ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా
అందరి కష్టాలకు కారణమైన కరోనా
అందరి పనులను ఆపుదల చేశావు
రవాణా మార్గాలను నిలుపుదల చేశావు
ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా
అందరి కష్టాలకు కారణమైన కరోనా
అందరి పనులను ఆపుదల చేశావు
రవాణా మార్గాలను నిలుపుదల చేశావు
కరోనా వ్యాధి వచ్చింది,
మానవాళికి వైరస్ను తెచ్చింది,
కరోనా ప్రపంచమంతటా విజృంభిస్తోంది,
మానవజాతికి ముప్పునే తెస్తోంది,
మార్చి 22, 2020 తర్వాత ప్రపంచం కోవిడ్-19కి ముందు కోవిడ్కు తర్వాత అంటూ రెండుగా విడిపోయింది. ఇంత భయానక పరిస్థితిని మనం బతికున్న రోజుల్లోనే చూడాల్సి వస్తుందని మనమెవరమూ ఊహించలేదు. అసలు ఈ కరోనా వైరస్ అంటే ఏమిటి? ఏం చేస్తుంది? అదెలా ఉంటుంది? ఏమీ తెలియదు. ఎక్కడో చైనాలో ఒక పట్టణంలో వచ్చిందట అనే వార్త తప్ప రెండు మూడు నెలల్లోనే గ్లోబ్ మొత్తాన్ని గడగడ వణికిస్తుందని ఎవరైనా ఊహించారా? లాక్డౌన్ అంటే తాళాలేసుకుని ఇంట్లో దాక్కున్నాం. చెంబులు, తపేళాలు మోగించమంటే మోగించాం. దీపాలు వెలిగించమంటే వెలిగించాం. పువ్వులు చల్లమంటే చల్లాం. ఏం జరిగింది? కరోనా పలాయనం చిత్తగించిందా? తోకముడిచిందా? లేదు మరింత భయంకరంగా విస్తరించింది. పాజిటివ్ కేసులు వందల్లోంచి, వేలల్లోకి, లక్షల్లోకి చేరిపోయాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలందరూ భయం గుప్పిట్లో, మానసిక వత్తిళ్ళతో సతమతమైపోతున్నారు. పాజిటివ్గా ఉండాలి అనే పదం కోవిడ్ పాజిటివ్గా మారిపోయి, పాజిటివ్ అంటేనే గుండె బేజారైపోయే స్థితిలోకి ప్రజలు వెళ్ళిపోయారు.
గౌరవనీయులైన భూమిక సంపాదకురాలు కె.సత్యవతి గారికి,
వి.సరస్వతీ ఆంజనేయులు, హనుమమ్మ బసవయ్య పౌరగ్రంథాలయం, వేములవాడ నుండి హృదయపూర్వక సాహితీ వందనాలు… శుభాకాంక్షలు… శుభాశీస్సులతో…
”చిట్టచివరికి మూడేళ్ళ నుండి ఎదురు చూసిన రోజు వచ్చింది. నా పంతొమ్మిదో పుట్టినరోజున ఫ్రెండ్సందరికీ చాక్లెట్స్ పంచాను. మళ్ళీ వాళ్ళతో కలిసి నవ్వుకుంటూ చాక్లెట్లు తినే రోజొస్తుందో లేదో అనేది అనుమానమే… పది రోజులు ఆగి రాజీవ్తో వెళ్ళిపోయాను. పెళ్ళి చేసుకుని ఏడాదైంది. ఇప్పటికీ రోజూలా ‘మేం చేసిన తప్పేంటి? చట్టపరంగా అర్హత వచ్చాకే పెళ్ళి చేసుకున్నాం. కదా? అని ఆలోచిస్తూనే ఉన్నాం. మరి ఊరూ… వాడా… ఇంటివారు… బైటివారు.. అందరూ ఒకటే మాట… తప్పు చేశారు అని’ ఎందుకిలా?” నవత మాట్లాడుతోంది.
If I had a hammer I’d smash patriarchy
నేను పురుష ద్వేషిని ఏమీ కాదు కానీ…
”నెలసరిలో ఉన్న స్త్రీ వంట చేస్తే మరు జన్మలో ఆడకుక్కగా పుడుతుంది” అన్న గుజరాత్ లోని భుజ్ పట్టణంలోని స్వామి నారాయణ్ గుడిలోని స్వామి కృష్ణస్వరూప్ దాసాజీ ఉవాచ చదివాక చాలా కోపంగా ఉంది.
అంటువ్యాధి ఉత్పాతాలు అనేవి సమాజాలలో హఠాత్తుగా, ఎలాంటి హెచ్చరికా లేకుండా జరిగే యాదృచ్ఛిక సంఘటనలు కావు. అందుకు విరుద్ధమైనవి. ప్రతి సమాజమూ తనవైన బలహీనతలను సృష్టించుకుంటుంది. వాటిని అధ్యయనం చేయడమంటే, ఆ సమాజపు సాంఘిక నిర్మాణాన్నీ, జీవన ప్రమాణాలనూ, దాని రాజకీయ ప్రాధాన్యతలనీ అర్థం చేసుకోవడమే!
నిత్యం భయాందోళనలతో కాలం గడిపే వాళ్ళ కోసం నా అనుభవం మీ ముందుకు తెస్తున్నాను.
జూన్ పదవ తేదీ మధ్యాహ్నానికి కొద్దిగా ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి. (అంతకు రెండు మూడు రోజుల క్రితమే కరోనా భయంతో రాలిపోతున్న వాళ్ళ గురించి ఇంట్లో మాట్లాడుకున్నాం… ప్రజలకు భరోసా కల్గించాల్సిన వ్యవస్థలు ప్రజలను మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయని, చేతులెత్తేస్తున్నాయని, నిజంగా ఇది అంత భయపడాల్సిన బూచి కాదని ఇద్దరో ముగ్గురో చనిపోవడం పెద్ద భూతంలా చూపడం, ప్రజలని భయపెట్టడం సరైనది కాదని మేం ఇంట్లో అనుకున్నాం)
హెచ్ఐవి పాజిటివ్ అంటే ఎంత భయం, అపోహలు, వివక్ష ఉన్నాయో కరోనా పాజిటివ్ అంటే కూడా ఆ లెవల్లోనే ఉంది. మొత్తానికి నాకు ఇప్పుడు నెగటివ్ వచ్చింది కాబట్టి చెప్తున్న.
చైనాలో పుట్టి కంటికి కనిపించని జీవి ఒకటున్నదని, దాని వల్ల వేలాదిమంది ప్రాణాల మీదికి వస్తున్నదని జనవరి, ఫిబ్రవరి నెలల్లో అనుకుంటా పత్రికల్లో చదివాము. కరోనా మన ఇండియాకి వచ్చిందని మార్చి నెల మొదటివారంలో తెలిసింది. తొలుత హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగికి వచ్చిందని కంగారుతో ఆ బిల్డింగ్ మొత్తం హుటాహుటిన ఖాళీ చేయించేశారు. వర్క్ ఫ్రం హోమ్ అప్షన్ కూడా ఇచ్చారు ఆ కంపెనీ వాళ్ళు. మూడో వారం నుండి లాక్డౌన్ ప్రారంభమయింది. ఆ రోజు నుండి దిలీప్ రోజూ ఆఫీసుకి వెళ్ళి వస్తున్నాడు కాబట్టి ముందు జాగ్రత్తగా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి తనకి పని వత్తిడి కూడా రెట్టింపైంది. అదే సమయంలో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులు చూసి వైజాగ్లో ఉన్న మల్లీశ్వరి గారి పిలుపు మేరకు హైదరాబాద్లో కొంతమేరకు నాకు తెల్సిన సాయం చేయగలిగాను. అలా కొన్నాళ్ళు గడిచాక వ్యాధి విస్తృతంగా వ్యాపించడం మొదలుపెట్టింది. మొదట్లో ఎవరో తెలియని వ్యక్తులకు వచ్చింది. కానీ, త్వరలోనే మన దగ్గరి వాళ్ళకు కూడా వస్తుందని అర్థమయింది.
(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ)
థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్…
తరగతులు అయిపోయాయి; డిపార్టుమెంటులో విద్యార్థులెవరూ లేరు. ప్రొఫెసర్ శంకరరావు ఒక్కరే తన ఛాంబర్లో ఏదో పనిలో నిమగ్నమైవున్నారు. అప్పుడప్పుడూ వాచీవైపూ, తలుపువైపు చూస్తున్నాడు. ఇంతలో తలుపుదగ్గర చప్పుడైంది. అతడి కళ్లు ఆశగా విప్పారాయి.
(గత సంచిక తరువాయి…)
కారాగారం
సాహిత్య ప్రతిభావంతులైన గొప్ప రచయితల దేశ విదేశ నవలా వాజ్మయంలో గొప్ప నవలలున్నాయి. మానవ జీవితంలోని ఎత్తుపల్లాలు, జీవన సార్థకత, పరిస్థితుల ప్రభావం, పాత్రల ఆత్మశీలత అవి వర్ణిస్తాయి. అటువంటి గొప్ప నవలలకు దుర్గాబాయి జీవితం ఏమీ తీసిపోదు. ఇంకా చెప్పవలసి వస్తే ఆ నవలల సృజనాత్మక ప్రతిభాచిత్రణ కన్నా ఆమె జీవితం గొప్పది, ఉత్కృష్టమైనది. ఏమంటే ఆమె సాహసం, త్యాగమయత, నిర్భీతి, దేశభక్తి, పట్టుదల, జీవితాదర్శాలు, సృజనాత్మక రచనలలో సాధారణంగా కన్పించక పోవచ్చు. మానవ ప్రకృతిలోని సహజాతాల ఉల్బణం, స్వభావ చిత్రణ, పాత్రల సజీవ మనోవృత్తులు, శైలి, శిల్పం మొదలైన వాటికి సృజన సాహిత్యంలో ప్రాధాన్యముంటుంది.
చిన్న పుస్తకం. చాలా చిన్న కథ. సమాజంలో పురుషాధిక్యత ఎంత లోతుగా పాతుకుపోయి ఉందో చెప్పే కథ. కానీ చదివాక మామూలుగా ఉండదు. పిల్లలు లేని శంకర్ రామన్ గుడి ప్రాంగణంలో దొరికిన పాపను తెచ్చుకుని ”కాదంబరి” అని పేరు పెట్టుకుని ప్రేమగా పెంచుకుంటాడు. పూల వ్యాపారి అయిన శంకర్ రామన్ దగ్గర ఇంకో అయిదుగురు అనాధ బాలికలు పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఇంతే ప్రేమగా పూల పేర్లు పెట్టుకుంటాడు శంకర్ రామన్. రోజా, కమలం, కనకాంబరం, మల్లి, సంపంగి… వీళ్ళతో పాటు కూతురు కాదంబరి.
ఒకనాటి సామాజికి స్థితిగతులను అంచనా వేయడానికి సాహిత్యం ఎంతగానో తోడ్పడుతుంది. సమాజానికి, సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉంది. సమాజంలోని స్థితిగతులు సాహిత్య ప్రక్రియల్లో ప్రతిఫలించబడతాయి. సాహిత్య ప్రక్రియలు అనగా నవల, కథ, వచన కవిత్వం మరియు గేయం ఏదైనా కావచ్చు. ఈ సాహిత్య ప్రక్రియల్లో సమకాలీన సామాజిక స్థితిగతులను అత్యంత ప్రభావవంతంగా ప్రజల ముందు
భారత ఉపఖండంలో సంస్కరణోద్యమం మరీ ముఖ్యంగా స్త్రీ విద్య వ్యాప్తి -సాధికారతలపై విస్తృతమైన అవగాహన, విమర్శనాత్మకమైన విశ్లేషణ, లోతైన పరిశీలన జరగాలంటే వలస పాలనలో-ప్రధానంగా బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రారంభమైన నాటి నుండి (రమారమి 1765) ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత కంపెనీ నుండి అధికారం బ్రిటిష్ రాణికి బదిలీ అయిన నాటి వరకు (1858) – జరిగిన పరిణామాలను నిశితంగా పరిశీలించాలి. ఈ వ్యాసాన్ని ఆ కాల పరిమితికి కుదించడానికి ప్రధాన కారణం ఆ శకంలోనే సంస్కరణకు తొలి అడుగు పడడం. రెండవ కారణం 1858 నుండి 1947 వరకు జరిగిన పరిణామాలపై సమాచారం మెండుగా లభ్యం కావడం. అందుచేత ఈ వ్యాసం కంపెనీ పాలనలో స్త్రీ విద్య యొక్క తీరు తెన్నులను చర్చిస్తుంది.
”ప్రభుత్వం వెనువెంటనే చర్యలు తీసుకోకపోతే రానున్న తరంపై విధ్వంసకర ప్రభావం పడుతుంది.” బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు లాక్డౌన్ జరిగిన రెండు వారాల్లోగా చేసిన ఈ వ్యాఖ్య కరోనా గురించో విద్య గురించో కాదు. పెరుగుతున్న గృహ హింసపై అతని ఆందోళన ఇది. ఏప్రిల్ మొదటి వారంలో ఒక్క లండన్ నగరంలోనే గృహ హింసకు సంబంధించి నాలుగు వేల అరెస్టులు జరిగాయి. షెల్టర్హోంలు నిండిపోయాయి. కొత్త షెల్టర్ హోంల ఏర్పాటు అవసరమయింది.