– కొండవీటి సత్యవతి
ఈ నెల పదోతేదీన నెట్వర్క్ ఆఫ్ వుమన్ ఇన్ మీడియా ప్రెస్ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో ”ప్రసార సాధనాలు- మహిళలు-పురుష దృక్కోణం” అనే అంశం మీద ఒక సమావేశం జరిపారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖామాత్యురాలు సునీతా లక్ష్మారెడ్డి ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్ట్లు పెద్ద సంఖ్యలో హాజరైనారు.
