ఈ మహమ్మారిని
తరిమేయాలనే ఆవేశం
అరదరిలోనూ వుంది కానీ ఆచరణ
కొరతయింది!
లోకాన్ని దాని విషకోరలతో
అడుగడుగు వేసుకుంటు
ఈ మహమ్మారిని
తరిమేయాలనే ఆవేశం
అరదరిలోనూ వుంది కానీ ఆచరణ
కొరతయింది!
లోకాన్ని దాని విషకోరలతో
అడుగడుగు వేసుకుంటు
సృష్టికి మూలం తానై
అవనికి ఆదర్శమై
జననిగా జగతిలో
తన ఒడే తొలి బడిగా
తన మాటే తొలి బాటగా
ధైర్యసాహసాలకు నిలయంగా
స్రీ శక్తి స్వరూపిణి
స్త్రీ ఒక శక్తి స్వరూపం
తల్లిగా ప్రాణం పోస్తుంది
చెల్లిగా చేరదీస్తుంది
అక్కగా ఆదరిస్తుంది
సృష్టికి ప్రతి సృష్టినిచ్చి…
సమాజానికి మార్గ నిర్దేశనం చేసే…
ఓ మహిళా నీకు వందనం…
సంసార సాగరంలో నీకు నీవే సాటిగా…
‘అరవింద స్కూల్’ విద్యార్థులు రాసిన కవితలు
ప్రపంచానికి జన్మనిచ్చిన ఆదర్శమూర్తి,
అన్నింట్లో ముందుండే స్త్రీ మూర్తి,
మార్చి 8, 2020 గురించి రాయాలంటే ఎప్పుడూ లేని ఒక ఉద్వేగం మనసును కమ్మేస్తోంది. 1975లో ఇండియాలో
ఉమెన్స్ డే మొదలైనప్పటి నుండి నా జీవితానికి ఈ రోజుకు పెనవేసిన బంధం ఎప్పుడూ కళ్ళముందుకొస్తుంది. 45 సంవత్సరాల క్రితం మహిళా సాధికారత, అభ్యున్నతుల కోసం డిక్లేర్ చేసిన అంతర్జాతీయ మహిళా దినాన్ని నమ్ముకునే నేను మా సీతారామపురం నుండి బయలుదేరి హైదరాబాద్ మహానగరానికి వచ్చాను. నలభై సంవత్సరాలలో ఎన్నో అనుభవాలు. ఎన్నో జయాలు, అపజయాలు. మహిళల అంశాల మీద పని చేయాలనే ఆశయానికి నిబద్ధమై ఉన్నాను. 66 సంవత్సరాలు వయసు దాటుతున్నా, ఇంకా పనిచేయాలనే ఉత్సాహానికి అడ్డుకట్ట పడలేదు. శరీరానికి, మనసుకు లంకె కుదరకపోయినా పనిచేస్తూనే ఉన్నాను, చేస్తాను కూడా.
ఎటుచూసినా ఉత్తేజం తొణికి సలాడు తోంది. నగరంలో ఎంతోమంది మహిళలు… ముఖ్యంగా యువతులు మొదటిసారి ఈ ఉత్తేజాన్ని అనుభవి స్తున్నారు. ఈ ఉత్తేజం కరెంట్లా దేశంలోని ఎన్నో నగరాలకి, మహా నగరాలకి పాకేస్తోంది. మెల్లగా చిన్న పట్టణాలు… అక్కడ్నుండి గ్రామాలకూ చేరుకుంటోంది.
If I had a hammer I’d smash patriarchy
నేను పురుష ద్వేషిని ఏమీ కాదు కానీ…
”నెలసరిలో ఉన్న స్త్రీ వంట చేస్తే మరు జన్మలో ఆడకుక్కగా పుడుతుంది” అన్న గుజరాత్లోని భుజ్ పట్టణంలోని స్వామి నారా యణ్ గుడిలోని స్వామి కృష్ణస్వరూప్ దాసాజీ ఉవాచ చదివాక చాలా కోపంగా ఉంది.
స్కూలుకు టైం అవుతోంది అనుకుంటూ స్కూటీ తీసి గేటు వేసి బయల్దేరాను. మా ఇంటి నుంచి స్కూలు పది కి.మీ.లు ఉంటుంది. వెళ్తుంటే ఎడమవైపు ఎండిపోయిన చెరువు, కుడి చేతివైపు కొన్ని కాలనీలు ఉంటాయి. మధ్య మధ్యలో పొలాలు, అక్కడక్కడా బర్రెలు కట్టేసిన డెయిరీ ఫాంలు ఉంటాయి. చెరువుకు, పొలానికి మధ్య మెలికలు తిరిగిన రోడ్డు ఉంటుంది. ప్రైవేటు స్కూలు వ్యాన్లు, బైకుల మీద పిల్లల్ని వదిలిపెట్టే పేరెంట్స్, జి.హెచ్.ఎం.సి. చెత్త, పేడతో కూడిన వ్యాన్లు ఓవైపు కాలినడకన, సైకిళ్ళమీద వెళ్ళే స్కూలు పిల్లలు, ఇలా రోజూ ఈ టైంలో రోడ్డు బిజీగా ఉంటుంది.
”ప్రతిసారీ ఏదో ఒక వంక చెప్పి సంబంధాలు చెడగొడ్తున్నావు. ఇలా అయితే ఎలా కమలినీ? నీకిక పెళ్ళయ్యేదెప్పుడూ? ఇప్పటికే ముప్ఫయిమూడేళ్ళొచ్చినయ్. ఇక జీవితాంతం ఇలాగే
ఉంగుటూరి శ్రీలక్ష్మి వాసా ప్రభావతి గారితో నా పరిచయం పది సంవత్సరాల క్రితం జరిగింది. ‘సఖ్య సాహితి’ ఆగిపోయింది. రచయితలందరినీ ఒకే చోటు చేర్చాలనే తపనతో, యద్ధనపూడి సులోచనారాణి గారు, వాసా ప్రభావతి గారు వారి ఆలోచనలకు చక్కటి రూపకల్పన చేశారు.
(గత సంచిక తరువాయి…)
చదువు సంధ్యలు, పెళ్ళి
చదువుగాని, ఆటగాని, పాట గాని దుర్గాబాయికి ఎవరూ ఏమీ నేర్పనక్కరలేదు. నేర్చుకుంటానంటే చాలు. కానీ ఆ ఎనిమిదేళ్ళ ఆరిందా, తొమ్మిదేళ్ళ ఆలోచనపరురాలు, అనుభవశాలి, ఇతరులకు నేర్పుతుంది. ఆ ప్రతిభ ఆమెకు పుట్టుకతోనే సహజంగా వచ్చినట్లనిపిస్తుంది.
ప్రపంచాన్నే జయించాలనుకున్న జాత్యాహంకారి ఫాసిస్ట్ నాజీ హిట్లర్ దురాక్రమణకు అడ్డుకట్ట వేయడానికి సోవియట్ రష్యా సైనికులూ, పౌరులూ కలిపి రెండు కోట్ల డెబ్భై లక్షల మంది ప్రాణాలొడ్డారు. ‘ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదు’ అనుకునే ఒక నియంత కోసం దేశ, పరదేశ ప్రజలు చెల్లించే భారీ మూల్యాలు ఈ స్థాయిలో ఉంటాయి. ఈ అశేష త్యాగాల ఫలితంగా ప్రపంచ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చెదిరిన జీవితాల్లో మిగిలిన చిగురుల్ని ప్రోదిచేసుకుని ముందుకు సాగారు. సుదూరాల్లోంచి, భవిష్యత్తులోంచి చూస్తే యుద్ధం కొన్ని గణాంకాల సమాహారమే. కానీ, సమీపంలోంచి చూస్తే సమసిన ప్రతి జీవితం ఒక విషాద గాధను వినిపిస్తుంది. అటువంటి రణరక్తసిక్తమైన సోవియట్ ప్రేమ జంట కథే ‘ది క్రేన్స్ ఆర్ ఫ్లయింగ్’.
నేరము – శిక్ష
చట్టము – న్యాయము
రక్షణ వ్యవస్థ – రాజకీయాలు
అవిద్య – ధనాశ
ఇలా ఎన్నో అంశాలతో ముడిపడిపోయి ఉంటుంది ఏ సమాజమైనా. నీటిలో కొన్ని అలవోకగా కలిసి, భరించరాని అన్యాయాన్ని సృష్టించినప్పుడు మొత్తం దేశం ఒకే విధంగా స్పందించి, దాన్ని ఎదిరించడానికి నడుం కట్టడం అరుదుగా జరుగుతూ ఉంటుంది.
నిర్భయకు ముందు కానీ, ఆ తర్వాత కానీ భారతదేశంలో ఇటువంటి దారుణాలు జరగలేదని కాదు. కానీ, ఈ రెండు సంఘటనలకు ఒక ప్రాధాన్యత ఉంది. హక్కులే కాదు, బాధ్యతలు కూడా చెప్పకుండా పెంచిన, సహకారం బదులుగా పోటీ, తృప్తికి బదులుగా విజయం, త్యాగానికి బదులుగా స్వార్థం విలువలుగా నేర్చుకుంటున్న మిలీనియం తరాన్ని, సంపద ఎలా వచ్చినా ఫర్వాలేదు దాన్ని పోగేయడాన్ని మాత్రమే విజయంగా భావిస్తూ, నేను బాగుంటే చాలు ప్రపంచం ఏమైనా ఫర్వాలేదని భావిస్తూ భద్రలోకాల్లో విహరిస్తున్న మధ్యతరగతిని ఛెళ్ళున కొట్టి లేపిన సంఘటనలు ఇవి. రెండు సంఘటనల్లోనూ అత్యాచారానికి గురయినవాళ్ళు మధ్యతరగతికి చెందినవాళ్ళు కావడంతో అత్యంత దారుణంగా జరిగిన ఈ సంఘటనలతో ఈ రెండు వర్గాలు సహానుభూతి చెందాయి. అప్పటిదాకా దళితుల మీద, మైనారిటీల మీద జరిగిన అత్యాచారాలకు, పోలీస్స్టేషన్లలో, మిలిటరీ ఉన్న ప్రాంతాలలో ఇంతే దారుణంగానో, ఇంతకన్నా దారుణంగానో జరిగిన సంఘటనల మీద ఎప్పుడూ గొంతెత్తని వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్డున పడ్డారు.
ఎన్ని ఉద్యమాలు, తిరుగుబాట్లు, ఎన్ని యుద్ధాలు చూసింది ఈ నేల. శతాబ్దంపైన దశాబ్దం కాలం క్రితం నాడు అంకురించిన మహిళోద్యమం ప్రపంచాన్ని మేల్కొలుపుతూ మిలీనియం మార్చ్ను పూర్తి చేసుకుంది. అన్ని అసమానత్వాలు అంతమై సామ్యవాద వ్యవస్థలు ఏర్పడాలని ప్రపంచ శాంతికై పబ్బతి బట్టిన వందేళ్ళ పోరాటం మహిళా శక్తిది. సాధించిన హక్కులు, విజయాలు సగమే, సాధించాల్సిన అంశాలు ఎన్నో. సమాన ప్రపంచం, సమర్థ ప్రపంచం అన్న భావనతో 8 మార్చ్ ఉద్యమ స్ఫూర్తితో సాధించిన గెలుపును పండుగగా చేసుకుంటూనే ఉన్నాం. ‘ప్రతి ఒక్కరూ సమానత్వం కోసం’ అని నినదిస్తూనే ఉన్నాం.