గర్భిణీల వార్డు – అయోధ్యా రెడ్డి

డోరిస్‌ లెస్సింగ్‌ (1919-2013) పరిచయం :

సుప్రసిద్ధ బ్రిటన్‌ రచయిత్రి, నోబెల్‌ సాహిత్య బహుమతి గ్రహీత డోరిస్‌ లెస్సింగ్‌, 1919 అక్టోబర్‌లో పెర్షియా (ఇరాన్‌)లోని కెర్మాన్‌ షాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ బ్రిటిష్‌ సంతతివాళ్ళే. చాలాకాలం రొడేషియా (ప్రస్తుత జింబాబ్వే)లో నివసించి తొలుత నర్స్‌ మెయిడ్‌గా, టెలిఫోన్‌ ఆపరేటర్‌గా పనిచేశారు. అక్కడే ఆమె సాహిత్య సృజనకు శ్రీకారం చుట్టారు. తన 15వ ఏట మొట్టమొదటి కథ రాసిన ఆమె, దాదాపు 20వ శతాబ్ది ఆసాంతం రచన కొనసాగించి యూరప్‌ సమకాలీన సాహిత్యంపై చెరగని ముద్ర వేశారు.

Continue reading

Share
Posted in అనువాదాలు | Leave a comment

సాహిత్య కళా విదుషీమణి శివరాజు సుబ్బలక్ష్మి – శీలా సుభద్రాదేవి

పన్నెండో ఏట శివరాజు వేంకట సుబ్బారావు (బుచ్చిబాబు) చిటికెనవేలు పట్టుకొని సంసార బంధంలోకి వచ్చిన సుబ్బలక్ష్మిగారు… కథకుడు, చిత్రకారుడు అయిన బుచ్చిబాబు భార్యగా మాత్రమే ఒదిగిపోలేదు. బుచ్చిబాబు గారి స్ఫూర్తితోనే కలం, కుంచె చేతిలోకి తీసుకొని ఒక చేత కథలల్లటం మొదలుపెట్టి ‘కావ్య సుందరి కథ, ఒడ్డుకు చేరిన కెరటం, మనోవ్యాధికి మందుంది, మగతజీవి చివరి చూపు, శివరాజు సుబ్బలక్ష్మి కథలు అనే అయిదు కథా సంపుటాలు, అదృష్ట రేఖ, నీలంగేటు అయ్యగారు, తీర్పు (తరుణ మాసపత్రికలో సీరియల్‌) నవల”లు రాసి తనకంటూ సాహిత్య రంగంలో ఒక ముద్రని సాధించుకున్నారు. అదేవిధంగా భర్త బుచ్చిబాబుతో పోటీగా కుంచెతో కాన్వాసుపై రంగులు చిందించి అద్భుతమైన ప్రకృతి దృశ్యాల్ని తీర్చారు. దేవికారాణి, ఇందిరాగాంధీ వంటి ప్రముఖుల చిత్రాల్ని కూడా సజీవంగా చిత్రించారు. 2015లో ‘నేచర్‌ ఇన్‌ థాట్స్‌’ పేరుతో బుచ్చిబాబుగారు వేసిన 177 రంగుల చిత్రాల్ని, సుబ్బలక్ష్మి గారి 140 వర్ణ చిత్రాల్నీ కలిపి ఒక విలువైన ఆర్ట్‌ పుస్తకాన్ని కూడా వెలువరించారు.

Continue reading

Share
Posted in నివాళి | Leave a comment

నివాళి

శివరాజు సుబ్బలక్ష్మిగారికి నివాళి

2018లో నేను మొదటిసారి శివరాజు సుబ్బలక్ష్మిగారిని చూసాను. అమృతలత ప్రతి సంవత్సరం అందించే అపురూప అవార్డ్స్‌ ఫంక్షన్‌కి సుబ్బలక్ష్మిగారి ఆత్మీయ అతిధిగా వచ్చారు. ఆ రోజు అవార్డ్స్‌ ఫంక్షన్‌ పూర్తవ్వగానే స్టేజి మీదకి వెళ్ళి తనని కలిసాను. అప్పటికే చాలా ఆలస్యం అవ్వడం వల్ల ఎక్కువ సేపు మాట్లాడటానికి కుదరలేదు. నాకేమో సుబ్బలక్ష్మిగారితో మాట్లాడాలని ఉంది. కొంచెం సేపు ఆవిడతో గడపాలని ఉంది. మర్నాడు ఆవిడ బసచేసిన హోటల్‌కి వెళ్ళే వీలుందేమోనని అమృతని అడిగితే దిల్‌షుక్‌నగర్‌లో దిగారని చెప్పింది. వెంటనే సుబ్బలక్ష్మిగారితో
ఉన్నాయన ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాను. ”రేపు మీరున్న హోటల్‌కి వచ్చి కొంచెంసేపు మీతో మాట్లాడవచ్చా” అని అడిగితే తప్పకరామ్మా! ”రేపే మేము బెంగుళూరు వెళ్ళిపోతున్నాము. ఉదయం వస్తే కొంచెం సేపు మాట్లాడుకోవచ్చు.” అన్నారు. మర్నాడు ఉదయమే దిల్‌షుక్‌నగర్‌లో సుబ్బలక్ష్మిగారు బస చేసిన హోటల్‌కి నేనే డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికే ఆవిడ స్నానం చేసి తయారుగా ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడారు. ఇద్దరు కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేసాం.

Continue reading

Share
Posted in నివాళి | Leave a comment

మమతల మల్లెలు – శ్రీలత అలువాల

మల్లెల సువాసనలను తన కథల ద్వారా వెదజల్లాలని ఆకాంక్షిస్తూ డా||తాళ్ళపల్లి యాకమ్మ గారు కథా రచనను మొదలు పెట్టారనిపిస్తుంది. తన అనుభవాలను రంగరించి పాఠకులకు తమ జీవితంలోని సంఘటనలను గుర్తుచేసే విధంగా ఈ కథలు కొనసాగుతాయి. అణగారిన వర్గంలో పుట్టిన దళిత బిడ్డగా, ఒక సగటు మహిళగా తన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవడానికి తాను పడ్డ కష్టాలు, బాధలు, ఆవేదనలు ఈ కథలలో కనిపిస్తాయి. ఈ పుస్తకం మొత్తం 11 కథలతో రూపుదిద్దుకుంది. ఒక్కొక్క కథ కొన్ని వేల ఆలోచనలను రేకెత్తిస్తూ ముందుకు సాగుతుంది. ఇందులోని మొదటి కథ పుస్తకానికి హృదయం లాంటిది ”మమతల మల్లెలు”. ఈ కథలో రచయిత దళిత కుటుంబంలోని పరిస్థితులు, అనుబంధాలను ఎంతో గొప్పగా చిత్రీకరించారు. సంపాదనతో నిమిత్తం లేకుండా ఉన్నదాంట్లో తృప్తిగా జీవించే కుటుంబం. ఒక తండ్రికి, కూతురికి మధ్య ఉన్న ప్రేమ, అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్న అనురాగం, అన్నాచెల్లెళ్ళ అనుబంధం, భార్యాభర్తల బంధం చాలా ఆత్మీయంగా చిత్రీకరించారు. మార్పును స్వీకరిస్తున్న దళిత కుటుంబాన్ని ఆవిష్కరించారు. తండ్రి తన బిడ్డలను చదివించాలని, పనికి తీసుకెళ్ళకుండా బడికి పంపడం, గుడిసె అయినప్పటికీ ఇంటి చుట్టూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, రకరకాల చెట్లతో అందంగా అలంకరించుకోవడం వంటివన్నీ చైతన్యంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న భావనలు ఆ కుటుంబంలో మనకు కనిపిస్తాయి. తల్లిదండ్రులు ఎంత కష్టం చేసినా బిడ్డల కడుపు నింపడానికి ఎంత ఆరాటపడతారో అర్థమవుతుంది. తాము కడుపు కట్టుకుని మరీ బిడ్డల కడుపు నింపుతారు. నాన్న తువ్వాలులో మడిచి తెచ్చిన కొబ్బరిముక్క, అమ్మ చేయించిన అప్పాలు అందుకు నిదర్శనం. అంతేకాకుండా ఆడబిడ్డను ఆదరించడం ఇంకో గొప్ప అంశం. సంసారాలు చక్కదిద్దుకోకుండా గొడవలతో ఎన్నో సంబంధాలు కుప్పకూలిపోతున్నాయి. అలాంటిది ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎంత మర్యాదగా, ప్రేమగా చూసుకున్నారో చక్కగా వివరించారు.

Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అత్యాచారం వ్యక్తిగతం కాదు… సామాజిక నేరం – షేక్‌ పీర్ల మహమూద్‌

ఓ బూర్జువా సమాజం నిర్మించే చట్టాలతో నేరాలను ఏ మేరకు కట్టడి చేయగలం? ఈ సమాజానికి ఇంకో అదనపు కోర కూడా ఉంది. అది పితృస్వామ్యం. పురుషుల ఆధీనంలో నడిచే వ్యవస్థ స్త్రీల సహజ హక్కులను కాపాడగలదా? మగాడు కేంద్రంగా తయారు చేయబడిన ఏ చట్టమూ సరిగా పనిచేయదు. వరకట్న నిషేధ చట్టం దీనికో ఉదాహరణ. ఎందుకంటే రాజకీయాలు, రాజ్యాంగ యంత్రం, పోలీసు, న్యాయ వ్యవస్థ… అన్నీ పితృస్వామిక ప్రభావంలో పని చేసేవే. కాబట్టి మహిళపై జరిగే అత్యాచారాలను ఆపడంలో వీటి పని తీరు సరిగా ఉండదు. నేరస్తుడికి శిక్ష పడుతుందో లేదో తెలియదు. కానీ ఈ కేసు నడిచే విధానం మాత్రం ఆమెను మానసికంగా కుంగదీస్తుంది.

Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

కార్పొరేట్ల కబంధ హస్తాల్లో వ్యవసాయం -ఎ.నర్సింహారెడ్డి

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన సమయంలో, ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతున్న వేల ప్రజల ప్రాణాలను ఎంత మాత్రం పట్టించుకోని మోడీ ప్రభుత్వం తన ఆశ్రితుల కోసం, స్వదేశీ విదేశీ వ్యవసాయ వాణిజ్య సంస్థల కోసం రైతులను సంక్షోభంలోకి నెట్టే అతి ప్రమాదకరమైన మూడు వ్యవసాయ చట్టాలు చేయడం దారుణం. ఆదరాబాదరా తెచ్చిన చట్టాలు బడుగు రైతుల్ని బలిపెట్టేవిగా ఉన్నాయి. ఈ నూతన వ్యవసాయ చట్టాలు సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతాయనడంలో సందేహం లేదు. ఈ చట్టాలు రైతులను కార్పొరేట్ల దయాదాక్షిణ్యానికి వదిలేస్తాయి. రైతులను కార్పొరేట్లకు కూలీలుగా మార్చనున్నాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక. 60 శాతం ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి కలిగిస్తోందన్న క్షేత్రస్థాయి వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించి నిరాకరించడంలోని ఔచిత్యమేమిటి?

Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

శివరాజు సుబ్బలక్ష్మి కథలు -పి. సత్యవతి

స్వాతంత్య్రానికి పూర్వమూ, తొలి దినాలలోనూ ఆంధ్రదేశంలో గ్రామీణ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలలో ఆడపిల్లల జీవితాలను రికార్డు చేసిన కథలు శివరాజు సుబ్బలక్ష్మి గారివి. ఆమె ఆ ఆడపిల్లలలో ప్రవేశించి వారి ఆకాంక్షలను, ఆవేదనలను అనుభవించి వ్రాసినట్లే ఉంటాయవి. 1925లో జన్మించిన సుబ్బలక్ష్మి చిన్నప్పుడు సంస్కృతం చదువుకుని తరువాత ప్రైవేటుగా మెట్రిక్‌ వరకూ చదివారు. ఇంట్లో స్త్రీల సంభాషణల ద్వారా భాషలోని సొబగులు అర్థం చేసుకోవచ్చని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు చెప్పినట్లు సుబ్బలక్ష్మి గారి కథల్లో ఎక్కడా సంస్కృత ఛాయలు కనపడవు. పాఠకులను కూచోబెట్టి అచ్చమైన తెలుగులో కథలు చెబుతారామె.

Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

‘రామప్ప’ ఆలయం – నాంపల్లి సుజాత

ఏ మాటకామాటే…

నామట్టుకు నేను దేవాలయాల సందర్శన

కాస్తా తక్కువే…!

అదీ అక్కడి సహజ సుందర దృశ్యాలను

ఆస్వాదించడానికే తప్ప…

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

విష సంస్కృతికి గోరీ కట్టాలి – ఎం.డి. ఖాజామొయినుద్దీన్‌

ఉత్తర భారతమంతా చితి మంటలు,

మనువాద పాలనలో.

కామాంధులు రేప్‌ చేసి, హత్యలతో,

హీరోల్లా ఊరేగుతున్నారు.

పురుషులు మహిళలను

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

భూమిక – ఎల్‌. రాజాగణేష్‌

పురాణాల్లో పూజలందుకొనేది ఆదిశక్తే

కానీ ఈ దేశంలో మగాడి చేతుల్లో ఈనాటికీ

ఆడది ఒక పనిమనిషి! మరమనిషి!!

కొందరికైతే వాడి విసిరేసే వస్తువు!!

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

పిల్లల భూమిక 

పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక, అరవింద స్కూల్‌ అసెంబ్లీలో జరిగిన చర్చ తర్వాత చిన్నారులు వ్రాసిన వారి మనోభావాలు…

నేను సంతోషంగా ఉన్నానా…

Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

భూమిక – ఫిబ్రవరి, 2021

భూమిక – ఫిబ్రవరి, 2021

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ఆడపిల్లల జీవితాలను అల్లకల్లోలం చేసే వివాహ వయస్సు పెంపు ప్రతిపాదన -సత్యవతి

”అష్ఠ వర్షాత్‌ భవేత్‌ కన్యా” అంటే ఎనిమిదేళ్ళు వచ్చిన బాలిక కన్య కిందే లెక్కకట్టి ఎనిమిదేళ్ళు నిండకుండా పెళ్ళి చేయాలి అనేది ఒకప్పటి నియమం. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ రాసిన గురజాడ ఉద్దేశ్యం బాల్య వివాహాలు చెయ్యొద్దని చెప్పడమే. అయితే ఈ కథ చదివిన వాళ్ళు, దృశ్యంగా చూసిన వాళ్ళు కడవల కొద్దీ కన్నీళ్ళు కారుస్తారు కానీ తమ కూతుళ్ళకు బాల్య వివాహమే చేస్తారు. ఆమె చిన్న వయసులో భర్తను కోల్పోయినప్పుడు అదే కుటుంబం ఆమె పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తుంది. ఆమెను అనాకారిని చేస్తుంది. ఆమె చుట్టూ ”అరిష్టాలను” అల్లి మూలన కూర్చోబెడుతుంది. ఇంటిల్లిపాదికీ జీతం భత్యం లేని ఒక బానిసగా మార్చేస్తుంది. ఇది హిందూ సంప్రదాయం లోని అమానుషం.

Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

జెండర్‌ స్పృహ లేని బండ వ్యవస్థలు – పి. ప్రశాంతి

చెంగుచెంగున ఎగురుకుంటూ వచ్చింది రాణి నేస్తాన్ని కలవడానికి కర్రలు, తాటాకులతో కట్టిన దడికి వెదురు తడికను గేటులా అమర్చారు. దాని తోసుకుని ఉత్సాహంగా ‘సోనీ… సోనీ… అని అరుచుకుంటూ లోపలికొచ్చింది. అక్కడే జామచెట్టు మొదట్లో కూర్చున్న సోని నిరాసక్తంగా చూసింది రాణిని. చలాకీగా ఉండే సోని అలా ఉలుకూపలుకూ లేనట్లు కూర్చోడం రాణికి ఆందోళన కలిగించింది. ఈ మధ్య కొన్నాళ్ళుగా సోనీలో ఈ మార్పుని చూస్తోంది. నవ్వుతూ గెంతుతూ ఉన్నట్టుండి మౌనంగా అయిపోతుంది. దొంగా, పోలీస్‌ లాంటి ఆటలని ఆడనంటోంది. ఊర్లో చుట్టు పక్కల ఇళ్ళల్లోని అడ, మగ పిల్లలందరూ కలిసి కబడ్డీ ఆడుకునేవారు. సోనీ తమ టీంలో అంటే తమ టీంలో అని పోటీ పడేవారు. అంతబాగా ఆడే సోని కబడ్డీ కోర్టువైపే రావట్లేదు. ఎప్పుడైనా వచ్చినా హఠాత్తుగా ఆట వదిలి వెళ్ళిపోతుంది. ఏమైందో అర్థంకాక, అడిగినా ముభావంగా ఉండడంతో ఫ్రెండ్స్‌ సోనీని వదిలేసి ఆడుకోడం మొదలుపెట్టారు. ఇప్పుడు సోమవారం నించి బడి తెరుస్తున్నారన్న వార్తని మోసుకొచ్చిన రాణి అక్కడ రాయిలా కూర్చున్న సోనిని చూసి ఆగిపోయింది. దగ్గరకొచ్చి పక్కన కూర్చుని ‘ఏమయిందే?’ అంది రెండు, మూడు సార్లు కుదిపి అడిగేసరికి ఏడ్చేసింది సోని. ‘నేను బడికి రాను. ఈ మాటే అమ్మతో చేప్తే చక్కగా చదివిస్తామంటే చదువుకోడానికి మాయ రోగమా అంటోంది. నా మాటవినట్లేదు… నాకు చదువొద్దు. నేను బడికి రాను’ అంటూ ఏడుస్తూనే ఉంది. ఏం చెప్పాలో తోచక బిక్కమొహంతో సోనీని పట్టుకుని పక్కనే కూర్చుంది రాణి.

Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

చదువుకోండి… చదవనివ్వండి… చదివించండి… – ఉమా నూతక్కి

”యత్ర నార్యస్తు పూజ్యంతే

రమతే తత్ర దేవతా,

యత్రైతాస్తు న పూజ్యంతే

సర్వాస్తత్రఫలాః క్రియాః” అని మనుస్మృతి చెప్పింది అంటారు.

Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

జయశాలి భాగ్యమ్మ – డా|| చల్లపల్లి స్వరూపరాణి

యిటీవల దళిత ఉద్యమాన్ని ప్రతిఘటనా స్థాయికి తీసుళ్ళిె అటు ప్రభుత్వాలకు, యిటు పెత్తందారీ కులాల దౌర్జన్యకారులకు మింగుడు పడకుండా వార్తలలో వ్యక్తిగా అసాధారణమైన గుర్తింపును పొందిన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం, పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన నిరక్షరాస్యురాలైన డెభ్బై రెండు సంవత్సరాల వృద్ధ దళిత పేద స్త్రీ జొన్నలగడ్డ జయ భాగ్యమ్మ. ఆమె తల్లిదండ్రులు పుల్లగూర సువార్తమ్మ, ప్రకాశం. వీరిది గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట పట్టణానికి సమీప గ్రామమైన తిమ్మాపురం. అయితే జయ భాగ్యమ్మ తండ్రి తన అత్తగారి వూరైన పెదగొట్టిపాడు గ్రామానికి యిల్లరికం వొచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఆమెకి అదే గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సుబ్బారావుతో వివాహం జరిగింది. సుబ్బారావు, జయ భాగ్యమ్మలకు ముగ్గురు సంతానం – యిద్దరు మొగపిల్లలు, వొక ఆడ పిల్ల. ఆమెకి చదువులేదు. అటు తల్లిదండ్రులనుంచి గానీ యిటు అత్తమామల నుంచిగానీ కనీసం సెంటు భూమిలేదు. రెక్కల కష్టం మీద బతుకు వెళ్ళదీయడం తప్ప వేరే ఆర్ధిక వనరులు లేని కుటుంబం ఆమెది. పెదగొట్టిపాడు సగటు భారతీయ గ్రామానికి నిలువెత్తు ప్రతినిధి లాంటి వూరు. అక్కడ కుల భూస్వామ్యం బాహాటంగానే బుసలు కొడుతుంది. గుంటూరు మిరపకారం పొగరంతా అక్కడి దొర తనంలో గుప్పుమంటుంది. అయితే ఆ వూరిలో మాలా మాదిగలు కలిసి సుమారు వెయ్యి గడప వుండే దళిత వాడలో యెవరికీ పొలం పుట్రా లేకపోయినా వారి ఆత్మగౌరవానికి మాత్రం కొదవలేదు. దళితులు పాలేరుతనం, భూస్వాముల యిండ్లలో పాచిపనులు చెయ్యడం వంటి ఆత్మ న్యూనతకు గురిచేసే పనులను చాలారోజుల క్రితమే మానివేసి తమ గౌరవానికి భంగం కాని విధంగా కాంట్రాక్ట్‌ పనికి, ూలికి వెళ్ళి గౌరవప్రదమైన జీవనోపాధిని పొందడం ఆ గ్రామ దళిత చైతన్యా నికి నిదర్శనం.

Continue reading

Share
Posted in మిణుగురులు  | Leave a comment