దాక్షిణాత్య సాహిత్యంలో తొలిదశ కవయిత్రులు – బోడి నాగశేషు

ప్రాచీన సాహిత్యంలో స్త్రీలు రచన చేయడానికి సరైన మేథో సంపత్తి, విద్య ఉన్నా కూడా, వారికున్న అప్పటి పరిమితులు, వారి దృక్పథం, రచనా వ్యాసంగం పట్ల అనాసక్తి, నిర్బంధాలు, కట్టుబాట్లు, అంతకుమించి స్త్రీ రచనా సాంప్రదాయం ఆ కాలం నాటికి లేకపోవడం వల్ల మహిళా కవయిత్రులు ప్రారంభ దశలో అరుదుగా కనిపించడానికి కారణంగా చెప్పుకోవచ్చు. వీటన్నింటినీ ఛేదించుకొని సీతాకోక చిలుకలుగా పేరు తెచ్చుకొన్న విదుషీమణులూ లేకపోలేదు. అయితే వీరిలో వారి జీవిత కాలాదులు సరిగా తెలియకపోవడం, రచనలు అలభ్యం కావడంతో మనిషి ఉండి నీడ లేనట్లు, నీడ ఉండి మనిషి లేనట్లు అయిపోయింది. లభ్యమవుతున్న ఆధారాలను బట్టి దాక్షిణాత్య సాహిత్యంలోని తొలిదశ కవయిత్రులను పరిచయం చేస్తున్నాను. తమిళ సాహిత్యంలో కడసంగకాలంలో వెలసిన గ్రంథాలలో అగనానూఱు, పుఱనానూఱు పేర్కొనదగ్గ రచనలు. అగనానూఱు ప్రణయ గీతాలకు సంబంధించిన గ్రంథం, పురనానూఱు వీరగీతాల సంపుటం. ఈ రెండు గ్రంథాల్లోను తమిళ మహిళల విషయాలను తెలుసుకోవచ్చు. సంగం కాలానికి పురుషులతో ఉండేవారని, వారికి సంఘంలో విశేష గౌరవాలు దక్కేవని తెలుస్తోంది. సంగీత, సాహిత్యాలలోనే కాకుండా ఇతర శాస్త్రాల్లోను పాండిత్యాన్ని గడించారని అవగతమవుతోంది. సంగం కాలానికే యాభై మంది కవయిత్రులుండేవారు. పుఱనానూఱు గ్రంథంలో ఒక వీరనారి, ఆమె తండ్రి యుద్ధభూమిలో అశువులు బాస్తాడు. ఆమె భర్త కూడా యుద్ధ వీరుడే. శత్రువుల ఆధీనంలో ఉండే అలమందలను తన వశం చేసుకుని యుద్ధంలో చనిపోతాడు. ఈ వార్తలు విని కంటతడి పెట్టలేదు ఆమె. ధైర్యంగా తన కొడుకును దగ్గరకు తీసుకొని తలకు నూనె రాసి, జుట్టు ముడి వేసి తెల్లని గుడ్డలు వేసి, చేతికి ఖడ్గం ఇచ్చి యుద్ధభూమికి వెళ్ళమని ఆదేశించింది. ఇక్కడ తెలుగులో చానమ్మ గుర్తుకువస్తుంది. ఈ వీరగాథను ‘మాశాత్తియార్‌’ పద్యరూపంలో రచించారు (పుట.269 అఖిల భారత కవయిత్రులు) ఈమెను తొలి కవయిత్రిగా తమిళ సాహిత్యంలో కీర్తించబడలేదు. తొలిదశలో ఇంచుమించు దేశభక్తికి సంబంధించిన సాహిత్యాన్నే రచించినట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా తమిళ కవయిత్రులలో కాక్కైపాడినియర్‌… ఈమె లక్షణశాస్త్ర రచించినట్లు తెలుస్తున్నది కానీ అది అలభ్యం. అళ్ళూర్‌ నన్‌ ముల్లైయార్‌… ఈమె సంగకాలానికి చెందిన కవయిత్రుల్లో ఒకరు. ళిరుకాక్కై పాడినియార్‌, నచ్చెళ్ళెయార్‌ లాంటి కవయిత్రులు అడపా దడపా రచనలు చేసినా వీరి రచనలు అలభ్యం. అందువల్ల వీరికి గుర్తింపు దక్కలేదు. అవ్వైయారు తమిళ తొలి కవయిత్రి అని చెప్తారు. ఈమె సూక్తులను వివరించారు. తొలిదశ తమిళ సాహిత్యంలో అన్ని జాతుల వారు ఉన్నారు. దీన్నిబట్టి తెలిసిందేమంటే తమిళ మహిళలు దక్షిణాదిలో పురుషులతో సమానంగా చదువుకోవడం, తద్వారా వారి స్థాన మానాల్లో స్థాయిని పెంచుకోగలిగారు. ఈ విషయాల్లో తెలుగునాడు లోని మహిళలు వెనుకబడ్డారు. ఎప్పుడైతే విద్య లేదో అప్పుడు అన్ని రంగాల్లోను స్త్రీలు వెనుకబడిపోతారు. జాతి వ్యవస్థ కూడా వీరు వెనుకబడడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.

Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

నిరుడు వెలిగిన దీపశిఖలు – డా|| షేఖ్‌ మహబూబ్‌ బాషా

బ్రిటిషాంధ్రలో మహిళోద్యమం ముమ్మరంగా నడిచింది. తమ రచనల ద్వారా, మహిళా సంఘాల నిర్మాణం ద్వారా బలమైన మహిళోద్యమాన్ని నిర్మించారు బ్రిటిషాంధ్రలోని స్త్రీలు. వీరు ముఖ్యంగా స్త్రీల పత్రికలైన ‘తెలుగు జనానా’, ‘హిందూ సుందరి’, ‘సావిత్రి’, ‘వివేకవతి’, ‘అనసూయ’, ‘ఆంధ్రలక్ష్మి’, ‘గృహలక్ష్మి’, ‘ఆంధ్రమహిళ’ మొదలైన వాటిలో తమ రచనల్ని ప్రచురించేవారు. 1910 చివరినాటికే మహిళా రచయితల సంఖ్య ఎంతగా పెరిగిందంటే 1902లో ప్రారంభమైన ‘హిందూ సుందరి’లో 1909 నాటికి సుమారు వందమంది స్త్రీలు తమ రచనల్ని ప్రచురించారు. జూన్‌ 1909 నాటికి తమ రచనల్ని ప్రచురించిన 84 మంది స్త్రీల పేర్లను ఇచ్చారు ‘హిందూసుందరి’ స్థాపకులైన సత్తిరాజు సీతారామయ్య. 1910 నాటికే ఇంతమంది మహిళా రచయితలుంటే వలస పాలనానంతరం నాటికి ఎంతమంది మహిళలు రచయితలుగా రూపుదిద్దుకుని ఉంటారో సులభంగా ఊహించవచ్చు.

Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

ప్రకృతితో స్త్రీ మమేకత బతుకమ్మ! – అనిశెట్టి రజిత

మన ఉనికికి మూలం ప్రకృతి, సకల చరాచర ప్రాణులకు జన్మనిచ్చింది ప్రకృతి. ఆ ప్రకృతి సంపూర్ణ ఆరాధనే బతుకమ్మ పండుగ వేడుక. ఈ పండుగ ఒక ఉత్సాహం, ఉల్లాసమే కాదు సంఘ జీవన తాత్వికతకు నిదర్శనం. మానవ సంబంధాల్లేని స్నేహ మాధుర్యాలకు ప్రతీక. అన్నింటినీ మించి ”బతుకు”ను నిర్వచించే నిలువెత్తు జీవధనం! మానవాళి మనుగడకు దీవెనలతో శాసించే ప్రేమగుణం!

Continue reading

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

గణన పాత్ర మీ గణిక – చందనాల సుమిత్రాదేవి

ఇందులోని కథలన్నీ దాదాపు వాస్తవిక సంఘటనల ఆధార ఇతివృత్తాలతో రచింపబడ్డప్పటికీ రచయిత్రి భండారు విజయ గారు ఈ కథనంలో ఎక్కడా వినిపించరు, కనిపించరు. కానీ, ఆ వాస్తవ ఘటనల తాలూకు గాఢతను, ముద్రలను మనపై వేస్తూ భారమైన, ఛిద్రమైన, వేదనాభరితమైన మన హృదయాలపై తాను ఎంచుకొన్న లక్ష్యాలను ఆవిష్కరింపచేస్తూ అప్రతిహతంగా విజయ పథంలో సాగిపోతూ ఉంటారు. వేదనతో భారమైన, జుగుప్సతో నిండిపోయిన, శకలాలుగా విరిగిపడిన హృదయ శిథిలాలపై సాధించిన ఆశావహ భవిష్యత్‌ చిత్రణ గావిస్తూ పోతుంటారు.

Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

యువత హక్కులు – ప్రచారోద్యమం

పరిచయం:

యువ జనం ఈ నాటి సృజన కారులు, అన్వేషకులు, నిర్మాతలు, నాయకులు. స్వాతంత్య్రపు 74వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న భారతదేశం 29 సం||రాల సగటు వయస్సు ప్రపంచంలో యువ జనాభాకు ఆవాసంగా ఉన్న దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. మొత్తం జనాభాలో యువత 28%గా ఉండి ఆర్థికాభివృద్ధి పెంపుదలకు అవసరమైన శక్తిని ఇచ్చే జనభాగం కలిగి ఉంది. అలాగే ప్రపంచంలోనే అత్యధికంగా 24.3 కోట్ల మంది కౌమార వయస్కులను కలిగిన దేశం మనది. భవిష్యత్తు పౌరులుగా ఎదిగేందుకు ఈ పెద్ద సమూహానికి అవసరమైన మద్దతును ఇచ్చి బలం చేకూర్చడానికి సృజనాత్మకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే అభివృద్ధి గణాంకాలు గత దశాబ్దంలో మందగించడం, సేవారంగం తక్కువ వేతనం నైపుణ్యం లేని ఉపాధి వైపుగా విస్తరించడం మనం గమనిస్తున్నాం. నాణ్యమయిన విద్యా అవకాశాలు కొరవడడం, వృత్తి నైపుణ్యాలు, అభివృద్ధి పథకాలు సరిపడేంతగా లేకపోవడం అనేవి యువజనం గౌరవప్రదమైన ఉపాధి, సంక్షేమం పొందగలగడంపై ప్రభావం చూపుతున్నాయి.

Continue reading

Share
Posted in మనం గళమెత్తకపోతే  | Leave a comment

ఇంటి పనివారి గురించిన వాస్తవాల ప్రకటన – ప్రచారోద్యమం

సంక్షిప్త పరిచయం: దేశ, రాష్ట్ర చట్టాల రక్షణ లేకుండా ఇళ్ళల్లో మూసి ఉన్న తలుపుల వెనుక కనబడకుండా చాకిరీ చేస్తూ ఉండే తరగతి శ్రామికులు పనివారలు. కుటుంబంలో స్త్రీలు చేసే చాకిరీకి, ఇంటి పనికి సామాజికంగా విలువలేని తనాన్ని ప్రతిబింబిస్తూ ఈ పనివారు చేసే పనులు ”శ్రమ”గా గుర్తింపబడవు. నిజానికి 90% ఇంటి వనివారు స్త్రీలే. ఆసియాలో స్త్రీలకు ఇది సాధారణంగా లభించే వృత్తి. ఈ ప్రాంతంలో ఇంటిపని మొత్తంగా స్త్రీలకు లభించే ఉపాధిలో మూడో వంతుగా ఉంది.

Continue reading

Share
Posted in మనం గళమెత్తకపోతే  | Leave a comment

పల్లె నుంచి పంతులమ్మగా… రచయిత్రిగా…!! ఓ గ్రామీణ స్త్రీ జీవన ప్రయాణం – కల్పనా రెంటాల

లలిత గారు నాకు దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుసు. అల్లాడి ఉమ, ఎం.శ్రీధర్‌ వాళ్ళ ఇంట్లో చూశాను. చాలా నెమ్మదస్తురాలు. ఒద్దికగా మాట్లాడే మనిషి. మృదు స్వభావి, స్నేహశీలి. ఆమె గురించి నాకు ఇంతే తెలుసు. ఉమ, శ్రీధర్‌లతో సాహిత్య చర్చలు చేసేటప్పుడు, ఉమ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ దూరపు బంధువు ఒకామె ఉన్న రోజుల్లో… లలిత గారు వంటింట్లో నుంచి ఓ కప్పు కాఫీతో పాటు చిరునవ్వుని కూడా అందించి ఇచ్చేవారు. అది లలిత గారితో మా తొలినాటి పరిచయం.

Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ – అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…)

ఆంధ్ర మహిళ

ఆంధ్ర మహిళ అనే పదబంధం వినిపించగానే దుర్గాబాయి వ్యక్తిత్వం దాని సమానార్థకంగా స్ఫురిస్తుంది. అట్లానే దుర్గాబాయి పేరు వినబడగానే ఆంధ్ర మహిళా సభ కళ్ళముందు రూపు కడుతుంది. ఈ మూర్తులకు అంతటి అవినాభావ సంబంధం ఉంది. 1938లోనే ఆంధ్ర మహిళా సభకు అంకురార్పణ జరిగిందనుకోవాలి. 1937లో మద్రాసు అసెంబ్లీకి బులుసు సాంబమూర్తిగారు స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత దుర్గాబాయి కుటుంబం మద్రాసు చేరింది. దుర్గాబాయి తమ్ముడు నారాయణరావు సాంబమూర్తిగారి వ్యక్తిగత సహాయక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు దుర్గాబాయి ఇంకా వాల్తేరులో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో ఆనర్సు చదువుతోంది. వేసవి కాలపు సెలవులలో ఆమె మద్రాసు వచ్చి కుటుంబంతో గడిపేది. అప్పుడు వాళ్ళు 14, ద్వారకా, మైలాపూరులో ఉండేవారు. దుర్గాబాయమ్మ తల్లిగారు కృష్ణవేణమ్మ గారు ఏనాడూ నిర్వ్యాపారంగా కాలాన్ని గడిపే వ్యక్తి కాదు. ఇరుగు పొరుగు మహిళలూ, వాళ్ళ పిల్లలూ ఆమె చుట్టూ చేరేవారు. ఆమె అక్కడ సేవా సదన్‌ స్కూల్లో టీచర్‌గా కూడా పనిచేసేవారు. ఆమె ఇంటి దగ్గర తీరిక వేళల్లో పిల్లలకు పాటలు, పద్యాలు, హిందీ పాఠాలు, నాటక ప్రదర్శనలు, రంగవల్లులు తీర్చడాలు నేర్పుతుండేవారు. అట్లా 14, ద్వారకా, మైలాపూర్‌లో కృష్ణవేణమ్మగారు ఒక మహిళా సమితిని ఏర్పరచిన మూడు నెలల్లో 30 మంది దాకా సభ్యులు చేరారు. ‘లిటిల్‌ లేడీస్‌ ఆఫ్‌ బృందావన్‌ కాలనీ’ అని మురిపమైన పేరు సంపాదించుకొన్నదా సమితి.

Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

అవును కదా…! – తుర్లపాటి లక్ష్మి

ఇంకో ఘటన

ఉత్తర ప్రదేశ్‌లో

తెలంగాణ రాజధాని భాగ్యనగర్‌లో

జరిగిన దిశారెడ్డి గాయం పచ్చితనం

ఇంకా ఆరనేలేదు

పనిదానిపై అత్యాచారం… హత్య

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

ఓ అమ్మాయీ! – ఉమా నూతక్కి

ఓ అమ్మాయీ…

పుట్టాక మెత్తటి పక్క మీద నిద్రపుచ్చగలిగే బ్రతుకుల కన్నా

ఒక్క చుక్క పాలు ఇవ్వలేని ఎండిన గుండెలున్న

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

పుట్టుకతో వృద్ధులు…! – నాంపల్లి సుజాత

పొద్దన్నా పొడవనీరు

కొత్తబిచ్చగాళ్ళు

సొల్లువాగుళ్ళకు సిద్ధమై

బయల్దేరుతారు ప్రబుద్ధులు

రాలిపోతున్న తాళపత్రాల్లోంచి

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

‘మిస్టర్‌ చింకూ’ – సహకలన

ముందుగా ఈ పుస్తకాన్ని నేను సమీక్షకు ఎంచుకోవడానికి కారణం ఇందులోని కథను మనుషులకు కూడా అప్లై చేసుకుని ఆలోచిస్తే కష్టాలు ఎదురైనప్పుడు యుక్తితో సమస్యల నుండి బయటపడాలి అంతే తప్ప నీరుకారి పోకూడదు అనే భావన.

Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

భూమిక – అక్టోబర్, 2020

భూమిక – అక్టోబర్, 2020

Share
Posted in కవర్ పేజీ, ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన 

భూమిక ఎడిటర్‌ గార్కి ,

అమ్మ నాకు post women భూమికను తెచ్చి ఇస్తుంది. ఎప్పుడైనా బుద్ది పుట్టి ఇతనికి వచ్చే భూమికలో ఏమి ఉంటుంది అని చూస్తే నేను తల ఎత్తుకునేలా భూమిక తీర్చి దిద్దుతున్న తల్లులందరికి ఏమిచ్చి ఈ ఋణాన్ని తీర్చుకోవాలి అని ఆలోచిస్తుంటే నిజంగా ఏదో ఒక రచన చేయాలి అబ్బా రోజు రోజు వీడి సుత్తి భరించలేకపోతున్నామే అనుకునేలా కాకుండా నిజాయితీతో వ్రాయాలని ప్రయత్నిస్తూ !

Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

మహిళా రైతుల అంశాలు ప్రధాన ఎజెండాలో ప్రతిఫలించాలి -కొండవీటి సత్యవతి 

నా చిన్నతనంలో నేనెప్పుడూ అనుకునేదాన్ని మా ఇంట్లో ఆడవాళ్ళెవరూ పొలానికి ఎందుకెళ్ళరని. మా అమ్మగాని, పిన్నమ్మ, పెద్దమ్మలు కానీ ఎప్పుడూ పొలానికెళ్ళినట్లు నేను చూడలేదు. మా తాతకి బోలెడంత పొలముండేది. మా నాన్న మాత్రం ఎప్పుడూ పొలంలోనే

Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఆమె అపరాజిత కాదు మహావిజేత -డా|| చల్లపల్లి స్వరూపరాణి

ఆమె లేని దారి లేదు

ఆమె నాట్లేసి కలుపు తీసి

కోతకోసి కుప్పలేసి

అంట్లు కడిగి దొడ్లు కడిగి

పిల్లా జెల్లా

ముసలీ ముతకా

Continue reading

Share
Posted in మిణుగురులు  | Leave a comment