ఏ మహిళల దినమిది? – శారద శివపురపు

ఏ మహిళల దినమిది?
రాత్రి రెండు కొసల నుంచి
కొంత తన పగటిలో చేర్చి
సంసారం బండి నడపటానికి Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

అభయం ఎక్కడుంది? – శ్రీతరం బింగి శ్రీకాంత్‌

అభయం ఎక్కడుంది…?
ఎక్కడ చూసినా భయమే…!
కంచే చేను మేస్తూ Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

అపరిచితుడు – డా. తాళ్ళపల్లి యాకమ్మ

ఒక మనిషిలో మరో మనిషి
వుంటడంటే నమ్మలేదామె
అతిదగ్గరైతే గాని
తెలియలే అసలు రూపు Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

ముందడుగు – డా. బండారి సుజాత

చీకటి పరదాలను తొలగించుకుంటూ…
ప్రకృతిలా మునుముందుకెళ్తూ
విద్యా, వివేకాలతో విచక్షణ జ్ఞానంతో Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

స్నేహం

స్నేహం
స్నేహం ఒక మనిషి జీవితంలో ప్రత్యేకత విషయం
ఏదైనా, ఏమైనా స్నేహితుడితోనే పంచుకుంటాం
స్నేహంలో నిజాయితీ ఉంటుంది Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

రాలిన పండుటాకు ` పూల దోసిళ్ళ నివాళి – కాత్యాయనీ విద్మహే

1978… చివరకు మిగిలేది నవలపై ప్రారంభించిన పరిశోధనే నన్ను శివరాజు సుబ్బలక్ష్మి గారిని వెతుక్కుంటూ వెళ్ళేలా చేసింది. బుచ్చిబాబు సాహిత్య కళాజీవిత సమగ్ర సమాచార సేకరణకు తొలి వనరు ఆయన భార్యే కదా! ఆవిడ ఎక్కడుంటారు, కలవడం ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు మొదలి నాగభూషణ శర్మగారు ఆవిడ హైదరాబాద్‌లోనే ఉంటారని, వస్తే పరిచయం చేస్తానని అన్నారు, చేశారు. మామూలుగా అయితే ఇలాంటి పరిచయాలు ఒకటి రెండుసార్లు కలిసి పరిశోధనకు అవసరమైన మేరకు సమాచారం సేకరించుకోవడంతోనో, ఇంటర్వ్యూ పేరు మీద కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టుకోవడంతోనో ముగుస్తాయి. కానీ మా సంగతి అలా కాదు. బుచ్చిబాబును ఆమె ఎంత ప్రేమించిందో, ఆయన మీద పరిశోధన చేస్తున్నానని నన్నంతగా చేరదీసి వాత్సల్యం చూపారు.
నా ప్రధాన సిద్దాంత రచన నవల వరకే అయినా, ఆయన సమగ్ర వాజ్ఞ్మయ సూచిక తయారు చేయాలన్న నా సంకల్పానికి బండి గోపాలరెడ్డి గారి సలహా కూడా తోడై ఆయనకు వచ్చిన ఉత్తరాలు, వ్రాసుకొన్న డైరీలు ఒక్క పేజీ కూడా వదలకుండా చూసి నోట్స్‌ వ్రాసుకోవలసి వచ్చింది. 1978`80 మధ్యకాలపు వేసవి సెలవులలో అదే పనిమీద హైదరాబాద్‌ వెళ్ళేదాన్ని. నేనెక్కడో బసచేసి పనికోసం వాళ్ళింటికి వెళ్ళడం ఆమెకు నచ్చేది కాదు. తార్నాకలో వాళ్ళది పెద్ద ఇల్లు. ఇంటికంటే విశాలం ఆమె హృదయం. ‘‘నేనూ మా తమ్ముడే కదా ఉండేది, నువ్వు కూడా ఇక్కడే ఉండు’’ అని నన్ను ఒప్పించారు. నా సహచరుడు వెంకటేశ్వర్లు అప్పుడు అక్కడ టిబి హాస్పిటల్‌లో ఛాతీ వైద్యంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా కోసం చదువుతున్నాడు. అతన్ని కూడా ఇక్కడికి రమ్మను, ఇక్కడినుండే వెళ్తాడు హాస్పిటల్‌కు అని ఆమె ఇచ్చిన ఆహ్వానంలో ఆర్ద్రత తలచుకుంటే ఇప్పటికీ గుండె తడి అవుతుంది. అలా నేను వాళ్ళింట్లో మనిషిని అయిపోయా.
ఇంటికి ఎవరు వచ్చినా మా అమ్మాయి అని పరిచయం చేసేవారు. లాలాగూడలో ఆమె రెండవ తమ్ముడు ఉండేవాడు. ప్రతి ఆదివారం సాయంత్రం వాళ్ళింటికి వెళ్తూ నన్నూ తీసుకువెళ్ళేవాళ్ళు. అక్కడ కబుర్లు, భోజనాలు పూర్తి చేసుకుని రాత్రి పదికో, పదకొండుకో ఇంటికి వచ్చేవాళ్ళం. ఆ తమ్ముడి పెద్ద కొడుకు అప్పుడు చిన్నవాడు. బుజ్జి, బుజ్జామ్‌ అని పిలిచేవాళ్ళు. అసలు పేరు సుబ్బారావు. బుచ్చిబాబు అసలు పేరు కూడా సుబ్బారావే. సుబ్బలక్ష్మి గారు తర్వాతి కాలంలో ఉద్యోగరీత్యా బెంగుళూరులో ఉన్న ఆ మేనల్లుడి దగ్గరికే వెళ్ళి ఉన్నారు. తెలుగు ప్రాంతం నుండి వెళ్ళినా తెలుగు సాహిత్య రంగంలో అనేకమందితో స్నేహసంబంధాలు కొనసాగించారు. ఆత్మకథ వ్రాసుకున్నారు. సాహిత్య సభలకు హాజరయ్యారు. సత్కారాలు అందుకున్నారు. 96 ఏళ్ళ వయసులో ఫిబ్రవరి 6వ తేదీన బెంగుళూరులో మరణించారు. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. అందులోనూ పరిపూర్ణ జీవితమే ఆవిడది. అయినా స్నేహం, ప్రేమ పంచి ఇచ్చిన మనుషులు మాయం కావటం మనసుకు నొప్పిగానే ఉంటుంది. నాకైతే మళ్ళీ అమ్మను కోల్పోయినట్లు ఉంది.
ఉదయం సుబ్బలక్ష్మి గారితో ఫిల్టర్‌ కాఫీ సంభాషణలు, భోజనాల దగ్గరి సంభాషణలు చాలా ఆసక్తికరంగా ఉండేవి. బుచ్చిబాబు గారు, తాను పుట్టి పెరిగిన గోదావరి జిల్లాల ప్రకృతి పరిసరాలలోకి నన్ను తీసుకువెళ్ళి తిప్పేవి. 1930, 40ల నాటి నియోగి బ్రాహ్మణ కుటుంబ సంప్రదాయ సంస్కృతిని పరిచయం చేసేవి. బుచ్చిబాబుతో తన పెళ్ళి దగ్గరి నుండి కలిసి చేసిన జీవితకాలపు ప్రయాణంలోని భిన్నఘట్టాలను ఆమె కథనం చేసిన తీరు, నేనెప్పుడూ చూడని బుచ్చిబాబుతో నాకెంతో పరిచయాన్ని ఏర్పరచింది. బుచ్చిబాబు గారి కథల గురించి, ఆయన సున్నిత హృదయ తత్వం గురించి ఆమె చెప్పే మాటల్లో ఎంతో స్నేహం, ఆరాధన పెనవేసుకుని ప్రకాశించేవి. వెల్లుల్లి పాయలు దట్టంగా వేసిన కొత్తావకాయ రుచి అలవాటు చేసిందీ ఆవిడే.
బుచ్చిబాబు గారికి రావలసినంత పేరు ప్రఖ్యాతలు రాలేదన్నది ఆవిడ ఆరోపణ. ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలు, వస్తువులు, పుస్తకాలు అన్నీ అపురూపమే. అన్నింటినీ భద్రంగా దాచిన గది నా పని స్థలం. డబ్బాలు, సంచీలు, బస్తాలు బోర్లించి ప్రతి కాగితం చదివి నోట్స్‌ వ్రాసుకొన్నానంటే, రచనల ప్రచురణ కాలం వంటి వివరాలు సేకరించగలిగానంటే, డైరీలు, లేఖలు ఎడిట్‌ చేసి వాజ్ఞ్మయ సూచికలో చేర్చగలిగానంటే అదంతా సుబ్బలక్ష్మి గారి సహృదయత కారణంగానే. నాలాంటి పరిశోధకులు ఉండవచ్చు గానీ, పరిశోధన విలువ తెలిసి సహకరించగల సుబ్బలక్ష్మి గారి వంటి వ్యక్తులు మాత్రం అరుదు. బుచ్చిబాబు జయంతులు, మరీ ముఖ్యంగా 2014లో శత జయంతి జరపడానికి, ఆయన పుస్తకాల పునర్ముద్రణకు, ఆయన పెయింటింగ్స్‌ను పుస్తకంగా తీసుకురావడానికి ఆవిడ మౌనంగా ఎంత పని చేశారో, బుజ్జి ఆమెకు ఎంత వెన్నుదన్నుగా ఉన్నాడో నాకు తెలుసు. హైదరాబాద్‌, బెంగుళూరు, ఏలూరు మొదలైన చోట్ల బుచ్చిబాబు జయంతి, శతజయంతి సభలలో పలుమార్లు ఆవిడతో కలిసి పాల్గొనటం నాకు మంచి జ్ఞాపకాలు. మూడు, నాలుగేళ్ళ క్రితం బెంగుళూరు వెళ్ళినప్పుడు నా కూతురిని, మనవడిని తీసుకొని ఆవిడ దగ్గరకు వెళ్తే ఎంత ఆప్యాయతను పంచారో…! అలాంటి వ్యక్తి ఇక కనబడరు అని దిగులుగా ఉంది. బుచ్చిబాబుపై సాహిత్య అకాడమీ ప్రచురించవలసిన మొనోగ్రఫీ గురించి చివరివరకు ఆమె కలవరిస్తూనే ఉన్నారు. అది ఆమెకు బుచ్చిబాబుతో సంఖ్య సంబంధ గాఢత. చిత్రం ఏమిటంటే ఈ క్రమంలో ఆమె తాను రచయిత్రిని, చిత్రకారిణిని అన్న విషయం మర్చిపోవడం. స్త్రీలందరూ ఇంతేనా?
అంతకన్నా అన్యాయం నవలలు, అందులో స్త్రీల నవలలు విరివిగా చదివే నాకు సుబ్బలక్ష్మి గారి ఇంట్లో బుచ్చిబాబు రచనల కోసం ప్రతి బీరువా గాలిస్తున్నప్పుడు కానీ ఆమె కథలు, నవలలు వ్రాశారన్న విషయం తెలిసిరాలేదు. సిగ్గుపడ్డాను. ఒక రచయిత్రిని ఇప్పటికైనా తెలుసుకోగలిగానని ఆనందపడ్డాను. కుతూహలం ఆగక అప్పుడే అక్కడే నా పరిశోధన పని చేసుకుంటూనే మధ్య మధ్య ఆమె కథలు, నవలలు చదువుకున్నా. సంభాషణల మధ్య ఆమె రచనానుభవాల ఆచూకీ కనిపెట్టడం సంతోషంగా ఉండేది. జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, బుచ్చిబాబుకు రాసిన ఒక ఉత్తరంలో (30`3`1960) సుబ్బలక్ష్మిగారి ‘‘కాపురం’’ కథ సరళంగా, మనుషుల మధ్య సంబంధాలు ఎంత సామరస్యపూర్వకంగా, సంస్కారవంతంగా ఉండాలో చూపిందని మెచ్చుకుంటూ, నువ్వు ఇంత శుభ్రంగా కథలు వ్రాస్తావా అని బుచ్చిబాబును సవాలు చేశారు. ఆ ఉత్తరం చదువుతుంటే నాకెంత సంతోషం కలిగిందో. తక్షణం శివరాజు సుబ్బలక్ష్మి సాహిత్యంపై పరిశోధన చేయించాలని గట్టిగా అనిపించింది.
అప్పటికే ఆమె కథలు ‘మగతజీవి చివరి చూపు’ అనే పేరుతో సంపుటిగా వచ్చాయి. దానికి పింగళి లక్ష్మీ కాంతం ముందుమాట వ్రాస్తూ ‘సుబ్బలక్ష్మి కథల విశిష్టత చాలా భాగం ఇవి స్త్రీ మాత్రమే వ్రాయగలదు అనిపించటం’ అని పేర్కొన్నారు. ‘‘పురుషుడు స్త్రీ, ప్రకృతిని చిత్రించినప్పుడు అతడెంత నిపుణ రచయిత అయినా పురుష నేత్రాలలో ప్రతిఫలించిన దృశ్యమే చిత్రించగలడు. స్త్రీ స్వభావాన్ని సాటి స్త్రీ వర్ణించినప్పుడు అది అన్యునాతిరిక్తంగాను, వాస్తవికతకు సన్నిహితంగానూ ఉండడంలో ఆశ్చర్యం లేదు’ అని సుబ్బలక్ష్మి స్త్రీ పాత్ర చిత్రణా స్వభావానికి ఉన్న అదనపు విలువ వైపు దృష్టిని తిప్పారు. ఒక గొప్ప పరిశోధకుడి మెప్పును పొందిన శివరాజు సుబ్బలక్ష్మి సాహిత్యంపై పరిశోధన చేయించడం తక్షణ కర్తవ్యం అనిపించింది. దాని ఫలితమే శివరాజు సుబ్బలక్ష్మి నవలలపై శశిరేఖ చేత ఎమ్‌.ఫిల్‌ డిగ్రీ కోసం పరిశోధన చేయించటం. కథలపై పరిశోధన ఇంకా మిగిలే ఉంది.
స్త్రీల రచనలపై పరిశోధనలు చేయిస్తున్నా, చేసినా వింత వింత వ్యాఖ్యానాలు ఎదుర్కోవలసి వస్తుంటుంది. బుచ్చిబాబు భార్య అనా సుబ్బలక్ష్మి నవలలపై పరిశోధన చేయిస్తున్నావు అని నన్నడిగినవాళ్ళు, శశిరేఖను సతాయించినవాళ్ళు లేకపోలేదు. స్త్రీలకు స్వంత వ్యక్తిత్వం, స్వంత ఆలోచనలు, అనుభూతులు ఉంటాయని అంగీకరించడానికి ఇష్టంలేని వర్గం మన పక్కన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ మన చరిత్ర మనం పునర్నిర్మించుకోవడానికి సమాజంలోనైనా, సాహిత్యంలోనైనా మన తోటి స్త్రీల అనుభవాలను మనవిగా చేసుకుంటూ పని చేసుకుపోవలసిందే. 1970లో అదృష్టరేఖ నవల వ్రాసి సుబ్బలక్ష్మి తన అనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు అన్నీ ఆంతర్యపు లోతులకు నెట్టి జీవించాల్సిన అనివార్యతలో ఉన్న స్త్రీల జీవిత విషాదాలను, అందులోనే విజయాలను వెతుక్కొని సంతృప్తి చెందే తీరును చిత్రించి కాపురాల గురించిన భ్రమలను తనదైన పద్ధతిలో బద్దలు కొట్టారు. 1975లో ‘నీలంగేటు అయ్యగారు’ నవలను శ్రామిక వర్గ స్త్రీ అనుభవ కోణం నుండి వ్రాస్తూ ఏకకాలంలో మధ్యతరగతి, ఉన్నత వర్గాల స్త్రీల జీవితం కూడా లోలోపలి నుండి ఎలా ధ్వంసమవుతోందో చూపించారు. ‘మరో పది జన్మలదాకా పెళ్ళొద్దు, మగవాళ్ళతో మాటలు వద్దు’ అనిపించేంతగా విసిగిపోయిన స్త్రీల స్వరాన్ని వినిపించిన నవల ఇది. ఆమె తీర్పు అనే నవల కూడా వ్రాశారు. కానీ అది దొరకటం లేదు. సమాజ సాహిత్య రంగాలలో ప్రముఖుల భార్యలను వారి నీడలుగా కాక ఆలోచించే మెదడు, అనుభూతి చెందే హృదయం, అనుభవం కోరే శరీరం ఉన్న సహజ మానవ వ్యక్తులుగా చూడడం నేర్చుకోవాలని సుబ్బలక్ష్మి గారి కథలు, నవలలు చదివాక కూడా అర్థం కాకపోతే అంతకన్నా దౌర్భాగ్యం లేదు.
శివరాజు సుబ్బలక్ష్మి తండ్రి ద్రోణంరాజు సూర్యప్రకాశం, తల్లి సత్యవతి. ముగ్గురు అక్కచెల్లెళ్ళలో సుబ్బలక్ష్మి రెండవ వారు. ఆమెకు ముగ్గురు తమ్ముళ్ళు. వాళ్ళది రాజమండ్రి దగ్గర ఇప్పనపాడు. తండ్రి బి.ఎ. చదివినవాడు కావటం, కాంగ్రెస్‌ పార్టీలో ఉండడం, ఊళ్ళో వయోజన పాఠశాల పెట్టి నడపడం… ఈ కారణాలన్నింటి వల్లా ఇంట్లో అందరికీ చదివే అలవాటు ఉంది. పన్నెండేళ్ళ వయసులో అంటే 1937 డిసెంబరు 23న సుబ్బలక్ష్మికి బుచ్చిబాబుతో వివాహమయింది. పురాణాలు చదివి అర్థం చెప్పగల బుచ్చిబాబు నాయనమ్మ సుబ్బమ్మ గారి వద్ద భారత, భాగవతాలు చదవటం అలవాటైంది. నిత్య చదువరి, రచయిత అయిన బుచ్చిబాబు సాహచర్యం, ఆయన కోసం ఇంటికి వచ్చిపోయే మొక్కపాటి, విశ్వనాథ సత్యనారాయణ, జరుక్‌ శాస్త్రి, ఆచంట జానకీరామ్‌, ఆచంట శారదాదేవి, పింగళి లక్ష్మీకాంతం వంటి వాళ్ళతో సాహిత్య సంభాషణలలో పాలుపంచుకోవడం ఆమెలో సాహిత్య సృజనాభిలాషను ప్రోది చేశాయి. భర్త కథలకు తొలి పాఠకురాలు కావటం, కథ నడిపే నేర్పును పెంచింది. అలా 1960లలో ఆమె కథా రచన ప్రారంభమయింది. 1964లో ఎనిమిది కథలతో ‘మగతజీవి చివరి చూపు’ కథల సంపుటం వచ్చింది. ఆదర్శ గ్రంథమండలి వారు ప్రచురించారు. ‘మనోవ్యాధికి మందుంది’ అనే 28 కథల సంపుటి వేదగిరి కమ్యూనికేషన్స్‌ వారి ప్రచురణ ఇప్పుడు అందుబాటులో ఉంది. మధ్యతరగతి స్త్రీల సంవేదనలకు స్వరం ఇచ్చిన సాహిత్యం ఆమెది.
సుబ్బలక్ష్మి మంచి చిత్రకారిణి కూడా. ఆదివారం కానీ, మరే సెలవు రోజైనా కానీ చిత్రలేఖన కళతో పొద్దంతా గడిపే భర్త బుచ్చిబాబు అందుకు ఆమెకు ప్రేరక శక్తి. బుచ్చిబాబు పెయింటింగ్స్‌తో పాటు ఆమె వేసిన పెయింటింగ్స్‌ కూడా అనేకం. ప్రత్యేక శ్రద్ధతో బుచ్చిబాబువి, తనవి ఎంపిక చేసిన కొన్ని పెయింటింగ్స్‌తో అందమైన ఇంద్రధనుస్సు రంగుల పుస్తకాన్ని వ్యయప్రయాసలకోర్చి ప్రచురించారు. ఆ పుస్తకాన్ని అపురూపంగా ఒళ్ళోపెట్టుకుని పేజీలు తిప్పి చూపిస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో సంతృప్తితో కూడిన చిరునవ్వు ప్రసారం నా కళ్ళముందు ఇంకా కదలాడుతూనే ఉంది. బుచ్చిబాబు భౌతికంగా తన నుండి వేరై యాభై ఏళ్ళవుతున్నా ఆయనను తనలో ఎంత సజీవంగా నిలుపుకున్నారంటే సంభాషణ ఎక్కడ మొదలైనా బుచ్చిబాబు దగ్గరకు తీసుకెళ్ళకుండా అది ముగిసేది కాదు. ఆమె పరమేశ్వరుడి శరీరాన్నే కాదు, కళాసాహిత్య సృజన వ్యక్తిత్వాన్ని తనలో సంలీనం చేసుకొన్న పార్వతి. తనవి, బుచ్చిబాబు గారివి పెయింటింగ్స్‌ కలిపి పుస్తకంగా ప్రచురించటంలో ఆ విడదీయలేని జీవితతత్వాన్ని సంకేతించారేమో సుబ్బలక్ష్మి గారు. అది తనకు తాను ఇచ్చుకున్న జీవన సాఫల్య పురస్కారం.
‘‘ప్రశాంతంగా ఉండాలంటే పాతవాటిని కలుపుకొని కొత్త ఊహల్లో జీవించటం అలవరచుకోవాలి’’ అని ఇరవయ్యేళ్ళ క్రితం ఒక స్త్రీల సాహిత్య సదస్సులో ఆమె ప్రతిపాదించిన జీవన సూత్రం తాళం చెవిగా ఆమె సాహిత్యం అధ్యయనం చేయటం ఆమెకు మనం ఇవ్వగల నివాళి.

Share
Posted in గెస్ట్ ఎడిటోరియల్ | Leave a comment

భూమిక – మార్చి, 2021

భూమిక – మార్చి, 2021

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ప్రతిస్పందన 

సంపాదకులకు,

అద్భుతం ‘కొండ ఒడిలో… కొండబడి’ ఫిబ్రవరి భూమిక సంచికలో ప్రచురించిన ప్రశాంతి గారి ‘కొండ ఒడిలో మరో ప్రపంచం ఈ కొండబడి…’ ఎంత అద్భుతంగా ఉంది. ‘కొండ ఒడిలో… కొండబడి’ వినడానికే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అమాయక ఆదివాసీల జీవితాలలో వెలుగులు నింపడానికి వారి భాగస్వామ్యంతోనే ‘కొండబడి’ ఆవిష్కరించబడడం మరింత అద్భుతం. మానవత్వంలో కొండంత ఎత్తుకు ఎదిగి, గిరిపుత్రులతో మమేకమై, ఈ ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించడంతో వారి మనసులలో నిలిచారు ‘విజేత’గా. అలాగే ఈ అద్భుతాన్ని సృష్టించడంలో భాగస్వామ్యులైన వెంకట రమణ ఆకుల, వెంకటేష్‌ వంటి ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. చిన్న మొక్కగా ప్రారంభమైన ఆ ‘బడి’ వటవృక్షంలా ఎదగాలని, తద్వారా ఆ అడవిబిడ్డలు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గిరిపుత్రుల అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాలని ఆశిద్దాం. ఎక్కడో ఒక మూలన ఉన్న ‘కొండబడి’ని సందర్శించి గిరిబిడ్డల చదువు కోసం తన వంతు సహకారాన్ని అందించడమే కాక అడవి గర్భంలోని ఆ ‘బడి’ని అత్యద్భుతంగా పరిచయం చేసిన ప్రశాంతి గారికి ధన్యవాదాలు.

Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకురాలు సత్యవతి గారికి,

మాకు తెలియని 18వ శతాబ్దం చివరి దశాబ్దాలు, 20వ శతాబ్దపు తొలి దశాబ్దాలకు సంబంధించిన మన సాంఘిక చరిత్రకు మూలకారకులైన నాయికా నాయకుల నేపథ్యంలో ఓల్గా గారు ‘గమనమే గమ్యం’ అన్న నవలను వ్రాయడం, ఆ నవలను మీరు భూమికలో జనవరి సంచిక నుంచి ధారావాహికంగా ప్రచురిస్తుండడం ముదావహం. ఓల్గా గారి రచనా విధానంతో ఆనాటి సాంఘిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తున్నారు. అప్పటి సాంఘిక పరిస్థితులకు అద్దం పడుతున్న ఈ నవలను వ్రాసిన ఓల్గా గారికి, దాన్ని ప్రచురిస్తున్న మీకు ధన్యవాదాలు. ఇలాంటి నవలలు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలుగా పెట్టినట్లయితే ఒక నవల చదవడంతో కలిగే సంతోషంతో పాటు ఆనాటి సాంఘిక చరిత్రను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోగలరు.

Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు,

భూమిక ఫిబ్రవరి సంచిక ఇప్పుడే చూశాను. సంపాదకీయంలో ఆడపిల్లల పెళ్ళి వయసు పెంచే ప్రతిపాదన గురించి చదివాను. పోయిన వారం ఈ వార్త పేపర్‌లో చూసినప్పుడే అనుకొన్నా, ఇది తప్పు అని. 18 ఏళ్ళ పెళ్ళి వయసును ఇంకా పెంచటం అనవసరం. ఎలాగూ ఇప్పుడు 20 ఏళ్ళు దాటాకనే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కానీ పరిస్థితులు బాగాలేవని, కొందరు త్వరగా చేయాలని ఆలోచిస్తున్నారు. బలవంతంగా వద్దు అని చెప్పటంలో అర్థం లేదు. ఆడపిల్లల హత్య, ఆత్మహత్య అని చదివినప్పుడు వివరాల్లోకి వెళ్తే చాలా వరకు బాయ్‌ ఫ్రెండ్స్‌ వల్లనే జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తున్న తల్లిదండ్రులకు భయం వేసి త్వరగా పెళ్ళి చేయటం మంచిదనే ఆలోచనలో ఉన్నారు. చాలా మంది అమ్మాయిలు తమ కాళ్ళమీద తాము నిలబడాలనే తాపత్రయంలో తప్పటడుగు వేస్తున్నారు. ఏదేమైనా పెళ్ళి వయసు పెంచనవసరం లేదని నా అభిప్రాయం.

Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

పురుషత్వపు భ్రమల్లో… – పి. ప్రశాంతి

కోడి కూతతో పాటే చూరులో పిచ్చుకల కిచకిచలకి మెలకువ వచ్చింది అరుణకి. అర్థరాత్రి దాటాక ఎప్పటికో నిద్రపట్టింది కానీ నిద్రనిండా కలలే. బద్ధకంగా ఉన్నా లేచి కూర్చుంది. తొందరగా పనులు పూర్తి చేసుకుని మండలంలో ఉన్న బ్యాంక్‌కి ఎల్లాలను కుంటూ ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. రాత్రి జరిగిన గొడవ, భర్త అసహాయంగా కూలబడిన దృశ్యం రెప్పల వెనక కనబడగానే కళ్ళు తెరిచేసింది. మంచంమీద పడుకున్న భర్తవైపు చూసింది. మెలకువ వచ్చినా కదలకుండా పడుకున్నాడని అర్థమైంది. లేచి భర్త దగ్గరకొచ్చి కూర్చుని నుదుటిమీద చెయ్యేసి ‘నువ్వేమీ దిగులు పెట్టుకోమాకు. మనేద మనిషిని తినేసుద్ది. ఏదోటి సేద్దాంలే. నేనోపాలి బ్యాంకుకి పోయొత్తా. మా సంఘంలోనూ మాట్టాడతా. సూద్దాం ఏమౌతాదో. నువ్వు మాత్రం ధీమాగుండాల. అప్పుడే నాకు దైర్నం’ అంటూ లేవబోయింది. ‘అరుణా…’ అంటూ ఆగిపోయిన భర్తకేసి చూసి ‘చెప్పు బావా’ అంది. ‘ఏం లేదులే పో’ అంటూ లేచి కూచ్చున్నాడు సూర్యం. ఒక నిట్టూర్పు విడిచి పనిలో పడింది.

Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

సాంఘి’కుల’ జడ్జిమెంట్స్‌ – ఉమా నూతక్కి

స్త్రీల పట్ల ప్రపంచ దృక్పథం చాలా మారింది. ప్రస్తుత సమాజంలో చాలామంది అభిప్రాయం ఇది. నిజమే… చాలా మారింది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు విద్యావంతుల వుతున్నారు. మగవాళ్ళతో సమానంగా

Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

కుల పితృస్వామ్యానికి వైద్యం చేసిన జ్యోతి లింగమ్మ – డా|| చల్లపల్లి స్వరూపరాణి

అవి 19వ శతాబ్దపు చివరి రోజులు. ఒకపక్క బ్రిటిష్‌ పాలనలో ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అర్రులు చాస్తుంటే సామాజిక అంతస్తుల్లో ఆఖరి మెట్టుపైన ఉన్న కులాలు, అంటరానితనం, వెట్టిచాకిరీ, అవిద్య చుట్టుముట్టిన చీకటి కుహరంలో దుర్భరమైన పీడనను అనుభవి స్తున్నారు. చదువంటే కేవలం అగ్రహారాలలో పుట్టి పెరిగిన వారికి తప్ప ఇతరులకు అంతగా అందుబాటులోకి రాని పరిస్థితి ఇంకా ఉంది. బ్రాహ్మణ అగ్రహారాలలో ఉండే మఠాలు విద్యా పీఠాలుగా భాషా సాహిత్యాలు, వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం, ఆయుర్వేద వైద్యం వంటి విషయాలనే ప్రధానంగా బోధిస్తుండేవి. బ్రిటిష్‌ వారి రాకతో వచ్చిన ఇంగ్లీషు విద్య, తద్వారా వెలుగులోకి వచ్చిన పాశ్చాత్య భావజాల ప్రభావంతో కొందరు చైతన్యం పొంది భారతీయ సమాజంలో పేరుకు పోయిన అవిద్య, అంధ విశ్వాసాలు, సామాజిక రుగ్మతలైన బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం, సతీసహ గమనం వంటి దురాచారాలను రూపుమా పడానికి ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే బ్రహ్మ సమాజం వంటి సంస్థలు నిర్మాణమయ్యాయి. బ్రహ్మసమాజం స్త్రీ విద్యతో పాటు వారి పరంగా అమలవుతున్న సామాజిక రుగ్మతలను రూపుమా పడానికి, అణగారిన కులాల సంస్కరణకూ కృషి చేసింది. అంటరాని కులాలుగా పరిగణించబడే అణగారిన కులాలకు క్రైస్తవ మిషనరీలతో పాటు బ్రహ్మ సమాజం వంటి సంస్థలు కూడా విద్యనందించడం ద్వారా వారి సంస్కరణకు దోహదం చేశాయి.

Continue reading

Share
Posted in మిణుగురులు  | Leave a comment

మనోవ్యాధికి మందుంది – శివరాజు సుబ్బలక్ష్మి

డాక్టర్‌ మాధవరావు ఆ ఊరొచ్చి ఐదారు నెలలే అయినా మంచి పేరు తెచ్చుకున్నాడు. పేదవాళ్ళను ఎంతో దయగా చూసేవాడు. ఆ హాస్పిటల్‌లో అతనితో కలిసి పనిచేస్తున్న లేడీ డాక్టర్‌ కమల మొదట్లో ఇదంతా పేరు కోసం తెచ్చిపెట్టుకున్న ప్రవర్తన అనుకున్నా, తర్వాత్తర్వాత అతని పట్ల గౌరవభావం చూపసాగింది. ఆ రోజు మధ్యాహ్నం తాను హాస్పిటల్‌కి రానని డాక్టర్‌ మాధవరావుకి చెప్పడానికి వెళ్ళింది. అప్పుడే బయటికి వచ్చిన మాధవరావు ఆమె రావడం చూసి వెళ్ళకుండా నిల్చున్నాడు.

Continue reading

Share
Posted in కథలు | Leave a comment

మట్టిగోడల మధ్య గడ్డిపోచ – శివరాజు సుబ్బలక్ష్మి

ఆ ఏడు వేసంగి ఎండలు మండిపోతున్నాయి. పొద్దువాలినా వేడి తగ్గలేదు. పసిపిల్లలు తట్టుకోలేక కంఠం జారిపోయేలా గోలపెడుతున్నారు. ముసలి అవ్వ ఆపుకారా పక్కన పెట్టుకుని కంఠం తడుపుకుంటూ తడిబట్ట వంటికి చుట్టుకు వచ్చే పోయేవాళ్ళని ”టైం ఎంతయిందర్రా” అంటూ గడుపుతోంది.

Continue reading

Share
Posted in కథలు | Leave a comment

గమనమే గమ్యం – ఓల్గా

ఉదయాన్నే చల్ల చిలికే చప్పుడికి నిద్ర లేస్తుంది శారద. అప్పటికే దాసి వచ్చి ఇంటి ముందంతా ఒత్తుగా పేడ కళ్ళాపి చల్లేస్తుంది. ఈ మధ్యనే నరసమ్మ శారదకు ముగ్గులు వేయటం నేర్పింది. ధనలక్ష్మి కూడా చాలా నేర్పింది. శారదా వాళ్ళింటి ముందున్నంత చోటు ఎవరింటి ముందూ లేదు. ఆ చోటంతా ముగ్గులు పెట్టటంలో అమిత శ్రద్ధ శారదకు. గంటకు పైగా తదేక దీక్షతో ముగ్గులతో మునిగిపోతుంది.

Continue reading

Share
Posted in ధారావాహికలు | Leave a comment