిల్లలను అందంగా అలంకరించడం, వాళ్ళు ముద్దుముద్దుగా కనిపించడం జరిగేది. ఇప్పుడు అదంతా పోయింది. ఆటల పోటీల్లో బాగా ఆనందంగా స్నేహితులతో కలిసి ఆడుకునేవాళ్ళం. ఈ కరోనా సమయంలో జాగ్రత్తలు పాటించాలి, కాబట్టి మేము ఇంటిముందే ఒకరు, ఇద్దరు, ముగ్గురితో కలిసి ఆడుకున్నాం. అదే మాకు కొంత ఆనందాన్ని ఇస్తుండేది. దీంతో ఏ రోజూ మా మనసులో చింత అనేది ఉండేది కాదు అప్పటి రోజుల్లో (కరోనా రాకముందు). ఇప్పుడు బడికి వెళ్తున్నాను కాబట్టి నేను కొంత సంతోంగానే ఉన్నాను.
ఈ సంవత్సరం నేను మా పాఠశాలలో ఎన్నో కార్యక్రమా లను మిస్సయ్యాను. ఇంకా చిన్న పిల్లలు పాల్గొనే బాలానందంలో మేము చాలా ఎంజాయ్ చేస్తాము, అనేక ప్రదర్శనలలో పాల్గొంటాము. నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు సైన్స్ ఫెయిర్, ఇంకా మన మంగళగిరి గ్రంథాలయంలో రచనలు రాశాము. ఎన్నో పుస్తకాలు చదివాను. ఇలా చాలా రకాల వాటిలో పాల్గొన్నాము. ఈ సంవత్సరం ఇవన్నీ లేవు. స్పోర్ట్స్ డే రోజున చాలా ఆనందంగా, సంతోషంగా గెలవాలనే పట్టుదలతో ఎన్నో రకాల ఆటలు ఆడతాము.
(పాఠశాలలు పునఃప్రారంభమమయ్యాక, అసెంబ్లీలో జరిగిన సమావేశం తర్వాత చిన్నారులు వ్రాసిన వారి మనోభావాలు…)
ఈ ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు. అవునని చెప్పాలో, కాదని బాధపడాలో అర్థం కాని పరిస్థితి.
గత సంవత్సర కాలంగా దేశమంతా ఎదుర్కొంటున్న ఉద్విగ్న సందర్భాలను చూస్తోంటే సమాజం తిరోగమనం దిశగా వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో దాదాపు 150 ఏండ్ల క్రితం సమాజం మార్పునకు కృషి చేసిన మహనీయుల సేవలను మరొక్కమారు గుర్తు చేసుకోవాలని అనిపిస్తోంది. ముఖ్యంగా తొలి తరం సామాజిక ఉద్యమకారిణి, ఆధునిక భారతదేశపు తొలి మహిళా
భూమిక ఎడిటర్ గార్కి ,
”భూమిక” నవంబరు సంచికలో డా|| తిరునగరి దేవకీ దేవి గారు ప్రచురించిన ”బతకమ్మ పాటలలో స్త్రీల మనో భావాలు” – పాటల పరిణామ క్రమం అనే పరిశోధన గ్రంధాన్ని అనిశెట్టి రజిత గారు అర్థవంతంగా పుస్తక పరిచయం చేసారు. వారికి ధన్యవాదములు.
భారత ప్రభుత్వంతో రైతులు వీరోచితంగా చేస్తున్న పోరాటాన్ని మండీ దళారుల ప్రోత్సాహంతో నడిపిస్తున్న కృత్రిమ ఉద్యమంగా చిత్రీకరించే పనిని కొందరు మేధావులని ముద్రవేసుకున్న వాళ్ళు భుజానికి ఎత్తుకున్నారు. ప్రస్తుతం తెలుగు నేల మీద అలాంటి పని చేస్తున్న వాళ్ళలో ప్రముఖుడు జయప్రకాష్ నారాయణ (జెపి).
కొండ చరియల్లో చెట్లని చాటు చేసుకుంటూ చకచకా కొండ కిందికి దిగిపోతున్నాడు రాజిరెడ్డి. ఎక్కడా ఆగకుండా లోయలాంటి చోటు వాగు ఒడ్డుకి చేరుకుని చిన్న బండమీద కూర్చుని అప్పుడు మాత్రమే వెనక్కి తిరిగి అల్లంత దూరంలో కొండపైన బొమ్మరిళ్ళలా కనిపిస్తున్న తన గ్రామంవైపు చూశాడు. చెట్ల కొమ్మలు, ఆకుల సందుల్లోంచి కాస్త వెలుతురు సోకుతున్నా తనెవరికీ కనిపించడు, తనకి మాత్రం ఊరు ఒక ప్రక్కంతా స్పష్టంగానే కనిపిస్తోంది. తనని వెంబడించి ఎవరూ రావట్లేదని నిర్ధారించు కున్నాక గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకుని పక్కనున్న చెట్టుకి చేరగిలబడి కూర్చున్నాడు. కళ్ళు మూసుకుంటే కళ్ళముందు తన కూతురు దీపిక ఆమెని పొదివి పట్టుకున్న తన భార్య కన్నమ్మ కనిపించారు. దీపికకి ఇష్టమైనప్పుడే, ఆమెకి ఇష్టమైన వాడితోనే పెళ్ళి చేస్తానని కన్నమ్మకిచ్చిన మాట గుర్తొచ్చింది. దీపికని తనకిమ్మని, తను తీసుకెళ్తానని పదేపదే అడుగుతున్న భూమిరెడ్డి, కుటుంబంతో సహా పెద్ద మనుషుల్తో మాట్లాడడానికి వస్తున్నాడని చూసి వాళ్ళు కొండెక్కి ఇల్లు చేరుకునేలోపు వాళ్ళకి అందకుండా ఊరికి ఆ వైపు నుంచి కొండ దిగేశాడు రాజిరెడ్డి. ఎందుకంటే తన కూతురు దీపికకి పై చదువులు చదవాలని కోరిక, పెళ్ళి వద్దంది.
ఈ మధ్య పత్రికల్లో ఒక వార్త చదివాను, శీతల్ ఆమ్టే ఆత్మహత్య చేసుకుని చనిపో యిందని. అదే సమయంలో తమిళ నాడులో ఒక నటి ఆత్మహత్య చేసుకున్న వార్త. తెలంగా ణలో ఒక తల్లి తన ఇద్దరు కూతుళ్ళతో సహా ఆత్మహత్య చేసుకున్న వార్త. ఒక్కో వార్తా చదువుతున్నప్పుడల్లా మనసు వికలమై పోతూ ఉంది. ఏ ఒక్కరి జీవితానికి పొంతన లేదు. ఒక్కక్కరిదీ ఒక్కో జీవన నేపథ్యం.
ఎక్కడ పదిమంది అంబేద్కర్ బొమ్మ దగ్గర చేరి నినాదాలు ఇస్తున్నా అక్కడ ఒకే ఒక వయసు మళ్ళిన స్త్రీ కనిపిస్తారు. ఎక్కడ దళిత సమస్యపై సభ జరిగినా అక్కడ వేదికపై ఒకే ఒక మహిళ కనిపిస్తారు. క్రిస్మస్ పండగ రోజు తన ఈడు ఆడవాళ్ళంతా కుటుంబంతో చర్చికి వెళ్ళి ఆధ్యాత్మికంగా గడిపితే ఆమె మనుస్మృతి దహన కార్యక్రమంలో ముందుండి మనుస్మృతికి నిప్పంటిస్తారు. వాకపల్లి, లక్షింపేట, గరగపర్రు, రావూరు, ఆగిరిపల్లి, మిర్యాలగూడ, సింగంపల్లి… ఎక్కడ దళితులపై దాడులు జరిగినా అక్కడ జరిగే ఆందోళనలో ఆమె ఉంటారు. దళితులపై దాడికి పాల్పడినవారిని శిక్షించి బాధితులకు న్యాయం చెయ్యమని ఆమె ఎక్కని పోలీస్ స్టేషన్ మెట్లు లేవు. దళితులకు చెందవలసిన ఆర్థిక పథకాల లబ్ది వారికి అందేలా చూడమని ఆమె కలవని ప్రభుత్వాధి కారి లేరు. ఆమె అఖిల భారత దళిత హక్కుల వేదిక (ఎఐడిఆర్ఎఫ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఆర్.మణి సింగ్.
ఇంటికి తాళం పెడుతూ సరిగా పడిందా లేదా అని మళ్ళీ చూసుకుని ఒకసారి ఇంటిముందు ఉన్న చెట్లని, పూలమొక్కలని తనివితీరా చూస్తూ, మనసులో తన అర్ధాంగి లలితను గుర్తు చేసుకున్నాడు మోహనరావు. ఆవిడ ఈ లోకం విడిచి సరిగ్గా నలభై రెండు రోజులు. యాదయ్యకు గేటు తాళం వేసి వెళ్ళమని చెప్పగానే, అతని వెనకాలే సూట్కేస్ పట్టుకొస్తున్న యాదయ్య అట్లాగేనన్నట్టు తలూపాడు గబగబా.
పరిచయం
గమనమే గమ్యం నవలను భూమికలో ధారావాహికంగా ప్రచురించడానికి అనుమతినిచ్చిన ఓల్గాకి ధన్యవాదాలు. డా|| కొమర్రాజు అచ్చమాంబ జీవన స్ఫూర్తితో సాగిన ఈ నవల భూమిక పాఠకుల కోసం. – ఎడిటర్
ఇది పెళ్ళిళ్ళ సమయం. ఎందరో వధూవరులు పెళ్ళిపీటల మీద కూర్చుని పురోహితుడు చదివే మంత్రాలను వింటున్నారు. కొన్నింటిని చిలక పలుకుల్లా పురోహితుడు చెప్పమన్నట్లు చెబుతున్నారు. అందులో ఎందరికి తెలుసు వివాహ మంత్రాల అర్థాలు? పీటలమీద కూర్చున్న వాళ్ళకి తెలియవు. పెళ్ళికి వచ్చిన ఆహుతులకూ తెలియవు, ఎవరో ఒకరిద్దరికి తప్ప.
పచ్చగా, దట్టంగా, నిండుగా, ఏపుగా అడవి అల్లిబిల్లిగా ఉంది. అడవికావల ఏరు యదేచ్ఛగా తేటగా వయ్యారంగా పారుతూ ఉంది. ఏటిగట్టున ఊరుంది. ఊరు ఒద్దికగా, ముద్దుగా, చిక్కుడు పందిరి ప్పుకున్న గుడిసెల్లో నవవధువులా ముచ్చటగా ఉంది. ఊరు చుట్టూ మైదానంలో పోడు వ్యవసాయ భూములున్నాయి. జొన్న, మొక్కజొన్న, ఉలవలు, సామలు పండుతాయి. అది ఆదివాసీల గూడెం.
అందరికీ ఒక మాట సుపరిచితమయింది. అదే ‘కనీస మద్దతు ధర’ (వీూూ-వీఱఅఱఎబఎ ూబజూజూశీత్ీ ూతీఱషవ). ఇది దేశ రాజధాని చుట్టూ మోహరించిన రైతు ఉద్యమం వలనే సాధ్యమయింది. అనేక దశాబ్దాలుగా రైతులు వ్యవసాయంలో సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇప్పటివరకూ 3.5 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. వీటి పరంపర ఇంకా కొనసాగుతూనే