రాజేశ్వరి దివాకర్ల
కన్నడంలోని సుప్రసిద్ధ ముస్లిం రచయిత్రి శ్రీమతి సారా అబూబక్కర్. ఈమె కథలు, నవల, వ్యాసం, అనువాదం ఇత్యాది అనేక రచనలను కావించారు. వీరికి ఈ నడుమ నంజనగూడు తిరుమలాంబ గారి పేరిట శాశ్వతి మహిళా అధ్యయన కేంద్రం వారిచ్చిన పురస్కారం లభించింది. శ్రీమతి నంజన గూడు తిరుమలాంబ కన్నడంలోని మొట్టమొదటి లేఖకి, సంపాదకురాలు, పుస్తక ముద్రణకర్త. సారా అబూబక్కర్ గారు ఇతర రచనలనెన్ని కావించినా, కథా, నవలా రచయిత్రిగా విశేషమైన ఖ్యాతిని గడించారు. వీరికి సాహిత్య అకాడమీ, అత్తిమబ్బె, అనుపమా, నాడోజు మొదలైన ఘన పురస్కారాలు ఇదివరలో లభించాయి. ఈ ‘శాశ్వతి’ పురస్కారం వీరి కీర్తిని మరింత ఉన్నతం కావించింది.
