ఒక స్వప్నం – బి.గోవర్ధనరావు

ఆమె –

తనను… అడ్డుకుంటున్న అవరోధాల్ని అధిగమించి

చుట్టూ పరుచుకున్న సంక్షోభతెరల్ని దాటుకొని

అక్షరాల్ని ప్రాణప్రదంగా చూసుకొని… శ్రద్ధగా నేర్చుకుని

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

మనకు మనమే ఆయుధాలం! – శిలాలోలిత

చెట్టు కొమ్మలు నరుకుతుంటేనే

ఆకులన్నీ దుఃఖంతో గడ్డ కట్టుకుపోయి

ముడుచుకుపోయి భూమి కనురెప్పల్లో కాల్వలవుతాయి

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

సగం సగం – యల్‌. రాజా గణేష్‌

దాంపత్య జీవితం మూడే మూడు ముడులతో

మొదలైనా అనేకానేక పీఠముళ్ళూ చిక్కుముళ్ళూ పడి

కాలకొలమానం హీనాతిహీనంగా ఒకవైపుకే

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

శిక్ష – నామని సుజనాదేవి

తప్పు చేస్తే శిక్ష పడడమే గగనమనే రోజుల్లో

కానీ అక్కడ చేయని తప్పుకు శిక్ష పడుతుంది

కట్టుకున్నవాడు కాలగర్భంలో కలిసిపోయాడని

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

భూమిక – నవంబర్, 2020

భూమిక – నవంబర్, 2020

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

పోలీస్‌ అమర వీరులకు నివాళి, స్మృత్యంజలి – కొండవీటి సత్యవతి 

ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలను రక్షించాల్సిన గురుతరమైన బాధ్యతతో పోలీసు శాఖ పనిచేస్తుంది. శాంతి భద్రతలను కాపాడడం, ప్రజల ధన, మాన రక్షణ చేయడం పోలీసుల ప్రథమ బాధ్యతగా ఉంది. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా ఠక్కున గుర్తొచ్చేది పోలీసులే. అందుకే వారు రక్షక భటులయ్యారు. ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత రక్షక భటులది. 100 నెంబర్‌ పోలీసుల ఎమర్జెన్సీ నెంబర్‌. సర్వకాల, సర్వావస్థల్లోను, ఇరవై నాలుగు గంటలూ ఈ నెంబరు మోగుతూనే ఉంటుంది. కాల్స్‌ తీసుకుంటూనే ఉంటారు. ఉరుకులు, పరుగులతో కాల్‌ వచ్చిన దగ్గరకు వెళ్తారు. ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారు.

Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

అడుగడుగునా సుడిగుండాలు దాటే ఆడపిల్లలు – పి. ప్రశాంతి

చిన్నగా, ఒక్కొక్కటిగా మొదలైన పిట్టల కిలకిలలు, అంతలోనే బృందగానాలూ అన్నీ కలిసి సుప్రభాతం ఆలపించడం ప్రారంభిం చాయి. దుప్పటి ముసుగులా కప్పుకుని ముడుచుకు పడుకున్న శిరీష మరింత మునగ దీసుకుంది. రాత్రి మొదలైన పీరియడ్స్‌తో కడుపునొప్పి మొదలై బద్దకంగా ఉండి లేవాలని పించట్లేదు. పక్కింటి పద్మత్త వాకిలూ డుస్తున్న చప్పుడు, ఎదురింటి అలివేలు పిన్ని పాలు పిండ డానికి ప్రయత్నిస్తూ బర్రెని, దూడని అదిలిస్తున్నది చెవుల పక్కనే వినిపిస్తున్నట్టుంటే దుప్పటితో పాటు చేతుల్తోనూ చెవులు మూసుకుంది. పది గజాలు కూడా దూరం లేని ఇళ్ళు మరి.

Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఓ అమ్మాయీ! -ఉమా నూతక్కి

ఇదే మొదటిసారి కాదు, ఇదే చివరిదన్న భరోసా అస్సలు లేదు. అయినా ప్రతిసారీ దుఃఖం ముంచి లేపుతుంది. అక్షరాలు అల్లుకుపోయేంత దుఃఖం. అయినా మళ్ళీ మళ్ళీ రాస్తాం. ఎంత మంది ఎన్ని రాసినా, మానుపడుతున్న పాత గాయాల మీద కొత్తగా అయిన గాయం మళ్ళీ నిద్రని దూరం చేస్తుంది. జీవితం పట్ల భయాన్ని కలుగ చేస్తుంది. ఇదిగో ఇక్కడితో ఇది ఆగిపోతుంది…ఇదే ఆఖరుది అనుకోవడానికి అవకాశం ఎప్పుడూ ఈ ప్రపంచం స్త్రీకి ఇవ్వడం లేదు. గాయం… గాయం మీద గాయం… గాయం వెనుక గాయం… ఎడతెగని గాయం… గాయం!!! గాయం!!! గాయం!!! మనం గాయం మీద తొడగబడిన శరీరాలం…!

Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

జనం ప్రేమ గెలుచుకున్న అడవి చుక్క -డా|| చల్లపల్లి స్వరూపరాణి

ఆదివాసీ సమూహాలలో ఇప్పటికీ చాలావరకు మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ తాలూకు లక్షణాలు కొనసాగుతున్నాయి. వాటిలో ‘కోయ’ తెగ ఆదివాసీ తెగ మాతృస్వామిక సంస్కృతికి ఒక ఆదిమ బిడ్డ వంటిది. అమ్మాయి ఇతర కులం అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే అతని నాలుక మీద కాల్చిన ఇనుపకడ్డీతో వాత పెట్టి, అల్లుడికి తమ ఇంటిపేరు ఇచ్చినాక కానీ వాళ్ళు తమ ఇంటికి రానివ్వరు. అటువంటి తెగలో పుట్టిన ఒక కొండ దొరసాని… ఆదివాసుల సాధికారతను కాలరాసిన మధ్యయుగాల నాటి రాజ్య దురహంకారం మీద వీరోచితంగా పోరాడి తమ స్వాభిమానాన్ని చాటిన సమ్మక్క, సారలమ్మల పోరు వారసత్వం ఆమెది. ఆమె పేరు ‘ధనసరి అనసూయ’ అలియాస్‌ ‘సీతక్క’. అడవిలో పుట్టి అడవిలో పెరిగిన సీతక్కకి కష్టాలు, కడగండ్ల గురించి పుస్తకాలలో చదవాల్సిన పనిలేదు. గ్రంథాలయాలలో ఉండే పుస్తకాలకు మించిన జ్ఞానం ఆమెకి అనుభవాల నుంచి అబ్బింది. పట్టణాలకు, గ్రామాలకు దూరంగా విసిరేసిన కోయ గూడెంలో అరకొర సౌకర్యాలు, అగచాట్ల మధ్య పెరిగిన తనకి ఆకలి రుచి తెలుసు.

Continue reading

Share
Posted in మిణుగురులు  | Leave a comment

కరోనా కల్లోల సమయంలో… – రోజా రమణి

కరోనా నేపథ్యంలో చాలామంది తమ అనుభవాలను పంచుకున్నారు. నేను ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది అనుకున్నా కానీ రాస్తే బాగుంటుందని ఒక మిత్రుడు ఇచ్చిన సలహాతో ఈ సాహసం చేస్తున్నా.

Continue reading

Share
Posted in కరోనా డైరీస్ | Leave a comment

నకిలీ!! – పరిమళ పప్పు

ఉదయాన్నే పేపర్‌ చదువుతూ, కాఫీ తాగుతూ ఉన్న చంద్రంతో పక్కనే కూర్చుని వాట్సాప్‌లో మెసేజ్‌లు చూస్తున్న భార్య భానుమతి ”ఏమండీ. ఈ రోజు పేపర్లో మీ కథ పడింది చూశారా?!” అని అడిగింది.

Continue reading

Share
Posted in కధలు | Leave a comment

స్త్రీవాద కవిత్వం – ఆవిర్భావ, ఆవశ్యకతలు – సూరేపల్లి పద్మావతి

వస్తు వైవిధ్యం అనేది ఆధునిక కవిత్వ ప్రత్యేక లక్షణం. ప్రాచీన కవితా ధోరణులైన పురాణ కవిత్వం, ప్రబంధ కవిత్వాలలో కథా ఇతివృత్తం ప్రసిద్ధం, నాయికా నాయకులు దివ్వులు, దివ్యాదివ్యులు అనే నియమం ఉండడం వల్ల వస్తు వైవిధ్యానికి అవకాశం తక్కువ. మానవాతీతమైన వ్యక్తుల చుట్టూ, శక్తుల చుట్టూ పురాణ, ప్రబంధాలు పరిభ్రమించడం వల్ల వస్తువునకు పరిమితులేర్పడినాయి. ఆధునిక కవిత్వం అనేది ఆధునిక జీవితమంత విశాలమైనది, ప్రపంచమంత విస్తృతమైనది, సమాజమంత లోతైనది కావడం వల్ల సహజంగానే వస్తు వైవిధ్యానికి అవకాశం లభించింది. దళితవాద కవిత్వం, స్త్రీవాద కవిత్వం, మైనారిటీవాద కవిత్వం మొదలైనవి శాఖోపశాఖలుగా ఆధునిక కవిత్వం వస్తు విస్తృతిని, వైవిధ్యాన్ని సాధించింది.

Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆహార భద్రతే కాదు, ఆహార సార్వభౌమత్వం, ఆహార న్యాయం కావాలి – ప్రజా అసెంబ్లీ

ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పేద, అణగారిన వర్గాలలో ప్రజలందరికీ సామాజిక భద్రతను కల్పించే పథకాలు అందడంలేదు. అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు, పెన్షన్లు, సురక్షితమైన ఆహారం, పోషకాలతో కూడిన ఆహారం అందుబాటులో లేవు. ముఖ్యంగా పేద వర్గాలకు రేషన్‌ దుకాణాలలో బియ్యం ఇవ్వటమే ఆహార భద్రతగా చెప్పబడుతోంది. పోషకాహార లోపం కారణంగా చిన్నపిల్లలు, మహిళలు, వృద్దులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, విధవల పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, బీడీ పెన్షన్లు మొదలైనవి ఇస్తున్నప్పటికీ వాటికోసం దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నవారు చాలామంది

Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

తెలంగాణలో మహిళా రైతుల హక్కులకు భద్రత కల్పించటానికి చేపట్టాల్సిన విధాన చర్యలు – ప్రజా అసెంబ్లీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రైతులకు అనేక పథకాలను ప్రకటించింది. ఇటీవల నియంత్రిత పంటల సాగు ప్రణాళికను కూడా అమలులోకి తెచ్చింది. అయితే రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు భూమి యజమానులకు మాత్రమే వర్తింపచేస్తున్నారు. భూమిలేని సాగుదారులను, వ్యవసాయ కూలీలను రైతులుగా గుర్తించకపోవడం చేత మహిళా రైతులు, కౌలు రైతులు, అటవీ పట్టాలు అందని ఆదివాసీ రైతులు ఈ పథకాలకు దూరంగానే ఉండిపోయారు. అసలు వ్యవసాయం చేస్తున్నది ఎవరు అనేది పట్టించుకోకుండా, వ్యవసాయం చేస్తున్నవారితో సంప్రదింపులు జరపకుండా పై నుండి రుద్దుతున్న పథకాలు, ప్రణాళికల వల్ల మహిళా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలోనూ, ఆ తర్వాత కూడా మహిళా రైతులు, వ్యవసాయ కూలీలు పనులు లేక, ఉత్పత్తి చేసిన కూరగాయలు, పాలు అమ్ముకోవడానికి మార్కెట్‌ లేక, సరైన ధర లేక ఆదాయాలు కోల్పోయారు. వారికి ఖరీఫ్‌ సీజన్‌లో పెట్టుబడికి ప్రైవేటు రుణాలు అందక కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

దాక్షిణాత్య సాహిత్యంలో తొలిదశ కవయిత్రులు – బోడి నాగశేషు

ప్రాచీన సాహిత్యంలో స్త్రీలు రచన చేయడానికి సరైన మేథో సంపత్తి, విద్య ఉన్నా కూడా, వారికున్న అప్పటి పరిమితులు, వారి దృక్పథం, రచనా వ్యాసంగం పట్ల అనాసక్తి, నిర్బంధాలు, కట్టుబాట్లు, అంతకుమించి స్త్రీ రచనా సాంప్రదాయం ఆ కాలం నాటికి లేకపోవడం వల్ల మహిళా కవయిత్రులు ప్రారంభ దశలో అరుదుగా కనిపించడానికి కారణంగా చెప్పుకోవచ్చు. వీటన్నింటినీ ఛేదించుకొని సీతాకోక చిలుకలుగా పేరు తెచ్చుకొన్న విదుషీమణులూ లేకపోలేదు. అయితే వీరిలో వారి జీవిత కాలాదులు సరిగా తెలియకపోవడం, రచనలు అలభ్యం కావడంతో మనిషి ఉండి నీడ లేనట్లు, నీడ ఉండి మనిషి లేనట్లు అయిపోయింది. లభ్యమవుతున్న ఆధారాలను బట్టి దాక్షిణాత్య సాహిత్యంలోని తొలిదశ కవయిత్రులను పరిచయం చేస్తున్నాను. తమిళ సాహిత్యంలో కడసంగకాలంలో వెలసిన గ్రంథాలలో అగనానూఱు, పుఱనానూఱు పేర్కొనదగ్గ రచనలు. అగనానూఱు ప్రణయ గీతాలకు సంబంధించిన గ్రంథం, పురనానూఱు వీరగీతాల సంపుటం. ఈ రెండు గ్రంథాల్లోను తమిళ మహిళల విషయాలను తెలుసుకోవచ్చు. సంగం కాలానికి పురుషులతో ఉండేవారని, వారికి సంఘంలో విశేష గౌరవాలు దక్కేవని తెలుస్తోంది. సంగీత, సాహిత్యాలలోనే కాకుండా ఇతర శాస్త్రాల్లోను పాండిత్యాన్ని గడించారని అవగతమవుతోంది. సంగం కాలానికే యాభై మంది కవయిత్రులుండేవారు. పుఱనానూఱు గ్రంథంలో ఒక వీరనారి, ఆమె తండ్రి యుద్ధభూమిలో అశువులు బాస్తాడు. ఆమె భర్త కూడా యుద్ధ వీరుడే. శత్రువుల ఆధీనంలో ఉండే అలమందలను తన వశం చేసుకుని యుద్ధంలో చనిపోతాడు. ఈ వార్తలు విని కంటతడి పెట్టలేదు ఆమె. ధైర్యంగా తన కొడుకును దగ్గరకు తీసుకొని తలకు నూనె రాసి, జుట్టు ముడి వేసి తెల్లని గుడ్డలు వేసి, చేతికి ఖడ్గం ఇచ్చి యుద్ధభూమికి వెళ్ళమని ఆదేశించింది. ఇక్కడ తెలుగులో చానమ్మ గుర్తుకువస్తుంది. ఈ వీరగాథను ‘మాశాత్తియార్‌’ పద్యరూపంలో రచించారు (పుట.269 అఖిల భారత కవయిత్రులు) ఈమెను తొలి కవయిత్రిగా తమిళ సాహిత్యంలో కీర్తించబడలేదు. తొలిదశలో ఇంచుమించు దేశభక్తికి సంబంధించిన సాహిత్యాన్నే రచించినట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా తమిళ కవయిత్రులలో కాక్కైపాడినియర్‌… ఈమె లక్షణశాస్త్ర రచించినట్లు తెలుస్తున్నది కానీ అది అలభ్యం. అళ్ళూర్‌ నన్‌ ముల్లైయార్‌… ఈమె సంగకాలానికి చెందిన కవయిత్రుల్లో ఒకరు. ళిరుకాక్కై పాడినియార్‌, నచ్చెళ్ళెయార్‌ లాంటి కవయిత్రులు అడపా దడపా రచనలు చేసినా వీరి రచనలు అలభ్యం. అందువల్ల వీరికి గుర్తింపు దక్కలేదు. అవ్వైయారు తమిళ తొలి కవయిత్రి అని చెప్తారు. ఈమె సూక్తులను వివరించారు. తొలిదశ తమిళ సాహిత్యంలో అన్ని జాతుల వారు ఉన్నారు. దీన్నిబట్టి తెలిసిందేమంటే తమిళ మహిళలు దక్షిణాదిలో పురుషులతో సమానంగా చదువుకోవడం, తద్వారా వారి స్థాన మానాల్లో స్థాయిని పెంచుకోగలిగారు. ఈ విషయాల్లో తెలుగునాడు లోని మహిళలు వెనుకబడ్డారు. ఎప్పుడైతే విద్య లేదో అప్పుడు అన్ని రంగాల్లోను స్త్రీలు వెనుకబడిపోతారు. జాతి వ్యవస్థ కూడా వీరు వెనుకబడడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.

Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

నిరుడు వెలిగిన దీపశిఖలు – డా|| షేఖ్‌ మహబూబ్‌ బాషా

బ్రిటిషాంధ్రలో మహిళోద్యమం ముమ్మరంగా నడిచింది. తమ రచనల ద్వారా, మహిళా సంఘాల నిర్మాణం ద్వారా బలమైన మహిళోద్యమాన్ని నిర్మించారు బ్రిటిషాంధ్రలోని స్త్రీలు. వీరు ముఖ్యంగా స్త్రీల పత్రికలైన ‘తెలుగు జనానా’, ‘హిందూ సుందరి’, ‘సావిత్రి’, ‘వివేకవతి’, ‘అనసూయ’, ‘ఆంధ్రలక్ష్మి’, ‘గృహలక్ష్మి’, ‘ఆంధ్రమహిళ’ మొదలైన వాటిలో తమ రచనల్ని ప్రచురించేవారు. 1910 చివరినాటికే మహిళా రచయితల సంఖ్య ఎంతగా పెరిగిందంటే 1902లో ప్రారంభమైన ‘హిందూ సుందరి’లో 1909 నాటికి సుమారు వందమంది స్త్రీలు తమ రచనల్ని ప్రచురించారు. జూన్‌ 1909 నాటికి తమ రచనల్ని ప్రచురించిన 84 మంది స్త్రీల పేర్లను ఇచ్చారు ‘హిందూసుందరి’ స్థాపకులైన సత్తిరాజు సీతారామయ్య. 1910 నాటికే ఇంతమంది మహిళా రచయితలుంటే వలస పాలనానంతరం నాటికి ఎంతమంది మహిళలు రచయితలుగా రూపుదిద్దుకుని ఉంటారో సులభంగా ఊహించవచ్చు.

Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment