దీర్ఘకాలంగా జైళ్ళల్లో మగ్గుతున్న జీవిత ఖైదీల విడుదలకు గత కొన్ని నెలలుగా ఆశలు కల్పించిన ప్రభుత్వం ఎట్టకేలకు 2007 జనవరి 26న జి. ఒ. నెం. 314, 315లను జారి చేసి తిరిగి వాటిని జి.ఒను నిలుపుదల చేయడం వలన ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు, మానసిక క్షోభకు గురవుతున్నారు. మా ఈ ఆవేదనను మానవతా దృక్పథంతో తిలకించి ఖైదీల విడుదలకు సహకరించవలసిందిగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రచయితలు, మేధావులు, దయార్ద్ర హృదయుల్ని ప్రార్థిస్తున్నాము. మాపై కరుణ చూపి జైళ్ళలో మగ్గుతున్న మమ్నల్ని విడుదల చేయించి, మా కుటుంబాలలో వెలుగులు నింపవలసిందిగా తమరిని ప్రార్ధిస్తున్నాము.
– ‘జీవిత ఖైదీలు’ కేంద్ర కారాగారం, కడప
