ప్రతిస్పందన

దీర్ఘకాలంగా జైళ్ళల్లో మగ్గుతున్న జీవిత ఖైదీల విడుదలకు గత కొన్ని నెలలుగా ఆశలు కల్పించిన ప్రభుత్వం ఎట్టకేలకు 2007 జనవరి 26న జి. ఒ. నెం. 314, 315లను జారి చేసి తిరిగి వాటిని జి.ఒను నిలుపుదల చేయడం వలన ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు, మానసిక క్షోభకు గురవుతున్నారు. మా ఈ ఆవేదనను మానవతా దృక్పథంతో తిలకించి ఖైదీల విడుదలకు సహకరించవలసిందిగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రచయితలు, మేధావులు, దయార్ద్ర హృదయుల్ని ప్రార్థిస్తున్నాము. మాపై కరుణ చూపి జైళ్ళలో మగ్గుతున్న మమ్నల్ని విడుదల చేయించి, మా కుటుంబాలలో వెలుగులు నింపవలసిందిగా తమరిని ప్రార్ధిస్తున్నాము.

– ‘జీవిత ఖైదీలు’ కేంద్ర కారాగారం, కడప

Continue reading

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | Leave a comment

పునరుజ్జీవనం

– చల్లపల్లి స్వరూపరాణి

సునీత బియస్సీ, బియ్యీడీ చేసి హైదరాబాదులోని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్‌ స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తోంది. కర్నూలు దగ్గర కోడుమూరు తన స్వగ్రామం. హైదరాబాదు నుంచి యింటికెళ్ళాలన్నా, యింటినుంచి హైదరాబాదు వెళ్ళాలన్నా మధ్యలో కర్నూల్‌లో దిగి తన ఫ్రెండ్స్‌ అరుణ, విమలలను కల్సి ఒకటీ రెండు రోజులుండి మళ్ళీ గమ్యస్థానానికి చేరడం సునీతకి అలవాటు. స్కూలుకి సంక్రాంతి సెలవులు యివ్వగానే సిటీలో తన చెల్లెళ్ళు, తమ్ముళ్ళకి బట్టలు తీసుకుని చిన్నపాటి షాపింగు ముగించుకొని వుదయం పదిగంటలకంతా హైదరాబాదు ఇమ్లీబన్‌ బస్‌స్టేషన్‌లో కర్నూలు బస్‌ ఎక్కింది. Continue reading

Share
Posted in కథలు | Leave a comment

సంస్కృతి, సృజనల మేళవింపు హేమలతాలవణం

– శిఖామణి

హేమలతాలవణం. తెలుగు వారికి చిరపరిచితమైన పేరు. అటు సాహిత్య ప్రియులకు మహాకవి పద్మభూషణ్‌ గుర్రం జాషువా కుమార్తెగా తెలుసు. ఇటు సామాజికులకు సంఘ సంస్కర్త గోరాగారి కోడలిగా, సర్వోదయనాయకులు లవణంగారి అర్ధాంగిగా తెలుసు. సంస్కరణ, సాహితీ రంగాలలో తనదైన వ్యక్తిత్వంతో, సొంత ముద్రతో నిలిచిన హేమలతాలవణం సామాజికరంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ తో సత్కరించడం అభినందనీయం. ఇది తెలుగు నాట సంస్కరణరంగంలో పని చేస్తున్న ఎందరికో స్ఫూర్తిదాయకమైన సంఘటన.
Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

చిలుక జోస్యం

– ఎల్‌. మల్లిక్‌

(అది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని అసెంబ్లీ భవన సముదాయ పరిసర ప్రాంతం. అక్కడ ఒక చోట ఇద్దరు చిలుక జోస్యం వాళ్ళు, తమ చిలుకల పంజరాలను పక్కపక్కన పెట్టి, ఆ ప్రక్కనే ఉన్న టీ బడ్డీ వద్ద టీ తాగుతున్నారు. అప్పుడు ఆ చిలుకలు రెండూ ఒకదానితో ఒకటి సంభాషించడం మొదలుపెట్టాయి.)

పెంటి చిలుక: ఏమి మామా! బాగున్నావా? మళ్ళీ ఎన్నాళ్ళకు నిన్ను చూడగలిగాను! అసలు నిన్ను చూస్తాననే అనుకోలేదు. ఇటు ఎలా వచ్చావు?

పోతు చిలుక: ఏమి బాగులే! ఎంతైనా పంజరం బ్రతుకులే కదా!
Continue reading

Share
Posted in కథలు | Leave a comment

నేను మనుషుల్ని ప్రేమిస్తాను

– రోష్ని

పూలన్నింటినీ నేను ప్రేమిస్తాను
రంగు, వాసన, ముళ్ళు- ఇవేవీ నా ప్రేమకు అడ్డురావు
నేను ప్రేమిస్తాను నాకు తెలిసిన మనుషుల్ని
Continue reading

Share
Posted in కవితలు | 1 Comment

నానీలు

– కందేపి రాణీప్రసాద్‌

కుటుంబానికి
కేందబ్రిందువు
పేరు హౌస్‌ వైఫ్‌
గుర్తింపు లేని జాబ్‌
Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

అద్దం

– సుజాతా చౌదరి

ఎవరన్నారు
సీతకి
అద్దం చాలా అవసరమని?
అద్దం లేకుండా
ఆమె బతకలేదని?
Continue reading

Share
Posted in అనువాదాలు, కవితలు | Leave a comment

దృశ్యా దృశ్యం

– తమ్మెర రాధిక

సంకురుమయ్య దేనిమీదొచ్చాడు?
ఎంతో క్యాజువల్‌ పశ్న్ర
జవాబూ అంతే.. అలవోక..
ఇప్పుడో?
Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

ఎలా

– సత్యభాస్కర్‌

మనలో ఒకరిని
వెలివేసి వెలయాలంటే ఎలా!?
పుట్టుకతో
అందరం శరీరాలమే!
సంఘం సృష్టించిన
చకబ్రంధంలో చిక్కి
శల్యమవుతోన్న శవాలమే!
Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

దీప భ్రమర న్యాయం

– డి. కామేశ్వరి

పూలనించి రంగులడిగి, మనసనే కలం ముంచి రాస్తున్నాననను
నీ జ్ఞాపకాలలో నిద్రించాను, నీ కలలతో మేల్కొన్నానని పేమ్రలేఖలు రాయను
నిన్ను నా పేమ్ర సామాజ్య్రానికి రాణిని చేస్తానని, నీ కోసం తాజ్‌ మహల్‌ కట్టిస్తాననను
నీవంటే నాకిష్టం అది నీవు నమ్మితే నా దానివికా అంటాను
Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

చిక్కటి అడవిలో రెక్కవిప్పుతున్న చైతన్యం

– కె. సత్యవతి

లయోలా ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ చింతూరు మండలం కాటుక పల్లి వారి తరఫున వారు జరుపబోయే అంతర్జాతీయ మహిళాదినం సమావేశంలో పాల్గొన వలసిందిగా ఆహ్వానించ డానికి మోహన చంద్రగారు నా దగ్గరికి వచ్చినపుడు నేను కొంత తటపటాయించాను. అయితే ఈ సమావేశం దట్టమైన అడవిలో రెండు వేలమంది పైగా గిరిజన స్త్రీలతో జరుగుతుందని ఆయన చెప్పగానే నేను వెంటనే ఒప్పేసుకున్నాను. నాతో పాటు డాక్టర్‌ సమత రోష్ని, పంతం సుజాత, భూమికలో పనిచేసే లక్ష్మి కూడా బయలు దేరారు.
Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆంధ్రప్రదేశ్‌ హెచ్‌ఐవి/ఎయిడ్స్‌

అల్లిగూడెం నుండి వచ్చిన రాములమ్మ రెండో తరగతి చదివి మానేసి వ్యవసాయం చేసేది. తల్లిదండ్రులు చదివించడానికి అంగీకరించ లేదు. లిడ్స్‌లో చేరి చదువు కొనసాగిస్తోంది. ఆటలంటే ఇష్టమని చెప్పింది. నేషనల్‌ కబాడీ పోటీలకు చత్తీస్‌గడ్‌ వెళ్ళింది.జాతీయ స్థాయిలో ఆడింది రాములమ్మ.
Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

పదునెక్కిన పద శక్తి

(దక్షిణాసియా దేశాల రచయిత్రుల సదస్సు)
ఓల్గా విమెన్స్‌ వరల్డ్‌ (ఇండియా)
మూడు రోజులు. ఐదు దేశాలు. అనేకానేక ఆలోచనలు అనుభవాలు, అనుభూతులు.

ఢిల్లీలో ఫిబ్రవరి 21-23 వరకు దక్షిణాసియా దేశాల రచయిత్రులు తమ జీవితానుభవాలను, వాటిలో నుంచి పుట్టిన సాహిత్య స్రవంతులను కలబోసుకున్నారు. భిన్న నేపధ్యాలలో, సంక్లిష్ట సందర్భాలలో రచనను ఒక రాజకీయ చర్యగా భావించి, ఎన్ని ఆటంకాలనో అధిగమించి, ఎన్ని నిర్భంధాలనో భరించి, ఎన్ని నిష్టూరాలనో సహించి రచనను కొనసాగిస్తున్న కలం యోధులు కొందరు. జైళ్ళు, దేశ బహిష్కారాలు, బెదిరింపులవంటి బహిరంగ నిషేధాలను ఎదుర్కునేవారు కొందరైతే, కుటుంబం, సమాజం, ప్రచురణరంగాలు సాహిత్య పీఠాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా విధించే నిషేధాలకు గురవుతున్నవారు మరి కొందరు.
Continue reading

Share
Posted in సాహిత్య వార్తలు | Leave a comment

దీర్ఘాయువు గుట్టు చెప్పిన అక్క

– రాజేశ్వరి దివాకర్ల

వచనాలను పలికిన స్త్రీ శరణులలో అక్క మహాదేవి అగ్రగణ్యురాలు. ఆమె ఆలోచనాత్మకాలైన అనేక వచనాలను పలికింది. ఆమె జీవితంలో ఎన్నో మహత్తరమైన సంఘటనలు జరిగాయి. ఆమె అపారమైన ధైర్య సాహసాలను ప్రదర్శించింది. అక్కమహా దేవి చెన్న మల్లికార్జునుడిని వలచింది. అనంత ప్రకృతిలో అంతటా అతనిని చూచింది. అతనిని చేరుకోవాలని సకల భోగభాగ్యాలనూ, భర్తనూ వదిలి ఇల్లు విడిచి ఒంటరిగా బయలుదేరింది.
Continue reading

Share
Posted in వ్యాసాలు | 1 Comment

నరాల్లో సుడి తిరగిన వ్యధకి అక్షర రూపం

– పంతం సుజాత

ప్రతి రోజూ వెన్నెల్ని చూసి చూసి అమావాస్య వస్తే మనసు భారమవడం ఖాయం. అలాగే ఒకేసారి ఇన్ని మంచి కథలు చదివి చదివీ పుస్తకం మూసాక ఆలోచన చెమ్మగిల్లుతుంది. గొరుసు జగదీశ్వర రెడ్డి కథలు ‘గజ ఈతరాలు’ చదివితే ప్రతి పాఠకుడికీ అదే భావన కలుగుతుంది.

మూడు ప్రాంతాల భాషల మీద మంచి పట్టు ఉందని నిరూపించుకున్న రచయిత. ఓ పక్క తెలంగాణా భాష, మరో పక్క శ్రీకాకుళం యాస, కథకుడి మనసులో గోదావరి ఘోష.
Continue reading

Share
Posted in కథలు | Leave a comment

తూనీగలు, కవిత్వ పరిశీలన : పుస్తకావిష్కరణ

తెలంగాణా విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్‌ ప్రొ. వి. త్రివేణి రచించిన తూనీగలు (నానీలు), చిల్లరిగె స్వరాజ్యలక్ష్మి కవిత్వ పరిశీలన అనే రెండు గ్రంధాలను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎన్‌. గోపి ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన తెలుగు శాఖ అధ్యక్షురాలు ఆచార్య సుమతీ నరేంద్ర మాట్లాడుతూ తమ పూర్వ విద్యార్ధిని అయిన త్రివేణి చక్కటి పరిశోధకురాలిగా, కవయిత్రిగా ఎదిగినందుకు హర్షాన్ని వ్యక్తపరిచారు. Continue reading

Share
Posted in పుస్తకావిష్కరణ | Leave a comment