తల్లిపొత్తిళ్ళకు బిడ్డల్ని దూరం చేయడం నేరమే -కొండవీటి సత్యవతి

ఇటీవల యూనిసెఫ్‌ హైదరాబాద్‌లో ఒక మీటింగ్‌ నిర్వహించింది. ‘‘ఆరోగ్యం`పోషకాహారం`తల్లిపాలు’’ అంశాల మీద ఈ సమావేశం జరిగింది. తల్లిపాలు అంశాల మీద ఎక్కువ ఫోకస్‌తో వక్తలందరూ మాట్లాడారు.

పుట్టిన బిడ్డకు వెంటనే పాలివ్వలేకపోవడం మీద వక్తలు, వైద్యులు చాలా ఆసక్తికరంగా మాట్లాడారు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి వెనువెంటనే తన స్తన్యాన్ని బిడ్డ నోటికి అందించలేకపోవడం వెనకున్న అనేక అంశాలను మాట్లాడారు. పుట్టిన గంటలో బిడ్డకు పోషకాలు పుష్కలంగా ఉండే తల్లిపాలు అందకపోతే ఎదురయ్యే తీవ్ర ఆరోగ్య అనర్ధాల గురంచి చాలా వేదనగా మాట్లాడారు. ఇలా అందకపోవడానికి మొట్టమొదటి కారణంగా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన సిజేరియన్‌ ఆపరేషన్లు. అవసరమున్నా, లేకపోయినా డాక్టర్లు చేస్తున్న సిజేరియన్‌ ఆపరేషన్ల వల్ల పుట్టిన వెంటనే బిడ్డ, తల్లికి దూరమవడం, తల్లీ, బిడ్డల మధ్య శారీరక సామీప్యత లేకపోవడం, బిడ్డ నోటికి అందాల్సిన తల్లి పాలకి బిడ్డ దూరమవ్వడం మొదటి కారణంగా చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. తల్లిపాలు అందకపోవడం ద్వారా ఆ బిడ్డలు భవిష్యత్తులో ఎదుర్కోబోయే విపత్కర పరిస్థితులకు, ఆరోగ్య వైపరీత్యాలకు డాక్టర్లే కారణమవ్వడం చాలా చింతించాల్సిన విషయంగా అన్పించింది. ‘వైద్యో నారాయణో’ అంటూ వైద్యుణ్ణి ‘‘దేవుడి’’గా కొలిచే చోట డబ్బు కోసం సిజేరియన్‌లు చేయడం చాలా అన్యాయం. ఆడపిండాల హత్యల వెనుక కూడా వీళ్ళే ఉన్నారనేది కాదనలేని సత్యం. గర్భిణీలందరికీ అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌లు చేసి, ఒకవేళ గర్భస్థ శిశువు ఆడపిల్లైతే అబార్షన్‌ చేసి ఆడపిండాలని హత్యలు చేసేది వీళ్ళే. గర్భస్త శిశువుకు ఏదైనా శారీరక వైకల్యం ఉందేమో, గుండె, కిడ్నీ తదితర శరీర భాగాలు సవ్యంగా పని చేస్తున్నాయో లేదో పరీక్షించడానికి చేసే అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ను దుర్వినియోగం చేసేది డాక్టర్లే.
అందరినీ ఒకే గాటను కట్టలేం. నిజమే. రోగాలతో కునారిల్లే వాళ్ళకు ప్రాణం పోసేది వైద్యులే. ఎంతో ఉన్నతమైన వైద్య వృత్తికి కళంకం తెచ్చి, డబ్బు కోసం సిజేరియన్‌లు, హిస్టరెక్టమీలు, గర్భస్థ ఆడపిండాల హత్యలు చేసే వర్గం కూడా ఈ వృత్తిలో ఉండడమే అత్యంత విషాదం. సిజేరియన్‌ ఆపరేషన్‌ల వల్ల పోషకాలు మిళితమైన తల్లిపాలను కోల్పోతున్న వందలాది, వేలాది బిడ్డలకు భవిష్యత్తులో ఎదురవ్వబోయే ఆరోగ్య ఉపద్రవాలను వేదికమీద డాక్టర్లు వివరిస్తుంటే నా వెన్నులో వణుకు పుట్టింది. ‘‘స్కిన్‌ టు స్కిన్‌’’ తల్లి వెచ్చని స్పర్శను కోల్పోయిన బిడ్డల్లో ఏర్పడే శారీరక, మానసిక అవలక్షణాలను వివరిస్తుంటే డాక్టర్లు ఎందుకింత అమానుషంగా
ఉన్నారు అనిపించింది. బిడ్డ పుట్టిన క్షణమే అందాల్సిన పాలు అందకపోతే బిడ్డలు శారీరకంగా అనేక రుగ్మతలకు గురవుతారని, తల్లి శరీర స్పర్శకు దూరమైతే బిడ్డకు అనేక మానసిక సమస్యలు కలుగుతాయని చెబుతున్నప్పుడు, తల్లిపాలను కోల్పోయే బిడ్డల్లో ఏర్పడే శారీరక వైకల్యాలను వేదిక మీద వివరిస్తున్నప్పుడు ‘‘అమ్మూ! నీకు గుండెలో అందుకే అంత కన్నం ఏర్పడిరదేమో! నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మమ్మ చనిపోయారని, అమ్మ నిన్ను మీ పెద్దక్క దగ్గర వదిలేసి వెళ్ళిపోయారని, నువ్వు ఒక్కర్తివి చాపమీద పడుకుని ఉండేదానివని చాలాసార్లు చెప్పావు. అమ్మ వెచ్చని స్పర్శగానీ, పాలు గానీ దొరకక పోవడం వల్లనే నీ గుండెకి కన్నం పడిరదేమో’’ అంది. నిజమేనేమో! ఏమో!! మా అమ్మకి నన్ను వదిలి వెళ్ళడం అనివార్యం. కానీ అనవసరపు సిజేరియన్‌లు చేసి తల్లీ, బిడ్డల్ని వేరు చేయడం క్షమించరాని నేరం కదా!
ఈ సిజేరియన్‌ల దందా మొదలవ్వక ముందు ప్రతి గ్రామంలో దాయీలుండేవారు. చాలా అనుభవం కలిగిన ఈ దాయీలు గ్రామంలో గర్భిణీ స్త్రీల మంచిచెడ్డలను చూసేవారు. పురుడు పోసేవారు. బొడ్డు పేగు కత్తిరించిన వెంటనే బిడ్డను తల్లి ఒడిలో ఉంచి పాలిచ్చేలా ప్రోత్సహించేవారు. బాలింత అనారోగ్యంతో ఉంటే తప్ప పుట్టిన బిడ్డను తల్లినుంచి వేరు చేసేవారు కాదు. బిడ్డ తల్లి నుంచి పుష్కలంగా పాలు తాగుతుండేది. తల్లి పాలలో ఉండే పోషకాలన్నీ బిడ్డకు అందేవి. బిడ్డ రోగనిరోధక శక్తి అపారంగా పెరిగేది. తల్లి వెచ్చని పొత్తిళ్ళలో ఉండగలిగే బిడ్డ శారీరక, మానసిక వైకల్యాలకు గురయ్యే పరిస్థితి తక్కువగా ఉండేది. హాస్పిటల్‌లో మాత్రమే ప్రసవాలు జరగాలనే నియమం ఎప్పుడు మొదలైందో అప్పుడే దాయీల కథ కూడా ముగిసింది. ఏఎన్‌ఎంల నియామకాలు జరిగాయి. పరిశుభ్రమైన వాతావరణంలో ప్రసవాలు సురక్షితంగా జరగాలి, ప్రసవ సమయంలో తల్లుల మరణాలు జరగకూడదని, పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉన్నత ఆశయంతోనే ‘‘ఆసుపత్రుల్లోనే పురుళ్ళు’’ పథకం మొదలైనా సిజేరియన్‌ల రాకెట్‌ బడ్డల పాలిట తీవ్రమైన అన్యాయంగా పరిణమించింది. ఈ విషయం గణాంకాలతో సహా యూనిసెఫ్‌ సమావేశంలో డాక్టర్లు వివరించినప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కనుమరుగు చేసిన మిడ్‌వైఫ్‌ పద్ధతి (దాయీ వ్యవస్థ)ని పునరుద్ధరించి కొంతమంది దాయీలను నియమించి వారికి శాస్త్రీయంగా శిక్షణనిచ్చి ప్రసూతి ఆస్పత్రుల్లో నియమించడం చాలా సంతోషించాల్సిన సందర్భం. తెలంగాణ ప్రభుత్వం ముందే మేలుకొని దాయీల వ్యవస్థని పునరుద్ధరించడం మనస్ఫూర్తిగా ఆహ్వానించాల్సిన విషయం. నిజానికి దేశం మొత్తానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. మిగిలిన రాష్ట్రాలలో కూడా ఈ పథకం మొదలవ్వాలని ఆశిద్దాం. వారు గర్భిణీలతో చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేయిస్తూ ప్రసవాలు సహజంగా జరిగేలా, ప్రసవమైన వెంటనే బిడ్డను తల్లి పొత్తిళ్ళలో ఉంచి పాలిచ్చేలా ప్రోత్సహించడం గు రించిన దృశ్యాలను చూసినపుడు చాలా ఆనందమనిపించింది. మరింత ఎక్కువ సంఖ్యలో దాయిలను నియమించి, శిక్షణ నిచ్చి అన్ని ప్రసూతి ఆసుపత్రుల్లోను నియమించినపుడు మాత్రమే ప్రస్తుతం జరుగుతున్న పోరపాట్లను సరిదిద్దుకోగలుగుతాం. తల్లి పొత్తిళ్ళల్లో బిడ్డలు భద్రంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. ఆరోగ్య తెలంగాణా అప్పుడు ఆవిష్కృతమౌతుంది.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.