సవాలంటూ సమరమే – కన్నెగంటి రవి

మిత్రులారా…

మా కంటి పాపలారా…

మమ్మల్నిలా

చూస్తుంటే

ఆశ్చర్యంగా ఉంది కదూ

అద్భుతంగా ఉంది కదూ

ఆనందంగా ఉంది కదూ…

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

భూమికీ హలానికీ పుట్టిన పుతిక్ర… ఎవరు జానకా? కాదు భూమిక – డి.ఎల్‌.మూర్తి మోహన్‌

భూమిక వాలంటీర్‌, బతకమ్మకుంట

భుక్తి కరువైన వారి నోట మెతుక

పాతిపెట్టినా పైకి లేచే ధిక్కారపు మొలక

దురాగతాల దునుమాడి దిగంతాల ప్రకటించే పత్రిక – భూమిక

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

వెలుగుతుంది మహా మానవ కుడ్యం – విమల

భయం లేదు

ఈ పెను చీకటి ముళ్ళ దారినీ

దాటి తీరుతాం మనం

భయం లేదు నా చేయి పట్టుకో

చెరసాలల ఊచల్ని మీటుతూ

ఉరికొయ్యలు తెగిపడక తప్పవని

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

భూమిక – డిసెంబర్,. 2020

భూమిక – డిసెంబర్,. 2020

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ఈ హైదరాబాదు మా సీతారామపురం ఒక్కటే నాకు -కొండవీటి సత్యవతి

1975 లో చిన్న బావిలాంటి మా సీతారామపురం నుండి నేను మొదటి సారి రైలెక్కి మా నాన్నతో కలిసి హైదరాబాదుకొచ్చినప్పుడు నేను చాలా భయపడిపోయాను. రైల్లోనే వింత అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌ సమీపిస్తున్నాం. నా ఎదుటి సీట్లో ూర్చున్న ఒకాయన కాలు పొరపాటున నా కాలికి తగిలింది. ‘మాఫ్‌ కరో బేటీ’ అన్నాడు. నేను కంగారుపడి కాలు వెనక్కి లాగేసుకున్నాను.దక్షిణ హిందీ ప్రచార సభ వాళ్ళ పరీక్షలు రాసి ఉండడం వల్ల నాకు కొంచం హిందీ తెలుసు. కానీ ఆయన ఏమన్నాడో నాకు అర్ధమవ్వలేదు.

Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ – అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…)

చింతామణీ – నేనూ

దుర్గాబాయి స్వయంగా రాసుకొన్న తన జీవిత సంక్షిప్త చరిత్రకు ఈ పేరు పెట్టింది. అంటే ఇది ఆమె ఆత్మ కథ. చింతామణి దేశ్‌ముఖ్‌ కూడా స్వీయ చరిత్ర రాసుకున్నారు. దాని పేరు ‘ది కోర్స్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ (నా జీవన స్రవంతి) అని పెట్టుకున్నారు. దుర్గాబాయి రాసిన ఆత్మకథా, చింతామణి రాసిన స్వీయ చరిత్ర పరస్పర పరిపోషకంగా వారి గొప్ప జీవితాలను ప్రతిబింబింపచేస్తున్నాయి. గంగా యమునల కూడలి లాగా నవీన భారత దేశ పుణ్యతీర్థ చారిత్రక ప్రాధాన్యత వారి జీవితాలకు ఉన్నది. తన సంక్షిప్త ఆత్మకథలో ఆమె తన చిన్ననాటి జీవితాన్ని, ఉద్యమ శీలతను, పూర్వగాథలను సంగ్రహంగా వివరించింది. 1953లో చింతామణి దేశ్‌ముఖ్‌ను వివాహమాడిన తర్వాత 28 ఏళ్ళు ఆయన జీవితంతో తన జీవితం ఎలా కలిసిపోయిందో వివరించింది. ప్రాస్తావికంగా దేశ్‌ముఖ్‌ కుటుంబ నేపథ్యమూ, ఆయన మేథాపరిణతి, ఆయన ఇంగ్లండు చదువులూ, ఇంగ్లండులో ఉండగా ఆయన చేసుకొన్న మొదటి వివాహం, వాళ్ళ దాంపత్య జీవిత వైఫల్యం, వాళ్ళకు కలిగిన కూతురితో చింతామణి వియోగ పరితాప వృత్తాంతం సంగ్రహంగా ఆమె ప్రస్తావించింది. తరువాత ఆయన జీవితంలో తాను వెలితిని పూరించిన వృత్తాంతాన్ని వారి సామాజిక సేవ, సంస్థా నిర్మాణం ప్రవక్తం చేసింది.

Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

పోరాటం చేస్తే పోయేదేముంది… -పి. ప్రశాంతి

చాలా రోజుల తర్వాత స్నేహితురాళ్ళు ముగ్గురూ ఊరిచివర చెరువు గట్టు మీదున్న చింతచెట్టు కింద కలిశారు. అదే ఊర్లో పుట్టి పెరిగి పదో తరగతి వరకు కలిసి చదువుకున్న పూల, సరిత, పర్వీన్‌ ప్రాణ స్నేహితులు. దాదాపు మూడేళ్ళు దాటింది వాళ్ళు కలిసి. ముగ్గురూ మూడు రకాల కారణాలతో ఊరికి దూరమై మూడేళ్ళు గడిచాక ఈ మధ్యనే తిరిగి ఊరికి వచ్చారు. గత నాలుగు నెలలుగా అనేకసార్లు చర్చించుకుని ఒక నిర్ణయానికొచ్చి తమ శక్తేంటో చూపించాలని పట్టుదలతో వచ్చారు.

Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

చదువుల తల్లి పుల్లగూర దీనమ్మ – డా|| చల్లపల్లి స్వరూపరాణి

జ్యోతీరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలేల కాలం అంటే 19వ శతాబ్దం నాటి ఆంధ్ర దేశంలో సామాజిక పరిస్థితులు, అణగారిన వర్గాల స్థితిగతులు, వాటిపై సంస్కరణ దిశగా సాగిన ప్రయత్నాల మీద అటు అకడమిక్‌ రంగంలో కానీ, బయట గానీ అసలు పరిశోధన జరగలేదనే చెప్పాలి. ఆ రోజుల్లో అత్యంత దయనీయమైన పేదరికం, అంటరానితనం, ఊరెలపటితనం వంటి దుర్భర పరిస్థితుల్లో బతుకులు వెళ్ళదీస్తున్న దళితులకు క్రైస్తవం ఒక వెలుతురు పంచే ఆశాకిరణంలా కనిపించింది. గుంటూరు జిల్లాలో ఫాదర్‌ హయ్యర్‌ ఆధ్వర్యంలో లూధరన్‌ మిషన్‌ తన కార్యక్రమాలను విస్తరిస్తూ అణగారిన కులాలకు చేరువైంది. అటువంటి చీకటి దినాల్లో గుంటూరు జిల్లా వేలూరు గ్రామంలో పుట్టిన గడ్డం దీనమ్మ అసమ సమాజం తన చుట్టూ నింపిన అంధకారాన్ని చీల్చుకుంటూ జ్ఞాన జ్యోతిలా ప్రకాశించింది.

Continue reading

Share
Posted in మిణుగురులు  | Leave a comment

వర్జిన్‌ టెస్ట్‌ – వి.శాంతి ప్రబోధ

అప్పుడే ఢిల్లీకి వచ్చి నాలుగో రోజు. టీ బ్రేక్‌లో టీ సిప్‌ చేస్తుంటే రమణి గుర్తొచ్చింది జయకి. ఈ సమయంలో రమణికి సహాయంగా ఉండాల్సింది. ఒక్కటే ఎంత తిప్పలు పడుతున్నదో మనసులోనే అనుకున్నదామె.

Continue reading

Share
Posted in కధలు | Leave a comment

భావచిత్రాల భోషాణం – ‘జొన్నకంకి’ -చక్రవర్తి వేనంక

మనుషులనీ, మనుగడలనీ లోతుగా అధ్యయనం చేస్తూ… వస్తువుల ఆత్మల్నీ వాస్తవాల గమ్యాల్నీ కూలంకషంగా తెలుసుకున్న వారే ఆయా భావాలని అందమైన కవితా వాక్యాలతో అలంకరించగలరు. తమదైన విలక్షణ శైలి ప్రదర్శించి వారి కవిత్వ లోకంలోకి తీసుకెళ్ళి అలరించగలరు. అట్టి అనుభూతికి సాక్షీభూతంగా చెప్పదగినది ”జొన్నకంకి”.

Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

నల్లజాతి విముక్తి చిహ్నం ‘హ్యారియెట్‌ టబ్మాన్‌’ శివలక్ష్మి

నల్లజాతీయుల ఆత్మగౌరవ ప్రతీక ‘హ్యారియెట్‌ టబ్మాన్‌’. అమెరికాలో బానిసత్వ నిర్మూలన గురించిన ఉత్కంఠభరితమైన చరిత్ర వివరాలు తెలియాలంటే దానితో పెనవేసుకుపోయిన టబ్మాన్‌ వ్యక్తిగత కథ గురించి తెలుసుకోవాలి.

Continue reading

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

విస్మృత కథారచయిత్రి – వేదుల మీనాక్షీదేవి శీలా సుభద్రాదేవి

ఆధునిక సాహిత్యరంగంలో స్వాతంత్య్రానంతరం అధిక సంఖ్యలోనే మహిళలు సాహిత్య రంగంలోకి వచ్చారు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే దానికి సమాంతరంగా స్త్రీ విద్యపై కూడా మహిళలు కొంత ఉద్యమస్ఫూర్తితో రచనలు చేయటం కావచ్చు, స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలు కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు కావటం వలన కావచ్చు, సాంస్కృతికంగా, ఆర్థికపరంగా వెసులుబాటుగల కుటుంబాలలోని స్త్రీలకు విద్యావంతులయ్యే అవకాశం లభించింది. విద్యతోపాటుగా సాహిత్యంతో అనుబంధం గల కుటుంబంలోని ఆడపిల్లలకు తెలుగు, సంస్కృత గ్రంథపఠనం చేయించటం వలన కూడా ఆనాటి సామాజికంగా ఉన్నతస్థాయి కుటుంబ స్త్రీలు సాహిత్య రచనారంగంవైపు దృష్టి సారించారు.

Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అసలు యుద్ధం దేనిపైనా?! -దేవి

”లవ్‌ జిహాద్‌” ఆర్డినెన్స్‌ తెచ్చేసింది యు.పి. యోగి సర్కారు. ఈ అరుపు ఇవ్వాళ కొత్తగా మొదలు కాలేదు. భాజపా ప్రభుత్వాల చేతకానితనం, అసమర్ధత, పరిపాలనలో అవకతవకలు బయటపడినప్పుడల్లా సంఘ్‌ పరివార్‌లోని ఏదో ఒక అంశం భజరంగ్‌దళ్‌ లేదా విశ్వ హిందూ పరిషత్‌ గొంతు చించుకొని లవ్‌ జిహాద్‌ అంటూ రంకె వేస్తుంది.

Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మనకు మనమే ప్రతిధ్వనులుగా ఉండిపోవద్దు -మమత కొడిదెల

”నువ్వు బిఎల్‌ఎమ్‌ ను సమర్ధిస్తావు కదా. మరి రామ మందిరాన్ని ఎందుకు సమర్ధించవు?” వాట్సాప్‌ గ్రూప్‌లో సౌమ్యంగా అడిగింది ఇరవై ఐదేళ్ళ క్రితం కాలేజిలో పరిచయమైన స్నేహితురాలు. తల తిరిగిపోయే ఇలాంటి ఉపమానాలు ఈ మధ్య దాదాపు ప్రతిరోజూ వింటూనే ఉన్నా. విన్న ప్రతిసారీ కోసుకుపోతున్నట్లుండే నొప్పి గుండెలో. హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారని ఇన్నాళ్ళూ అనుకున్న స్నేహితుల నుంచి ఇలాంటి ప్రశ్నలు వినిపించినప్పుడు ఆ నొప్పి మరీ తీవ్రంగా ఉంటుంది.

Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

విభిన్న సమూహాలు-కఠోర వాస్తవాలు -ప్రచారోద్యమం

ఇతివృత్తానికి ప్రవేశిక:

”ఈ భిన్న లైంగికతకు సంబంధించిన సమూహ సభ్యులు, వారి కుటుంబాలు… శతాబ్దాల తరబడి అనుభవించిన అవమానాలకు, సంఘ బహిష్కరణలకూ… దిద్దుబాటు చర్యలను చేపట్టడంలో జరిగిన ఆలస్యానికి, వారికి చరిత్ర ఒక క్షమాపణని ఋణపడి ఉంది. ఈ సమూహంలోని సభ్యులు తమ జీవిత పర్యంతం… ప్రతీకారం మరియు పీడన అనే భయాల మధ్య నిర్బంధించబడ్డారు” – జస్టిస్‌ ఇందూ మల్హోత్రా (తన 50 పేజీల తీర్పులో)

Continue reading

Share
Posted in మనం గళమెత్తకపోతే  | Leave a comment

వలస కార్మికులు – ప్రచారోద్యమం

దినసరి కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పట్టణ ఉత్పత్తిదారులు, సేవారంగ కార్మికులు, ఇంటి పనివారలు మొదలయినవారంతా వలస కార్మికుల కోవలోకి వస్తారు. 2020 మార్చి 23న భారత ప్రధాని నరేంద్ర మోడి కోవిడ్‌-19 వ్యాప్తి అదుపు చేయడానికి దేశమంతా లాక్‌డౌన్‌ ప్రకటించారు. నూట నలభై కోట్ల భారత ప్రజానీకం బలవంతంగా రుద్ధబడిన ఈ ”సామాజిక దూరం”తో జరిగిన మార్పులకు అలవాటు పడే క్రమంలో ఉంటే… భారతదేశపు నాలుగు కోట్ల వలస కార్మికులు భిన్నమయిన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు (బిబిసి 2020). దేశంలో 500 కోవిడ్‌-19 కేసులు ఉన్నప్పుడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించి మొత్తం వ్యాపారాలను మూసివేసింది. హాట్‌స్పాట్స్‌ మూసేయటం, నియంత్రించబడిన ప్రాంతాలు వంటి చర్యలతో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని అనుసరించాయి. దాంతో లక్షలాదిమంది వలస కార్మికులు దిక్కుతోచని ఒంటరితనంలో ఇరుక్కుపోయారు. లాక్‌డౌన్‌ కొంతమేరకు కరోనా వ్యాప్తి వేగాన్ని తగ్గించి ఉండవచ్చు, కానీ అది సమాజంలోని అసమానతలను, నిస్సహాయతలను మరింత ఉధృతం చేసింది.

Continue reading

Share
Posted in మనం గళమెత్తకపోతే  | Leave a comment