ప్రాచీన సాహిత్యంలో స్త్రీలు రచన చేయడానికి సరైన మేథో సంపత్తి, విద్య ఉన్నా కూడా, వారికున్న అప్పటి పరిమితులు, వారి దృక్పథం, రచనా వ్యాసంగం పట్ల అనాసక్తి, నిర్బంధాలు, కట్టుబాట్లు, అంతకుమించి స్త్రీ రచనా సాంప్రదాయం ఆ కాలం నాటికి లేకపోవడం వల్ల మహిళా కవయిత్రులు ప్రారంభ దశలో అరుదుగా కనిపించడానికి కారణంగా చెప్పుకోవచ్చు. వీటన్నింటినీ ఛేదించుకొని సీతాకోక చిలుకలుగా పేరు తెచ్చుకొన్న విదుషీమణులూ లేకపోలేదు. అయితే వీరిలో వారి జీవిత కాలాదులు సరిగా తెలియకపోవడం, రచనలు అలభ్యం కావడంతో మనిషి ఉండి నీడ లేనట్లు, నీడ ఉండి మనిషి లేనట్లు అయిపోయింది. లభ్యమవుతున్న ఆధారాలను బట్టి దాక్షిణాత్య సాహిత్యంలోని తొలిదశ కవయిత్రులను పరిచయం చేస్తున్నాను. తమిళ సాహిత్యంలో కడసంగకాలంలో వెలసిన గ్రంథాలలో అగనానూఱు, పుఱనానూఱు పేర్కొనదగ్గ రచనలు. అగనానూఱు ప్రణయ గీతాలకు సంబంధించిన గ్రంథం, పురనానూఱు వీరగీతాల సంపుటం. ఈ రెండు గ్రంథాల్లోను తమిళ మహిళల విషయాలను తెలుసుకోవచ్చు. సంగం కాలానికి పురుషులతో ఉండేవారని, వారికి సంఘంలో విశేష గౌరవాలు దక్కేవని తెలుస్తోంది. సంగీత, సాహిత్యాలలోనే కాకుండా ఇతర శాస్త్రాల్లోను పాండిత్యాన్ని గడించారని అవగతమవుతోంది. సంగం కాలానికే యాభై మంది కవయిత్రులుండేవారు. పుఱనానూఱు గ్రంథంలో ఒక వీరనారి, ఆమె తండ్రి యుద్ధభూమిలో అశువులు బాస్తాడు. ఆమె భర్త కూడా యుద్ధ వీరుడే. శత్రువుల ఆధీనంలో ఉండే అలమందలను తన వశం చేసుకుని యుద్ధంలో చనిపోతాడు. ఈ వార్తలు విని కంటతడి పెట్టలేదు ఆమె. ధైర్యంగా తన కొడుకును దగ్గరకు తీసుకొని తలకు నూనె రాసి, జుట్టు ముడి వేసి తెల్లని గుడ్డలు వేసి, చేతికి ఖడ్గం ఇచ్చి యుద్ధభూమికి వెళ్ళమని ఆదేశించింది. ఇక్కడ తెలుగులో చానమ్మ గుర్తుకువస్తుంది. ఈ వీరగాథను ‘మాశాత్తియార్’ పద్యరూపంలో రచించారు (పుట.269 అఖిల భారత కవయిత్రులు) ఈమెను తొలి కవయిత్రిగా తమిళ సాహిత్యంలో కీర్తించబడలేదు. తొలిదశలో ఇంచుమించు దేశభక్తికి సంబంధించిన సాహిత్యాన్నే రచించినట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా తమిళ కవయిత్రులలో కాక్కైపాడినియర్… ఈమె లక్షణశాస్త్ర రచించినట్లు తెలుస్తున్నది కానీ అది అలభ్యం. అళ్ళూర్ నన్ ముల్లైయార్… ఈమె సంగకాలానికి చెందిన కవయిత్రుల్లో ఒకరు. ళిరుకాక్కై పాడినియార్, నచ్చెళ్ళెయార్ లాంటి కవయిత్రులు అడపా దడపా రచనలు చేసినా వీరి రచనలు అలభ్యం. అందువల్ల వీరికి గుర్తింపు దక్కలేదు. అవ్వైయారు తమిళ తొలి కవయిత్రి అని చెప్తారు. ఈమె సూక్తులను వివరించారు. తొలిదశ తమిళ సాహిత్యంలో అన్ని జాతుల వారు ఉన్నారు. దీన్నిబట్టి తెలిసిందేమంటే తమిళ మహిళలు దక్షిణాదిలో పురుషులతో సమానంగా చదువుకోవడం, తద్వారా వారి స్థాన మానాల్లో స్థాయిని పెంచుకోగలిగారు. ఈ విషయాల్లో తెలుగునాడు లోని మహిళలు వెనుకబడ్డారు. ఎప్పుడైతే విద్య లేదో అప్పుడు అన్ని రంగాల్లోను స్త్రీలు వెనుకబడిపోతారు. జాతి వ్యవస్థ కూడా వీరు వెనుకబడడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.
-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
July 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
