చందమామ లాగా ఉండే చరద్రోత్సవం
ఆనందంతో మునిగి తేలే చంద్రోత్సవం
నాటకాలు, పాటలతో ఉండే చంద్రోత్సవం
ఆకతాయి పిల్లలని మంచి మార్గంలో నడిపించే చంద్రోత్సవం
చందమామ లాగా ఉండే చరద్రోత్సవం
ఆనందంతో మునిగి తేలే చంద్రోత్సవం
నాటకాలు, పాటలతో ఉండే చంద్రోత్సవం
ఆకతాయి పిల్లలని మంచి మార్గంలో నడిపించే చంద్రోత్సవం
నాకు ప్రేమ లేఖలు రాయడం చాలా ఇష్టం.
నా నేస్తాలందరికీ ప్రేమలేఖలు రాసాను. ఇంకా రాయాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు.
భూమిక ఎడిటర్ గారికి,
గౌరవనీయ సోదరి కె.సత్యవతిగారికి హృదయపూర్వక నమస్కారములు.
అమ్మా !
మార్చి సరచిక సంపాదకీయంలోని ఆర్ద్రత, నిజాయితీ, దుర్గాబాయి దేశ్ముఖ్ జీవితంపై గాంధీజీ ప్రభావానికి సంబంధించిన ఘటనల చిత్రీకరణ, ప్రశాంతి, అనిశెట్టి గారల వ్యాసాల్లోని మహిళా చైతన్యము; వనజ, ఇంద్రగంటి వారి వ్యాసాల్లోని కటు యథార్థత; అశోక్ గారి ఇంటర్వ్యూలో సంధ్యక్కని ప్రభావితం చేసిన జీవన అనుభవాలు; శ్రీలత కథలో ‘మేరీ’; శాంతిశ్రీ కథానికలో కోమలిని పాత్రల అద్భుత చిత్రణ, నాంపల్లివారి కవిత… అన్నింటి ద్వారా మీరు నింపిన స్ఫూర్తికి, చైతన్యానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను.
రోహిణీ కార్తి… రోళ్ళు పగులుతాయంట! కాస్త పొద్దెక్కగానే మొదలౌతున్న వడగాలులకి పిట్టా, పురుగూ కూడా ఎక్కడివక్కడ సద్దుమణిగిపోతున్నాయి. ఇక లాక్డౌన్ పుణ్యమా అని పెద్దా చిన్నా తేడా లేకురడా అన్ని పనులకి తాళాలేయడంతో జనమంతా ఇళ్ళకి పరిమితమయ్యారు.
పవహిస్తున్న దుఃఖంకాళ్ళు ప్రవహించిన దుఃఖం అలసట తీరగానే ఆగిపోతుంది
కళ్ళు ప్రవహించే దుఃఖం చెక్కిళ్ళ మీదే ఆవిరవుతుంది
‘హాయ్, హౌ ఆర్ యూ?’ అతడి నుండి వచ్చిన మెసేజ్ ఈమె మొబైల్లో అర్ధగంట నుండి చల్లగా కూర్చొని ఉంది.
హర్షిణి ఏదో ఒక నంబర్ సెర్చ్ చేయడానికి మొబైల్ తీసినప్పుడు స్క్రీన్పై ఉన్న అతడి మెసేజ్ చూసి, అతడి వాట్సాప్కు ‘ఓ! హాయ్! ఐ యాం ఫైన్… థాంక్స్’ అని మరుసందేశాన్ని పంపింది.
(గత సంచిక తరువాయి…)
ఉప్పు సత్యాగ్రహం
ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమం ప్రపంచ చరిత్రలో ఏ దేశంలోనూ కనీవినీ ఎరుగం. 24 రోజులు పాదచారియై గాంధీ మహాత్ముడు తన అనుచరులతో 200 మైళ్ళు నడిచి పశ్చిమ సముద్ర తీర ప్రాంతమైన దండి గ్రామం చేరారు. దారి పొడవునా వేలాది మంది జనులు ఆయనకు స్వాగతం చెప్పారు. జయ జయ ధ్వానాలు చేశారు. దండిలో ఆయనకు కొందరు గుజరాత్ విద్యాపీఠం విద్యార్థులు కూడా కలిశారు.
వేలూరి కృష్ణమూర్తిటెహరాన్లోని (ఇరాన్) ఒక మధ్యమ వర్గపు కుటుంబంలో జన్మించిన మజీద్ మజిది ఇరానియన్ భాషలో ప్రతిష్టాత్మకమైన చిత్రాలకు దర్శకత్వం వహించి గొప్ప దర్శకుడన్న పేరు గడించాడు. 58 ఏళ్ల మజీద్ మజిది తన బాల్యం నుండే నటనలో ఆసక్తిని పెంపొందించుకొన్నారు. తన 14 ఏళ్ల వయసులోనే అమెచూర్ (ూఎa్వబతీ) నాటక తండం చేరి అనంతర కాలంలో నాటక పాఠశాలలో అభినయంలో తర్ఫీదు పొందాడు. 1979లో ఇరాన్లో జరిగిన రాజకీయ క్రారతి తరువాత అతను సినిమాలను గురించి ఆసక్తి పెంపొందించుకొని ‘చిల్డ్రన్ ఆఫ్ హెవెన్’ అన్న తన మొదటి చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ మొదటి చిత్రానికి అకాడెమీ ప్రశరస కూడ లభించినది. అతను దర్శకత్వం వహించిన ‘సాంగ్ ఆఫ్ స్పారోస్’ చిత్రాన్ని 2008లో విశాఖపట్టణంలో జరిగిన భారత అరతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రారంభిక చిత్రంగా చూపారు. 2015లో అతను దర్శకత్వం వహించిన మహమ్మద్ పైగంబర్ జీవితాన్ని గురించి దర్శకత్వం వహించిన ‘మహ్మద్, ద మెసంజర్ ఆఫ్ గాడ్’ అన్న చిత్రం ముస్లిం ప్రపంచపు గమనాన్ని చాలా ఎక్కువగా ఆకర్షించినది. అతను దర్శకత్వం వహించిన ఇతర చిత్రాలు : బరాస్, కలర్ ఆఫ్ పారడైజ్. ‘బియాండ్ ది క్లౌడ్’ ఇరాన్ దేశపు మజీద్ మజిది దర్శకత్వం వహించిన మొదటి భారతీయ చిత్రం. ఈ చిత్రం 2017లో ఇంగ్లీషు, హింది మరియు తమిళ భాషలలో నిర్మించబడినది. ఈ చిత్రం ఈమధ్యనే గోవాలో జరిగిన 48వ అరతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రారంభిక చిత్రంగా ప్రదర్శింపబడి సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నది.
ఇది ఒక అచ్చమైన అన్వరీయం.
పసుపు పచ్చగా కాంతులీనే ‘అనగనగా ఒక చిత్రకారుడు’ అనే ఈ పుస్తకం నా చేతిలో పడి పదిహేను రోజులకు పైనే అయింది. ఫేస్బుక్లో చాలావరకూ చదివిన వ్యాసాలే అయినా పుస్తకంగా చూసినపుడు కలిగే అనుభూతి వేరు. అదే అక్షరానికున్న అధికారత.
(ఇటీవల మరణించిన సావిత్రి గారికి నివాళిగా ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాం)
నాకు పదమూడేళ్ల వయసులోనే మా గ్రామంలో (బేతపూడి, రేపల్లె దగ్గర) మూడు భిన్నమైన రాజకీయ ధోరణులు కనిపించాయి. మా చిన్నన్నయ్య కుడితిపూడి సత్యనారాయణ కారగ్రెసువైపు ఆకర్షితుడయ్యాడు. మా పెదనాన్న కొడుకు పుండరీకాక్షయ్యగూడా అప్పటికే కారగ్రెస్ కార్యకర్త. ఒకసారి మా ఇంటికి భారతీదేవిరంగా వచ్చారు. మా అన్నయ్య కారగ్రెస్ కార్యక్రమాల్లో భాగంగా దేశభక్తి ప్రబోధించడం, మాలపల్లెల్లో గూడ రాజకీయ చైతన్యం కొరకు కృషి చెయ్యడం, ఖద్దరు ధరించడం ఖద్దరు మూటలు నెత్తిన పెట్టుకొని అమ్మడం చేసేవాడు. కృష్ణాపత్రిక విధిగా తెప్పించేవాడు. నేను గూడా చదువుతూ ఉండేదాన్ని. త్రిపుర కారగ్రెస్ మహాసభ విశేషాలు చదువుతూ సుభాష్చంద్రబోస్ అరటే అభిమానం పెంచుకున్నాను.
పరిచయం : సింహపురి పరిధిలో ఆత్మకూరు మండల వాసి దోర్నాదుల సుబ్బమ్మ ”మోడుపడిన మూడు గుండెలు” (1958) నవలతో రచనకు శ్రీకారం చుట్టి సాహిత్యంలో తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. సుబ్బమ్మ ఇంతవరకూ కథలు, కథానికలు, కవితలు, వ్యాసాలు, పాటలు, లేఖలు, నవలలు, శతకం, జీవిత చరిత్ర రాశారు. ఈమె రచనలన్నీ మహిళా నేపథ్యాన్ని కలిగి ఉండడం విశేషం. ముప్ఫై ఎనిమిది సంవత్సరాలుగా విసుగు, విరామం లేకుండా ఉద్యమకారిణిగా, మహిళా మండలి అధ్యక్షురాలిగా, కవయిత్రిగా, రచయితగా మహిళాభ్యుదయం కోసం నిరంతరం పోరాటం సాగించారు దోర్నాదుల సుబ్బమ్మ.
రాజమండ్రికి పదిమైళ్ళ దూరంలో ఉన్న ‘ఉండేశ్వరపురం’ లోని దంతులూరి సూర్యనారాయణ రాజు, బుచ్చి సీతాయమ్మల ఆరవ సంతానంగా మే 18, 1949 లో జన్మించిన సావిత్రి అక్టోబర్ 4, 1991లో మరణించారు.
ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం ప్రకటించి ఇప్పటికి 110 సంవత్సరాలు అయింది. దీనికి స్ఫూర్తిని ఇచ్చిన ఘటన 1857వ సంవత్సరంలో మార్చి 8వ తేదీన న్యూయార్క్ నగరంలో జరిగింది. చికాగో మహానగరంలోని ఒక జౌళి మిల్లులో పనిచేస్తున్న శ్రామిక మహిళలు తాము పనిచేస్తున్న (12 గంటల నుండి 18 గంటల వరకు) పనిగంటలలో మార్పును కోరుతూ వేలాదిమంది మహిళలు నడివీథుల్లోకి వచ్చారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ శ్రమను తగ్గిస్తూ రోజుకు 8 గంటలు మాత్రమే పనిగంటలుగా నిర్ణయించాలని డిమాండు చేశారు. పురుషులతో పాటు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఓటు హక్కును, సంఘాలను పెట్టుకునే హక్కును కల్పించాలని కోరారు. అసాధారణమైన ఆ పోరాటానికి మద్దతుగా అనేకమంది మహిళలు గళం కలిపారు. దాదాపు 146 మంది వరకు మహిళా కార్మికులు దారుణంగా కాల్చి చంపబడ్డారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయని అసాధారణమైన ఆ పోరాటంలో వేలాదిమందిని ఆనాటి ప్రభుత్వం నిర్బంధించింది. ఫలితంగా 1910 సంవత్సరంలో డెన్మార్క్ రాజధాని కోపెన్హగ్లో జరిగిన రెండవ అంతర్జాతీయ సోషలిస్టు మహిళా సదస్సులో జర్మనీకి చెందిన ‘క్లారా జెట్కిన్’ మార్చి 8 ని మహిళా కార్మికుల పోరాటదినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆ స్ఫూర్తి నుండే భారతదేశంలో కూడా అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని 1911 నుండి జరుపుకుంటున్నాం. ఈ పోరాటాల ఫలితంగా కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు, మహిళా కార్మికుల గురించి అనేక చట్టాలు చేయబడ్డాయి. 1911లో ప్రారంభమైన సరళీకరణ విధానాల ప్రభావం వలన ప్రైవేటు రంగం బలపడడంతో మహిళా కార్మికుల చట్టాలు అప్పటి నుండే కుంటుపడుతూ వస్తున్నాయి. శ్రామిక మహిళా సామాజిక, రాజకీయ, ఆర్థిక పరమైన హక్కులు క్రమక్రమంగా అర్థం మారిపోతూ శ్రామిక అనే పదం అంతర్ధానమై పోయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవమై రూపుమార్చుకుంటూ ప్రభుత్వాలు ఒక వేడుకగాను, ఒక సంబరంగాను, ఒక ఉత్సవంలా జరుపుతూ దాని ప్రాధాన్యతను, స్ఫూర్తిని దెబ్బతీయడం చూస్తున్నాం.
పౌరసత్వ సవరణ చట్టాలకు అస్సాంలో ప్రారంభమైన వ్యతిరేకత దేశవ్యాప్తంగా ఆందోళన ఊపందుకుని మరింత ఉధృతమవుతున్నది. ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో, అన్ని రాష్ట్రాలలో ఈ ఉద్యమం ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని, కొత్త హంగులతో, ఒక సాంస్కృతిక ఉద్యమంలా మొత్తం దేశాన్నే కుదిపివేస్తున్నది. ఈ ఉద్యమంలో స్త్రీలు, ముస్లిం మహిళలు ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున పాల్గొనడమే కాకుండా, ముందుండి ఉద్యమాన్ని నడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపైన, అధికార పార్టీ బిజెపి పైన వ్యతిరేకత పెరుగుతున్న సందర్భంలో, ఫెడరల్ వ్యవస్థపై కూడా దాని ప్రభావం తప్పనిసరిగా వ్యక్తమవుతున్నది. కొన్ని రాష్ట్రాలు ఈ చట్టాలపై వ్యతిరేకత చూపడమే కాకుండా, శాసనసభల్లో ఈ చట్టాలను అంగీకరించబోమని, వాటిని అమలు చేయమని కూడా తీర్మానాలు పాస్ చేయడం జరిగింది.
రాశి ఫలాల కోసం
వెంపర్లాడితిమి కదా!
రాజ్యపూజ్యాలను వెతుకుతూ
ఆ పంచాంగంలో…
విజృంభిస్తున్న వైరస్ గురించి
విప్పి చెప్పిందా ఆ గ్రంథం?
ఉమ్మ నీటిలో కదులుతున్నప్పుడే…
కమ్మనైన నీతి కథలు వినిపించండి!
ఉగ్గునూరి గుక్క గుక్క తాగించేటప్పుడే
విచక్షణా స్తన్యాన్ని రంగరించండి!