డెబ్భై ఐదేళ్ళుగా నెత్తురోడుతున్న పాలస్తీనా గాయం – నరేన్‌

‘‘నా పేరు రోసలిండ్‌ పెచాస్కీ. నేనిక్కడ న్యూయార్క్‌లో వేలాది మందితో జమగూడాను. మాలో చాలామంది యూదులు కూడా ఉన్నారు. గాజాలో జరుగుతున్న మారణకాండను వ్యతిరేకించడానికి ఇక్కడ మేము గుమిగూడాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆగాల్సిందే. గాజా నుండి వస్తున్న దారుణమైన వార్తలు వింటూ మేము రోజూ దుఃఖిస్తున్నాము.

మా సన్నిహిత మిత్రుడు మహమ్మద్‌ కుటుంబం గాజాలో ఉంది. వాళ్ళంతా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న బాంబుల వర్షంలో, అనుక్షణం మృత్యు భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది ఇలా కొనసాగడానికి వీల్లేదు. మేము కొనసాగనివ్వం. మేము న్యాయాన్ని నమ్ముతాం. ప్రజలందరికీ బ్రతికే హక్కు ఉందని నమ్ముతాం. పాలస్తీనా ప్రజలు గత 75 ఏళ్ళుగా తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. ఇది తప్పనిసరిగా ఆగాల్సిందే. అందుకే మేము ఇక్కడ గుమిగూడి, వారికి మా సంఫీుభావం, మద్దతు తెలియజేస్తున్నాము. ‘మా పేరు మీద ఈ మారణకాండ కొనసాగడానికి వీల్లేదు’ అని ముక్తకంఠంతో ఎలుగెత్తడానికి మేము ఇక్కడ జమగూడాము. ఈ మారణకాండ వెంటనే ఆగాలి.
వయసులో నేను ఇజ్రాయిల్‌ దేశం కన్నా పెద్దదాన్ని’’
`రోసలిండ్‌ పెచాస్కీ ` రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్‌, హంటర్‌ కాలేజ్‌ న్యూయార్క్‌
అక్టోబర్‌ 7న పాలస్తీనా మిలిటెంట్ల సంస్థ హమాస్‌ ఇజ్రాయిల్‌లోకి చొచ్చుకుపోయి ‘మెరుపుదాడి’ చేసిన తర్వాత వెంటనే ప్రతీకారంగా ఇజ్రాయిల్‌ గాజాపై యుద్ధం ప్రకటించింది. హమాస్‌ దాడిలో దాదాపు 1,200 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడిలో దాదాపు 8,300 మంది పాలస్తీనా ప్రజలు, అందులో 3,500 మంది పిల్లలు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్‌ యుద్ధం ప్రకటించాక, ముందు గాజాను అన్నివైపుల నుండి దిగ్బంధనం చేసి అక్కడి పజలకు ఏ రకమైన సహాయం రాకుండా చేసింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనల వల్ల కొంత సహాయాన్ని అనుమతించింది. రెండు రోజులకు ముందు విద్యుచ్ఛక్తి, ఇంటర్నెట్‌, సెల్‌ ఫోన్‌ సర్వీసులు కూడా పూర్తిగా బంద్‌ చేయించి గాజాను గాడాంధకారంలో ముంచేసింది. అల్‌`ఖుద్స్‌ ఆసుపత్రిపై కూడా దాడి చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇది రాస్తున్న సమయానికి ఇజ్రాయిల్‌ సైన్యాలు, ట్యాంకర్లు గాజాలోనికి చొచ్చుకుపోతున్నాయి. 23 లక్షల మంది పాలస్తీనా ప్రజలు గాజాలో మృత్యువు కోరల్లో నెత్తురోడుతూ ప్రాణాల కోసం, తమ జీవితాల కోసం, తమ నేల కోసం, తమదైన దేశం కోసం అనుక్షణం పోరాడుతున్నారు. మొత్తంగా గాజానే ప్రపంచ పటం నుంచి తుడిచివేసి, పాలస్తీనా ప్రజలకు అసలు భూగోళం మీద ఉనికి లేకుండా చేయాలన్నదే లక్ష్యంగా ఇజ్రాయిల్‌ యుద్ధం కొనసాగిస్తున్నది. అంతర్జాతీయ సమితి చేసిన ప్రతి విజ్ఞప్తిని, ప్రతి తీర్మానాన్నీ పూర్తిగా పెడచెవిన పెట్టింది. దానికి తోడు అమెరికా కోటానుకోట్ల ధన సహాయాన్ని, ఆయుధ సహాయాన్ని అందిస్తూ ఇజ్రాయిల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని వత్తాసు పలుకుతోంది. అంతర్జాతీయ సమితి చేసిన యుద్ధ విరమణ శాంతి తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 14 దేశాల్లో అమెరికా ముందుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయిల్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించాడు. తానూ ఒక జియోనిస్టునని ప్రకటించుకున్నాడు. అమెరికా ప్రజల కష్టార్జితమైన సొమ్ముని పాలస్తీనాలో ఇజ్రాయిల్‌ సృష్టిస్తున్న మారణహోమానికి వత్తాసుగా తరలిస్తున్నాడు. పరిస్థితి క్షణక్షణానికీ దిగజారుతూ దారుణంగా మారిపోతున్నది. చరిత్రలో మున్నెన్నడూ లేనట్టుగా మానవ హననం జరుగుతున్నది.
ఐతే, ఈ సంఘటనల పట్ల స్పందిస్తున్న చాలామంది, ‘‘హమాస్‌ చేసింది తీవ్రవాద చర్య, టెర్రరిస్టు చర్య. హమాస్‌ ఒక కరడు కట్టిన ముస్లిం తీవ్రవాద సంస్థ. అది అల్‌`ఖైదా, ఐసిస్‌లతో సమానమైన, దుర్మార్గమైన సంస్థ. దాని చర్యలను నిర్ద్వంద్వంగా ఖండిచాలి, వ్యతిరేకించాలి. అది చేసిన దాడి నుంచి తనను తాను రక్షించుకునే హక్కు, ప్రతీకారం తీర్చుకునే హక్కు ఇజ్రాయిల్‌కు ఉంటుంది. కాబట్టి ఇజ్రాయిల్‌ను సమర్ధించాలి’’ అంటూ వాదిస్తున్నారు. అంతర్జాతీయ సమితి చేసిన తీర్మానానికి ఓటు వేయ నిరాకరించిన భారతదేశం కూడా తీర్మానంలో హమాస్‌ టెర్రర్‌ ప్రస్తావన లేదు కాబట్టి ఓటు వేయడం లేదని ప్రకటించింది. సామాన్య ప్రజానీకానికి ఇది సబబే కదా అనిపిస్తుంది. ఇజ్రాయిల్‌ చేస్తున్నది సమంజసమే కదా అనిపిస్తుంది. తన ప్రజలపై తన నేలమీదే దాడి జరిగితే ఏ దేశమైనా ఎలా ఊరుకుంటుంది? ఎందుకు ఊరుకోవాలి? అంటూ ఇజ్రాయిల్‌కు తమ సమర్థింపు పూర్తి న్యాయబద్ధమైందే అని చాలామంది వాదిస్తున్నారు.
ఇది నిజమేనా? ఇజ్రాయిల్‌ చర్యలు, చేస్తున్న యుద్ధం సమంజసమూ, న్యాయసమ్మతమేనా? దీని గురించి ఒక నిర్ధారణకు రావాలంటే ఏది సమంజసమో గుర్తించగలిగే న్యాయాన్యాయాల విచక్షణ చేయడానికి వాస్తవాలను, చరిత్రను కొంచమైనా తెలుసుకోవాలి. ఏదీ శూన్యంలోంచి ఊడిపడదు కాబట్టి, ఏదీ హఠాత్తుగా జరగదు కాబట్టి ప్రతిదానికీ ఒక సందర్భమూ, చరిత్ర ఉంటాయి కాబట్టి దాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. జరిగే ఏ సంఘటననైనా అది ఒక చారిత్రక సందర్భంలో జరుగుతుందని, జరుగుతున్నదని అర్థం చేసుకోవాలి. గతంలో జరిగిన అనేకానేక కుట్రలు, కుతంత్రాలు, ప్రచారమైన అనేకానేక అబద్ధాలు, అలుముకున్న భ్రమలను, మిథ్యలను ఛేదించకుండా, చరిత్రను సక్రమంగా అర్థం చేసుకోలేము. చరిత్రను అర్థం చేసుకోకపోతే ప్రస్తుత సందర్భాన్నీ అర్థం చేసుకోలేము. గత 75 ఏళ్ళుగా ఒక దేశం ప్రజలను, వాళ్ళ స్వంత దేశం నుండే వెళ్ళగొట్టి, కాందిశీకులను చేసి, చెట్టుకొకరిని పుట్టకొకరిని చేసి, వాళ్ళ దేశమే వాళ్ళకు కాకుండా చేసి, ఆక్రమించుకున్న ఇజ్రాయిల్‌ కుట్రపూరిత చరిత్రను అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం. అందుకు ప్రచారమైన అబద్ధాలు, సృష్టించిన మిథ్యలు అన్నింటినీ ఛేదించాల్సిన అవసరముంది. లేకపోతే హమాస్‌ ఉత్తి ముస్లిం తీవ్రవాదులుగా, వారు చేసింది ఒక దుర్మార్గమైన ఉగ్రవాద చర్యగా మాత్రమే కనబడుతుంది. ప్రతిగా ఇజ్రాయిల్‌ చేస్తున్నది న్యాయ సమ్మతమైన ఆత్మరక్షణగా, సమర్థనీయంగా కనిపిస్తుంది.
ఇక్కడ ఒక విషయం ప్రధానంగా ప్రస్తావించాలి. దాదాపు రెండువేల ఏళ్ళుగా యూదుల పట్ల ఒక ద్వేషం ఉనికిలో ఉన్నది. యూదులని తక్కువ చేసి చూస్తూ, వారిని అవమానపరుస్తూ, వారిని హీనంగా భావిస్తూ, అనేకానేక కారణాల వల్ల చరిత్రలో యూదుల పట్ల ద్వేషమూ, వ్యతిరేకత అమలులో ఉన్నది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, యుద్ధ కాలంలో జర్మనీలో హిట్లర్‌ నియంతృత్వంలో యూదుల పట్ల వ్యతిరేకత పరాకాష్టకు చేరుకుని లక్షలాది యూదులను హత్యాకాండకు గురిచేసిన హోలోకాస్ట్‌గా పరిణమించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌, నాజీ జర్మనీ మిత్రపక్షాలు ఓడిపోయాక, యూదుల పట్ల వ్యతిరేకతకు తెరపడిరది.
ప్రపంచవ్యాప్తంగా యూదులు అన్ని దేశాల్లో బలపడ్డారు. అమెరికా సహాయంతో ఇజ్రాయిల్‌ బలమైన దేశంగా ఏర్పడిరది. అమెరికా లాంటి అగ్రదేశాల ఆర్థిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను ఆధీనంలో ఉంచుకొని యూదులు పాలకవర్గంగా ఎదిగారు. గణనీయమైన ఆధిపత్య శక్తిగా ఎదిగారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యూదుల పట్ల వ్యతిరేకత (aఅ్‌ఱ-ంవఎఱ్‌ఱంఎ) ఒక నేరంగా పరిగణింపబడుతున్నది. అయితే, ఇప్పుడు ఇజ్రాయిల్‌ చేస్తున్న ‘ఆత్మరక్షణ’ యుద్ధాన్ని సమర్ధించకపోతే, దాన్ని వ్యతిరేకిస్తే అదియూదుల పట్ల వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఇజ్రాయిల్‌ సృష్టిస్తున్న మారణ హోమాన్ని వ్యతిరేకించడం యూదుల పట్ల వ్యతిరేకత కానే కాదు, కాకూడదు కూడా. అట్లా పరిగణిస్తే అది చరిత్రను వక్రీకరించడమే. నిజానికి హిట్లర్‌ జరిపిన మారణకాండ (ష్ట్రశీశ్రీశీషaబర్‌) పేరు చెప్పుకుని కొంతమంది యూదులు, దాన్ని ఒక ‘పరిశ్రమ’గా మార్చి లాభాలు దండుకుంటూ, ఆధిపత్య విధానాలను అమలుపరుస్తున్నారు అని ఒక చర్చ కూడా ఉంది.
ఇంతకీ చరిత్రలో ఏమి జరిగింది? ప్రచారంలో ఉన్న మిథ్యలూ, అబద్ధాలూ ఏమిటి?
ఇవాళ ఇజ్రాయిల్‌, పాలస్తీనాగా పిలవబడుతున్న ప్రాంతం యూదులు రాకముందు ఖాళీగా ఉన్న ప్రాంతమనీ, అక్కడ ఎడారి తప్ప ఏమీ లేదనీ ఒక పచ్చి అబద్ధం ప్రచారంలో ఉంది. నిజానికి పాలస్తీనా రోమన్ల కాలం నుండి ఒక దేశంగా ఉంది. రోమన్లే పాలస్తీన్‌ను పాలస్తీనాగా పేరుపెట్టారు. రోమన్ల కాలంలో, తర్వాత బైజానిస్ట్‌ సామ్రాజ్యంలో ఒక భాగంగా సార్వభౌమ ప్రాంతంగా ఉంది. తర్వాత 16వ శతాబ్దం ప్రారంభం నుండి, 400 ఏళ్ళదాకా ఒట్టోమన్‌ సామ్రాజ్యంలో భాగమైంది. అప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు పాలస్తీనాను క్రైస్తవుల పుణ్యక్షేత్రంగానే భావించారు. ఐతే యూదుల మతం, జుడాయిజంలో పుణ్యక్షేత్రాలకు అంత ప్రాధాన్యత లేకపోయినా కొంతమంది యూదులు జెరూసలేంకు తీర్థయాత్రలకు వెళ్ళేవారు. 1800 కల్లా పాలస్తీనా ఒక ఎడారిలా మారిపోయిందని ఇజ్రాయిల్‌ ఒక కట్టుకథను ప్రచారం చేసింది. కానీ, నిజానికి ఒట్టోమన్‌ సామ్రాజ్యంలో భాగంగా పాలస్తీనా ఒక స్వయంసమృద్ధి గల ప్రాంతంగా, వ్యవసాయిక ప్రాంతంగా అభివృద్ధి చెంది, ఆధునీకరణకు ద్వారాలు తెరిచింది. హైఫా, షెఫామ్ర్‌, టిబెరియాస్‌, ఏకర్‌ లాంటి పట్టణాలు అభివృద్ధి చెంది, రేవుపట్టణాలు ఏర్పడి ఇతర ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు ఏర్పర్చుకుని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా, ఐదు లక్షల జనాభాతో అలరారింది. అప్పటికి పాలస్తీనాలో అరబ్బులు, క్రైస్తవులు, యూదులు ఉండేవారు. ఎక్కువ జనాభా (రైతాంగం) వెయ్యికి పైగా గ్రామాల్లో నివసిస్తే నగరాల్లో, పట్టణాల్లో మధ్య తరగతి, ధనిక వర్గానికి చెందినవారు ఉండేవారు. పాలస్తీనాలో ప్రధానంగా లౌకిక సామాజిక వ్యవస్థ అమల్లో ఉంది. ముస్లింలు, యూదులు ఒక సమిష్టి సమాజంగా కలిసిమెలిసి ఉండేవారు. అటువంటి సమాజంలో జియోనిజం విషబీజాలు నాటింది. జియోనిస్ట్‌ వలసవాదం మొత్తం పాలస్తీనాను యూదుల పరం చేయాలనే కుట్రతో, 19వ శతాబ్దం చివరన, 20వ శతాబ్దం ప్రారంభంలో యూదుల వలసలను ప్రోత్సహించి ముమ్మరం చేసింది. ఫలితంగా పాలస్తీనా ప్రజలని జియోనిస్టు వలసదారులు వారి స్వంత దేశం నుండే తరిమి కొట్టి తమ స్థావరంగా మార్చుకున్నారు.
జియోనిజం అంటే ఏమిటి? యూదులకు ఒక స్థలమంటూ లేదని, వాళ్ళు తమకంటూ నేల లేని ప్రజలనే ప్రచారం, పాలస్తీనా ఖాళీ ఎడారి ప్రదేశమనే అబద్ధపు ప్రచారంతో జమిలిగా సాగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులకు తమ పవిత్ర స్థలమైన జెరూసలేం ప్రాంతంలో ఒక దేశం కావాలని, అది వాళ్ళకే పరిమితమైన దేశం కావాలని కోరుకునే జాతీయవాదమే జియోనిజం. వలసవాదమైన జియోనిజం ఒకరకంగా జుడాయిజానికి తీవ్రరూపం. యూదులందరూ తమ పవిత్రస్థలం జెరూసలేంకు చేరుకోవాలి అనే మత సంబంధమైన సెంటిమెంట్‌గా ఉపరితలంలో కనబడినా, అక్కడే తమదైన స్వంత దేశం (రాజ్యం) ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ అంతకుముందు నివసిస్తున్న ఆ ప్రాంత ప్రజలను బలవంతంగా వెళ్ళగొట్టయినా సరే ఆక్రమించుకోవాలి అనే జాతీయ వలసవాదానికి ప్రతిరూపమే జియోనిజం. 1897లో ఆస్ట్రియాకు చెందిన జర్నలిస్ట్‌, రాజకీయ కార్యకర్త థియోడోర్‌ హెర్జెల్‌ ‘యూదులు తమకంటూ ఒక దేశం లేకపోతే మనలేరు’ అనే రాజకీయ నినాదంతో ఆధునిక జియోనిజానికి ఒక రాజకీయ సంస్థగా రూపమిచ్చాడు. 1897లో స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో మొదటి సమావేశం ఏర్పాటు చేసిన థియోడోర్‌ హెర్జెల్‌, జియోనిస్ట్‌ సంస్థకు మొదటి అధ్యక్షుడయ్యాడు. యూదుల దేశం అప్పటికే పాలస్తీనాగా పిలవబడుతున్న ప్రాంతంలో ఏర్పాటు చేయాలని తీర్మానిస్తూ మొదటి కరపత్రం విడుదల చేశాడు. హెర్జిల్‌ జియోనిజానికి ఆద్యుడుగా చెప్పబడుతున్నా, నిజానికి దానికి పునాదులు అంతకుముందే బ్రిటిష్‌, ఫ్రెంచ్‌ సామ్రాజ్యవాదులు వేశారు. యూదుల వలసవాదంగా మారడానికి ముందు నిజానికి జియోనిజాన్ని క్రైస్తవ వలసవాద ప్రాజెక్టులో భాగంగా చెప్పొచ్చు. తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా పాలస్తీనా ప్రాంతంపై, మద్యధరా ప్రాంతంపై ఆధిపత్యం కోసం బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం వేసిన పన్నాగంలో భాగంగా యూదులు తమ మాతృభూమి పాలస్తీనాకు తరలిరావాలి అనే కుట్ర అమలైంది. లార్డ్‌ షాఫ్ట్స్‌బరీ అనే బ్రిటిష్‌ రాజకీయ నాయకుడు ‘పాలస్తీనాలో యూదుల మాతృభూమి’ అనే నినాదాన్ని ప్రచారం చేశాడు. ఆ ప్రచారం మతపరమైనదే కాక ఒక వలసవాద వ్యూహం కూడా అనేది ఇప్పుడు స్పష్టమే.
1917లో బ్రిటిష్‌ విదేశాంగ కార్యదర్శి ఆర్థర్‌ జేమ్స్‌ బాల్ఫోర్‌, బారన్‌ రోథ్స్‌ చైల్డ్‌ అనే ధనిక బ్రిటిష్‌ యూదు నాయకునికి ఉత్తరం రాస్తూ పాలస్తీనాలో యూదుల మాతృదేశాన్ని ఏర్పాటు చేయడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం అన్ని రకాల సహాయం చేస్తుందని హామీ ఇచ్చాడు. 1923లో నానా దేశాల కూటమి (లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌), బ్రిటిష్‌ వాళ్ళ ఆధీనంలో ఉన్న పాలస్తీనాలో యూదుల మాతృదేశాన్ని ఏర్పాటుచేసే బాధ్యతను గ్రేట్‌ బ్రిటన్‌కు అప్పజెప్పింది. దీని వెనక లార్డ్‌ షాఫ్ట్స్‌బరీ వేసిన బీజాలున్నాయి. ఆయన యూదుల వలసను బ్రిటిష్‌ ప్రభుత్వ క్రియాశీలకంగా సమర్థించాలి అని కాంక్షించిన విధంగానే, బ్రిటిష్‌ ఆధీనంలోని పాలస్తీనాకు బ్రిటిష్‌ సహాయ సహకారాలతో యూదుల వలసలు తీవ్రమయ్యాయి. ముందు మైనారిటీ యూదుల అభిప్రాయంగా ఉన్న జియోనిజం క్రమేపీ బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం సహాయ సహకారాలతో వలసవాదంగా బలపడిరది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బలహీనపడిన బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం ఆ ప్రాంతం నుండి వైదొలగిన తర్వాత మే 14, 1948 నాడు ఇజ్రాయిల్‌ దేశం ఏర్పడిరది. 1949లో 2,49,000 మంది యూదులు ఇజ్రాయిల్‌కు వలస వచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సామ్రాజ్యవాదం మధ్య ప్రాచ్యంలో (పశ్చిమాసియా)లో తన పట్టు పెంచుకోవడానికి, అక్కడ అరబ్‌ దేశాలపై ఆధిపత్యం కోసం, చమురు నిల్వలపై ఆధిపత్యం కోసం, మతపరంగా కూడా ఇజ్రాయిల్‌కు ప్రత్యక్ష మద్దతునిచ్చి జియోనిస్టు జాతీయ వలసవాదాన్ని పెంచి పోషిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు నేను కూడా జియోనిస్టునే అనడం వెనుక ఆ సామ్రాజ్యవాదమే, ఆ వలసవాదమే స్పష్టంగా బుసలు కొడుతున్నది. జియోనిజం అంటే జుడాయిజం కాదు, జియోనిజాన్ని వ్యతిరేకించడమంటే యూదులపై వ్యతిరేకత (aఅ్‌ఱ-ంవఎఱ్‌ఱంఎ) కాదు అని అర్థం చేసుకోవడానికి, జియోనిజం అంటే జాతీయ వాదం, వలస వాదం అని స్పష్టమవడానికి ఈ చారిత్రక నేపథ్యం ఉపయోగపడుతుంది.
1948లో జియోనిస్ట్‌ వలసవాదులు సాయుధ సైనిక మూకతో లక్షలాది పాలస్తీనా ప్రజలను తమ గ్రామాల నుండి తరిమేశారు. ఇజ్రాయిల్‌ ప్రధానంగా యూదులదే అయి ఉండాలనే వలసవాద సిద్ధాంతంతో పాలస్తీనా ప్రజలని తమ దేశం నుండి తమనే వెళ్ళగొట్టారు. దీనినే నక్బా అంటారు. అరబిక్‌లో నక్బా అంటే మహా విపత్తు అని అర్థం. 1948లో లక్షలాది పాలస్తీనా ప్రజలను, ఇల్లు లేని వాళ్ళను, ఊరు లేని వాళ్ళను, దేశమే లేని వాళ్ళను చేయడం నక్బా మొదటి అంకం. తర్వాత 1956లో లక్షకు పైగా, వెస్ట్‌ బ్యాంకు గాజాల నుండి, 1967లో మూడు లక్షల మందిని, 2000 కల్లా మరో రెండున్నర లక్షల మందిని పాలస్తీనా ప్రజలను వివిధ యుద్ధాల్లో, దాడులు చేసి తరిమేశారు.
ఐతే, ఇజ్రాయిల్‌లో కొద్దిమంది యూదులయినా ప్రజాస్వామికంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకు 1948లో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దుర్మార్గాలు తెలుసు. 1950లో వేలాది పాలస్తీనియులను అరెస్ట్‌ చేసి జైళ్ళలో కుక్కడం తెలుసు. 1956లో కేవలం పాలస్తీనీయులైనందుకు సైన్యంచే హత్య చేయబడిన కాఫర్‌ ఖాసీం మారణకాండ తెలుసు. 1967లో ఇజ్రాయిల్‌ యుద్ధ నేరాలు తెలుసు. 1982లో కాందిశీకుల క్యాంపులపై బాంబుల దాడి తెలుసు. ఆక్రమిత ప్రాంతాల్లో పాలస్తీనా ప్రజలు, యువతీ యువకుల అష్టకష్టాలు తెలుసు. నిరంతరం అమలవుతున్న దమనకాండ తెలుసు. ఇజ్రాయిల్‌లో ఉన్న పాలస్తీనీయుల పట్ల వివక్ష (aజూaత్‌ీష్ట్రవఱస) తెలుసు. ధ్వంసమైన 531 గ్రామాలు తెలుసు. రోజురోజుకూ దుర్భరమవుతున్న వెస్ట్‌ బ్యాంక్‌ గాజా ప్రజల పరిస్థితి తెలుసు. అమాయకులను హత్య చేస్తున్న మిలిటరీ అధికారుల క్రూరత్వం తెలుసు. వాళ్ళు తమ గొంతు వినిపించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినా జియోనిస్టుల బలం చాలా పెద్దది. వాళ్ళ ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఇజ్రాయిల్‌ గత 75 ఏళ్ళుగా పాలస్తీనా ప్రజల మీద దమనకాండ కొనసాగిస్తూనే ఉంది. ఒక వలసవాద రాజ్యంగా, ఒక దురాక్రమణ దారుగా, ఒక వివక్ష రాజ్యంగా (aజూaత్‌ీష్ట్రవఱస) అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను, తీర్మానాలను తుంగలో తొక్కి దారుణమైన మానవ హననానికి పాల్పడుతోంది.
జియోనిస్టు వలసవాద, వివక్ష రాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటాన్ని వలసవాద వ్యతిరేక పోరాటంగానే చూడాలి. ఆ క్రమంలో ఏర్పడిన పాలస్తీనా విమోచన సమితి శాయశక్తులా పోరాటం చేసి మధ్యే మార్గంగా, అగ్రరాజ్యం అమెరికా సమక్షంలో ఇజ్రాయిల్‌తో రెండు రాష్ట్రాల ఏర్పాటుకి ఓస్లో ఒప్పందంపై శాంతాక్లాజు చేసింది. ఐతే, ఇజ్రాయిల్‌ దాన్ని కూడా తుంగలో తొక్కింది. వెస్ట్‌ బ్యాంక్‌ గాజాలో తన సెటిల్‌మెంట్లను రోజురోజుకూ మరిన్ని ఏర్పాటు చేస్తూ, ఎదిరించినా, వ్యతిరేకించినా దమనకాండ చేస్తూ పాలస్తీనా ప్రజలకు రోజూ నరకాన్ని చూపుతోంది. గాజా చుట్టూ పెద్ద గోడ కట్టి, ఆ ప్రాంతాన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన బహిరంగ జైలుగా మార్చింది. రోజూ ఇన్ని దురాగతాలు చేస్తోన్నా, ఇంతమంది పాలస్తీనా ప్రజలను, పిల్లలను, స్త్రీలను చంపుతున్నా ఏనాడూ ఖండిరచని వాళ్ళు, వ్యతిరేకించని వాళ్ళు ఇవాళ హమాస్‌ది దుర్మార్గమైన ఉగ్రవాద దాడి అని ఖండన మండనలు చేస్తున్నారు. ఇజ్రాయిల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉంది అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మొన్నటిదాకా ఇజ్రాయిల్‌ చేసిన దురాగతాలను వ్యతిరేకిస్తూ పల్లెత్తు మాట కూడా అనకపోవడం పచ్చి హిపోక్రసీ. ఆత్మరక్షణ హక్కు ఇజ్రాయిల్‌కే, పాలస్తీనా ప్రజలకు ఉండదు అనడం ఆత్మవంచన.
హమాస్‌ 1967లో మొదటి పాలస్తీనా ఇంతిఫాద (తిరుగుబాటు) తర్వాత ఏర్పడిరది. పాలస్తీనా ప్రజల కోసం అనేకసార్లు అనేక ప్రయత్నాలు జరిగి విఫలమయ్యాక పుట్టిన మిలిటెంట్ల సంస్థ హమాస్‌. అంతర్జాతీయ సంస్థల పర్యవేక్షణలో గాజాలో ప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికల్లో గెలిచింది. ఏళ్ళ తరబడి పోరాటం తర్వాత, పాలస్తీనా ప్రజలు మిగతా నాయకులపై విసుగొచ్చి హమాస్‌ను ఎన్నుకొన్నారు. ఎన్నికల్లో ప్రజాస్వామికంగా గెలిచిన తర్వాత కూడా అమెరికా, ఐరోపా దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. తర్వాత ఇజ్రాయిల్‌ దాడులను ముమ్మరం చేసింది. గాజాలో సెటిల్‌మెంట్‌ నిర్మాణం ముమ్మరం చేసింది. ఎదిరించిన పాలస్తీనా ప్రజలపై తీవ్రమైన దమనకాండకు పాల్పడిరది. అందుకే ఇన్ని రోజులు భరించి భరించి ఒకేసారి ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్లు మెరుపుదాడి చేసింది హమాస్‌. నిజమే అమాయకులు, స్త్రీలు, పిల్లలు చనిపోయారు. అది అవాంఛనీయం, బాధాకరం. కానీ దానికి బాధ్యత పూర్తిగా ఇజ్రాయిల్‌దే, ఇజ్రాయిల్‌ను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్న అమెరికాదే.
గాజా మీద యుద్ధం ప్రకటించి ఇప్పటికే 8300 మంది పాలస్తీనా ప్రజలని పొట్టన బెట్టుకున్న ఇజ్రాయిల్‌ దుర్మార్గాలను, నెతన్యాహు రక్తదాహాన్ని, అమెరికా సామ్రాజ్యవాద దాహాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరముంది. ఇజ్రాయిల్‌ వెంటనే యుద్ధాన్ని విరమించాలి. ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల నుండి వైదొలగాలి. పాలస్తీనా ప్రజలకు దురాక్రమణ నుండి స్వేచ్ఛ లభించి విముక్తి కావాలి.
కేవలం ముస్లిం వ్యతిరేకతతో పాలస్తీనాను, హమాస్‌ను గుడ్డిగా వ్యతిరేకించేవారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అబద్ధాలను, మిథ్యలను దాటి నిజాన్ని గ్రహించి, అణచివేతకు గురవుతున్న పాలస్తీనా ప్రజల పక్షం, న్యాయం పక్షం వహించాలి. నిజానికి అసలైన మత ఉగ్రవాది ఇజ్రాయిల్‌ అని, నెతన్యాహు అని గుర్తించాలి. జియోనిస్టు వలసవాదం అంతమైనప్పుడే ప్రపంచ ప్రజలకు శాంతి అని గుర్తించాలి.
(కొలిమి వెబ్‌ మ్యాగజైన్‌ నుండి ….)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.