పితృస్వామ్య అధికారం ఆధారంగా ఏర్పడిన లింగ విభజనలో భాగంగా పుట్టిన గృహ హింసలో అనేక కోణాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఓ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళలలో ఒకరు వారి జీవిత కాలంలో శారీరక లేదా లైంగిక హింసను అనుభవిస్తున్నారు. వైవాహిక సంబంధాలలో ఉన్న మహిళల్లో కనీసం 30 శాతం తమ భాగస్వాములచే శారీరక లేదా లైంగిక హింసను అనుభవిస్తున్నారని తెలిపింది. నేషనల్ క్రైమ్ రీసెర్చ్ బ్యూరో (NRCB) ప్రచురించిన ”క్రైమ్ ఇన్ ఇండియా” రిపోర్ట్ 2018, ప్రకారం భారతదేశంలో ప్రతి 1.7 నిమిషాలకు మహిళలపై ఒక నేరం నమోదవుతున్నది. ప్రతి 4.4 నిమిషాలకు ఒక మహిళ గృహ హింసకు గురవుతోంది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 2018లో మహిళలపై నేరాలకు సంబంధించి 89,097 కేసులు నమోదయ్యాయి. ఇది 2017లో నమోదైన 86,001 కేసుల కంటే ఎక్కువ. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 (National Family Health Survey) 2015-16 ప్రకారం భారతదేశంలో 15-49 ఏళ్ళ వయసు మహిళల్లో 30 శాతం మంది శారీరక హింసను అనుభవిస్తున్నారు. శారీరక, లైంగిక, మానసిక వేధింపులను ఎదుర్కొంటున్న వివాహిత మహిళలలో 83 శాతం మంది వారి భర్తలను ప్రధాన నేరస్తులని, ఆ తర్వాత భర్త తల్లులు (అత్తలు – 56 శాతం), తండ్రులు (మామలు – 33 శాతం), తోబుట్టువులు (ఆడపడుచులు – 27 శాతం) పేర్కొన్నారని తెలిపింది. అంటే దీన్ని బట్టి సామాజిక శాస్త్రవేత్త ఉబెరాయ్ (1995) చెప్పినట్లు కుటుంబం హింస, వివక్షతలకు ఒక ప్రదేశంగా అర్థం చేసుకోవచ్చు.
Continue reading →