దేశంలో ట్రాన్స్‌జెండర్ల స్థితిగతులు-కఠోర వాస్తవాలు – ప్రచారోద్యమం

భయంకర బాధల పాటల…పల్లవి!

”పూటపూట జేసుకోని బతికెటోళ్ళం…పూటగడవా ఇంతదూరం వచ్చినోళ్ళం… దేశమేమో గొప్పదాయె మా బతుకులేమో చిన్నవాయె… మాయదారి రోగమొచ్చి మా బతుకు మీద మన్ను బోసె… పిల్లజెల్లా ఇంటికాడ ఎట్ల ఉండ్రో… నా ముసలి తల్లి ఏమి బెట్టి సాదుతుందో…” అంటూ కరోనా కాలంలో వేనవేల మంది వలసజీవుల వెతలకి మారుగా మార్మోగింది ఆ పాట. ‘కలిసిమెలిసి కలోగంజో తాగెటోళ్ళం… కష్టకాలం ఇంటికాడ ఉంటా’మని వేడుకున్న కష్టజీవుల కంటి చెలమల్ని ధారగట్టిందా పాట. కానీ, అలా అయినవాళ్ళని తలుచుకోడానికి ఒక ఇల్లూ, మాది అని చెప్పుకోడానికంటూ ఓ ఊరూ కూడా లేని ఇంకా అట్టడుగు అభాగ్యులు-ట్రాన్స్‌జెండర్లు! కరోనా లాక్‌డౌన్‌ సమయంలో కడుపునిండే మార్గం లేక, ఆదుకునే చేయి లేక, ‘ఊరు పొమ్మంటే, కాడు రమ్మంది…’ అన్నట్టు దిక్కులేక విలవిల్లాడారు.

Continue reading

Share
Posted in మనం గళమెత్తకపోతే  | Leave a comment

తెలంగాణ పల్లె కోయిలమ్మ యశోదా రెడ్డి – డా|| కొమర్రాజు రామలక్ష్మి

స్వాతంత్య్రానంతర తెలంగాణ తొలితరం కథా రచయిత్రి అయిన పాకాల యశోదారెడ్డి గారు 1929 ఆగస్టు 8న మహబూబ్‌నగర్‌ జిల్లా (పాలమూరు జిల్లా) బిజినేపల్లి గ్రామంలో కత్తి కాశిరెడ్డి, సరస్వతమ్మలకు జన్మించారు. మూడు తరాలు చూసిన ముత్తవ్వగా పేరు గాంచిన యశోదారెడ్డి గొప్ప కథకురాలు. ఆమె కథలు అచ్చమైన మాండలికంలో ఉన్నాయి. మాండలిక పదాలను ప్రజలు ఎలా పలుకుతారో అదే విధంగా ఆమె కథల్లో రాశారు. ఆధునిక తెలుగు కథా సాహిత్యంలో యశోదారెడ్డి స్థానం విశిష్టమైంది. ప్రాచీన సాహిత్యంపై లోతైన పాండిత్యం, సంస్కృతంపై పట్టు ఉండి కూడా తెలంగాణా భాష ప్రాధాన్యతను గుర్తించిన రచయిత్రి ఆమె. తన 12వ ఏట నుండే కథలు, వ్యాసాలు రాయడం మొదలు పెట్టిన యశోదారెడ్డి 1955లో అంటే తన 25వ ఏట మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా చేరారు. 1955 జులై నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అధ్యాపకురాలిగా, అకడమిక్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా, విద్యార్థి సలహాదారుగా వ్యవహరిస్తూనే ఇంకా అనేక ఇతర పదవీ బాధ్యతలను నిర్వర్తించారు.

Continue reading

Share
Posted in సంస్మరణ | Leave a comment

కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ సమయంలో మహిళలపై పెరిగిన గృహ హింస -కందగట్ల శ్రవణ్‌ కుమార్‌

పితృస్వామ్య అధికారం ఆధారంగా ఏర్పడిన లింగ విభజనలో భాగంగా పుట్టిన గృహ హింసలో అనేక కోణాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్‌.ఓ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళలలో ఒకరు వారి జీవిత కాలంలో శారీరక లేదా లైంగిక హింసను అనుభవిస్తున్నారు. వైవాహిక సంబంధాలలో ఉన్న మహిళల్లో కనీసం 30 శాతం తమ భాగస్వాములచే శారీరక లేదా లైంగిక హింసను అనుభవిస్తున్నారని తెలిపింది. నేషనల్‌ క్రైమ్‌ రీసెర్చ్‌ బ్యూరో (NRCB) ప్రచురించిన ”క్రైమ్‌ ఇన్‌ ఇండియా” రిపోర్ట్‌ 2018, ప్రకారం భారతదేశంలో ప్రతి 1.7 నిమిషాలకు మహిళలపై ఒక నేరం నమోదవుతున్నది. ప్రతి 4.4 నిమిషాలకు ఒక మహిళ గృహ హింసకు గురవుతోంది. ఈ రిపోర్ట్‌ ప్రకారం ఇండియాలో 2018లో మహిళలపై నేరాలకు సంబంధించి 89,097 కేసులు నమోదయ్యాయి. ఇది 2017లో నమోదైన 86,001 కేసుల కంటే ఎక్కువ. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 (National Family Health Survey) 2015-16 ప్రకారం భారతదేశంలో 15-49 ఏళ్ళ వయసు మహిళల్లో 30 శాతం మంది శారీరక హింసను అనుభవిస్తున్నారు. శారీరక, లైంగిక, మానసిక వేధింపులను ఎదుర్కొంటున్న వివాహిత మహిళలలో 83 శాతం మంది వారి భర్తలను ప్రధాన నేరస్తులని, ఆ తర్వాత భర్త తల్లులు (అత్తలు – 56 శాతం), తండ్రులు (మామలు – 33 శాతం), తోబుట్టువులు (ఆడపడుచులు – 27 శాతం) పేర్కొన్నారని తెలిపింది. అంటే దీన్ని బట్టి సామాజిక శాస్త్రవేత్త ఉబెరాయ్‌ (1995) చెప్పినట్లు కుటుంబం హింస, వివక్షతలకు ఒక ప్రదేశంగా అర్థం చేసుకోవచ్చు.

Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

శృంగార దేవత మార్లిన్‌ మన్రో -రొంపిచర్ల భార్గవి

మార్లిన్‌ మన్రో పేరు చెప్పగానే కలల్లో తేలిపోయి వెర్రెక్కిపోయే అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా చాలామందే ఉన్నారు. ఆమె చనిపోయి సుమారు 58 ఏళ్ళయినా అత్యత ప్రజాదరణ పొందిన శృంగార తారగా ఆమె స్థానం చలన చిత్ర ప్రపంచంలో ఈనాటికీ చెక్కుచెదరలేదు. అంతేకాదు అది ఎప్పటికీ చెరిగిపోలేని శాశ్వత స్థానమే అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చలన చిత్ర చరిత్ర మీద చెరిగిపోని సంతకం మార్లిన్‌ మన్రో.

Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వ్యవసాయ రంగంపై నోట్‌ మరియు నిర్దిష్ట డిమాండ్లు – ప్రజా అసెంబ్లీ

తెలంగాణా ప్రజా అసెంబ్లీ – 2020 సెప్టెంబర్‌ 4, 5, 6

తెలంగాణ వ్యవసాయ రంగం గురించి, గ్రామీణ ప్రాంతం గురించి మాట్లాడుకోవడం అంటే రాష్ట్రంలో 65 శాతం జనాభా గురించి చర్చించడం. రాష్ట్ర ఆహార భద్రత గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుకోవడం. మొత్తంగా మెజారిటీ ప్రజల జీవనోపాధుల గురించి మాట్లాడుకోవడం. ఇంత కీలక రంగం గురించి, ఈ రంగంలో వస్తున్న మార్పుల గురించి, ఈ రంగంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాష్ట్ర చట్ట సభలు తప్పకుండా చర్చించాలి.

Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రజారోగ్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక శ్రద్ధ పెట్టాలి – ప్రజా అసెంబ్లీ

సరిపడినంత సురక్షితమైన పోషకాహారము, సురక్షితమైన నీరు, స్వచ్ఛమైన గాలి వంటివి లేని పరిస్థితులలో, ప్రజలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజారోగ్య వ్యవస్థ నిర్లక్ష్యానికి గురై, ప్రైవేటు కార్పొరేట్‌ శక్తులు వైద్య రంగాన్ని వ్యాపారంగా మార్చివేయడంతో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగి పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. ప్రభుత్వ ఆస్పత్రులలో పారిశుధ్యం, మరుగుదొడ్లు, తాగు నీరు వంటి కనీస వసతులపై దృష్టి పెట్టడం లేదు. ప్రజా సమూహాలకు దగ్గరలో అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మందులు, వైద్య పరికరాలు సరిపడినన్ని లేక ఆరోగ్యం విషమించిన పరిస్థితిలో కనీస సేవలు అందించే పరిస్థితిలో లేవు. ఆదివాసీ ప్రాంతాలలో ఇప్పటికీ ప్రజలు పోషకాహార లోపం వల్ల రక్తహీనతతో బాధపడుతున్నారు, గర్భిణీ స్త్రీలలో ప్రసూతి సమయంలో మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మలేరియా తదితర విషజ్వరాలు ఇతర సీజనల్‌ వ్యాధులు ప్రబలి అనేక మంది వైద్యం అందక చనిపోతున్నారు.

Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ -అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…)

సాహితీవ్యక్తిత్వం

భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో తన సమస్త శక్తులతో నిమగ్నం కాకపోయి ఉన్నట్లయితే, స్వాతంత్య్రానంతరం నవ భారత పునర్నిర్మాణంలో, సమాజ సంక్షేమంలో తన పాత్రను, తన వ్యక్తిత్వాన్ని సమర్ధంగా సమర్పించి ఉండనట్లయితే దుర్గాబాయి సాహితీలోకంలో శిఖరాధిష్ఠితురాలై ఉండేది. ఆమెలో సృజనశక్తి అపారం. హృదయ స్పందన అత్యుత్కటం. మానవతా స్పందన అపరిమేయం. గ్రహణధారణ శక్తులు అసదృశం. సమాజతాదాత్మ్యం అవిరతం. మరి ఆమె గొప్ప రచయిత్రి కాగలిగి ఉండేది కాదా! ఆమెకు ఆ అవకాశం కానీ, సమయం కానీ లభించలేదు. ఎనిమిదేళ్ళ వయసుకే దుర్గాబాయి సమాజ చైతన్య కర్తవ్యాన్ని స్వీకరించింది. స్వాతంత్య్రోద్యమ ప్రబోధ కార్యక్రమాన్ని ఉద్యమింపచేసింది.

Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఇంకానా! ఇక చెల్లదు!! – నాంపల్లి సుజాత

(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత)

పుడుతూనే

ఆమె నొసటికి దిష్టిచుక్కై

తోడొచ్చింది బొట్టు.

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

ఔషధం – ఎస్‌. కాశింబి

ఆకలితో పేగులు అరుస్తున్నా

అవమానాలు కురుపులై సలుపుతున్నా

అపనిందలు ఈగలై ముసురుతున్నా

అవరోధాల ముళ్ళు గీసుకుంటున్నా

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

మాట్లాడటం గురించి కొన్ని ఫలానా ఫలానా మాటలు – విమల

నువ్వు ఇప్పుడు మాట్లాడావనుకో

అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అనవచ్చు

పోనీ అపుడు మాట్లాడే ఉంటావనుకో, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనవచ్చు.

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

నిన్ను నువ్వే గెలవాలి

నిన్ను నువ్వే గెలవాలి!

అవును ఇప్పుడు మనమంతా ఇంట్లోనే ూర్చోవాలి!

ముక్కుకు, మూతికి మాస్కులు కట్టుకోవాలి!

కాలు కదపకుండా ఇంట్లోనే టీవీల పరిధిలో మెలగాలి!

Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఛలోనా…. కరోనా

ఛలోనా…. కరోనా !

సరిహద్దులు దాటి వచ్చావ్‌ కరోనా ,

బయలుదేరావా ఇకనైనా

అందరూ నీ దాటికి హైరానా,

మాకు లేదా విముక్తి ఇప్పుడైనా.

Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

కరోనా వైరస్‌ — ఎస్‌. సుష్మ , 10 వ తరగతి

ఓ కరోనా

2019 లో వచ్చావ్‌

2020 నీ ముంచావ్‌

ప్రపంచాన్ని గడగడలాడించావ్‌

ఎన్నడూ లేని లాక్‌డౌన్‌ పద్ధతిని తీసుకొచ్చావ్‌

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

భూమిక – సెప్టెంబర్, 2020

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

కరోనా కష్ట కాలంలో సమంత సాహసం – కొండవీటి సత్యవతి

దేశం మొత్తానికి తాళం పడిన రోజులు. మార్చి 22 జనతా లాక్‌డౌన్‌ అంటూ మొదలైన సుదీర్ఘ లాక్‌డౌన్‌ పీరియడ్‌. ఎవ్వరం గడపదాటని, దాటలేని పరిస్థితి. ఎలాంటి హెచ్చరికలూ లేకుండా, ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా రేపటినుండి మీరంతా మీ ఇళ్ళకు తాళాలేసుకుని ఇంట్లో కూర్చోండి అంటూ ప్రభుత్వం తాఖీదులు జారీ చేసిన సమయం. అర్థరాత్రి నోట్లు బందు చేసిన లాంటి పరిస్థితన్నమాట. కరోనా వైరస్‌ గురించిన వార్తలు, విమానాశ్రయాలు, విదేశాల్నుంచి వచ్చిన వాళ్ళ గురించి మాత్రమే వింటున్నాం అప్పుడు. అలాంటిది ఎలాంటి హెచ్చరికలూ లేకుండా 130 కోట్లమంది జనం రేపటినుండి ఇంట్లో కూర్చోండి అంటే ప్రతిరోజు పనిచేస్తేనే గానీ పూట గడవని పేద ప్రజలు 80% ఉన్న దేశంలో అలా ఇంట్లో కూర్చోవడం ఎలా సాధ్యమౌతుంది? కనీసం రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా వారి సంక్షేమం కోసం ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా ఉరమని పిడుగులా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేసిన లాక్‌డౌన్‌ పాడుకాలం.

Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

చిట్టెమ్మల చింతలు తీరేదెలా! -పి. ప్రశాంతి

తెలతెలవారుతున్నట్టు తెలుస్తోంది. పిట్టల కిలకిలా రావాలు… చేలుదాటి చెరువు మీదుగా వీస్తున్న పిల్ల తెమ్మెరలు… మబ్బుల్ని చీల్చుకుని బైటపడాలని చూస్తున్న భానుని తొలికిరణాలు.. వీటితోపాటు బరువుగా వేలాడబడుతున్న తన డైపర్‌… తెల్లవారబోతోందని తెలియచేస్తున్నాయి.

Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment