ఫ్యూడల్‌ బ్రాహ్మణీయ సంకెళ్ళలో ”స్త్రీలు”- బ్లాక్‌ వాయిస్‌ -దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు

నేను చాలా పుస్తకాలు చదివాను కానీ చాలా రోజుల తర్వాత నన్ను ఆకట్టుకున్న పుస్తకం తంగిరాల సోని కవిత్వం ‘బ్లాక్‌ వాయిస్‌’. అది చాలా చాలా బాగుంది. ఈ రోజుల్లో కవిత్వం రాయాలంటే ద్వంద్వార్థాలు మరియు పర్యాయ పదాలు గానో, నానార్ధాలుగానో అర్థం చేసుకోవలసి వస్తుంది. కానీ ఈ కవిత్వం ఇప్పుడున్న వాడుక భాషలో చెప్పాలంటే చదువురాని వారికే త్వరగా అర్థమవుతుందని చెప్పవచ్చు. దీన్ని మోటు కవిత్వం అని కూడా అనవచ్చు. ఇప్పటి కవులు చాలా కవిత్వాలలో తమదైన భాష, శైలి, అర్థం తమకు అనుగుణంగా రాసుకుంటున్నారే తప్ప ఇతరులకు త్వరగా అర్థమయ్యే రీతిలో ఎవరూ రాయడం లేదనిపిస్తుంది. బ్లాక్‌ వాయిస్‌ కవిత్వం అలా కాదు ఎవరు చదివినా సరాసరి ఆకట్టుకున్న శైలిలోనే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కవిత్వం చదువుతున్నంతసేపూ ఈ పదాలు మనం రోజూ మాట్లాడుకునే మాటలే కదా అనుకున్నా ఆ పదాలు రాయడానికి ఒక్కసారిగా ఎవరికీ ఆలోచన తట్టదు, ఒక్క తంగిరాల సోని గారికి తప్ప. ఈ బ్లాక్‌ వాయిస్‌ కవిత్వం సరదా కోసమో, పుస్తకాలు ముద్రించుకోవడం కోసమో, అవార్డుల కోసమో, పురస్కారాల కోసమో కాదు. దేశంలో జరిగే అరాచకాలపై అందులోనూ దళితులపై జరిగే దాడులపై తంగిరాల సోనీ తమ కవిత్వాన్ని తిరుగుబాటు తత్వం ఉండేలా ఒక సంకేతాన్ని బ్లాక్‌ వాయిస్‌ రూపంలో ఎగురవేశాడు. దళితులపై ఎక్డడైనా దాడులు జరిగితే వెంటనే స్పందించి ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళడం, వెంటనే కవిత్వం రూపంలో సోషల్‌ మీడియాలో పంపడం జరుగుతుంది. సాధారణంగా ఎక్కడైనా ఏవైనా సంఘటనలు జరిగితే మనకెందుకులే అనేవాళ్ళే ఎక్కువమంది. కానీ సోనీ మాత్రం తన వాయిస్‌ని వినిపిస్తాడు. అతనిలో గొప్ప విషయం ఏమిటంటే వయసులో చిన్నవాడైనా పెద్దవాళ్ళకు ధైర్యం చెప్పగల వ్యక్తి. స్త్రీలపై జరిగే అన్యాయాలపై ఎక్కువగా స్పందించి తన బ్లాక్‌ వాయిస్‌ కవిత్వం ద్వారా ప్రశ్నించే తీరు, ఎదుర్కొనే తీరు, తిరుగుబాటు చేసే తీరు, సరికొత్తగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే తన గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుందని ఈ బ్లాక్‌ వాయిస్‌ కవిత్వం ద్వారా అర్థమవుతుంది.

తల్లిదండ్రులను భారంగా భావించే పిల్లలు ప్రస్తుత రోజుల్లో చాలా మందిని చూస్తున్నాం. వయసు మళ్ళిన తల్లిదండ్రులతో ప్రేమగా జీవితాన్ని కొనసాగించడానికి వారి పిల్లలు ముందుకు రాకపోవడానికి కారణం ప్రేమ నశించడమే. తల్లికి పనిచేసే శక్తి ఉన్నప్పుడు అన్ని పనులు చేయించుకుని ఒక ముద్ద భోజనం పెట్టి తన పనేదో తనను చూసుకోమనేవారు ఒకప్పుడు ఉన్నా ఇప్పుడు కనుమరుగవుతున్నారు. తల్లి తన బిడ్డలను ఎలా చూసుకునేదో ‘అమ్మ ఒంటరి’ కవిత్వం ద్వారా మనకు చక్కని సందేశం ఇస్తున్నారు. సమాజంలో ఆడపిల్లలు పుడుతుంటే సంతోషపడాలి కానీ బాధపడకూడదు. ఇందులో ఆడపిల్ల, ”నేను పుట్టగానే నన్ను భారంగా చూడలేదు కానీ నేను పుట్టిన తర్వాత నాన్న చనిపోయాడని నన్ను అవమానపరిచారు మా ఊరి ప్రజలు. అమ్మ ఎంత బాధపడిందో నాకు తెలుసు. నా చిన్నప్పుడు పందిరి గుంజకు ముతక చీరను ఊయలగా కట్టి దానిలో పడుకోబెట్టి పరిగేరుకోవడానికి పొలం పోయేది. వస్తూ వస్తూ పరిగి గింజల్ని కోమట్ల కొట్టంలో వేసి చీరలో సోలెడు బియ్యం, రెండు ఉల్లిపాయలు, రెండు మిరపకాయలు తీసుకుని గబగబా వస్తూ తలకు కట్టిన గుడ్డను బిగదీసుకుంటూ వస్తుంటే వాడ మలుపులోనే నా ఏడుపు గొంతు వినిపించి గబగబా పరిగెత్తుకుంటూ వస్తుంటే పక్కన ఉన్నవాళ్ళు మీ పిల్ల దయ్యం పిల్ల, ఆ గొంతు చూడు ఎలా ఉందో, ఊరు మొత్తం వినిపిస్తుంది అంటూ ఆమెకు లేనిపోని చాడీలు చెబుతుండేవాళ్ళు. తల్లి తన బిడ్డ కళ్ళు తుడుస్తూ, తల నిమురుతూ, చీమిడి తుడుస్తూ… అలా ఆలోచించే ఆ అమ్మ ఆ బిడ్డ ఎదిగేకొద్దీ అలా తగ్గుతూ ఉండేది. అమ్మను వాటేసుకుని పడుకుంటే అమ్మ పేగులలో సముద్రాల అలలు పోటెత్తిన శబ్దాలు వినిపించాయి నాకు. మూడు పూటలు అన్నం పెట్టే అమ్మ కుంటల్లో నీళ్ళు తాగి ఆకలిని నింపుకునేది. ”నేను ఎదుగుతుంటే / అమ్మకు గుండెల్లో కలుక్కుమన్నట్లు ఉండేది / నా సమర్తకు రైక ముక్కయినా / కొనలేని అమ్మ / నేను బువ్వ తినందే తినని మా అమ్మ / నన్న సూడకుండా ఉండలేని మా అమ్మ / ఇప్పుడు నాకు వయస్సు వొచ్చిందని / ఎవళ్ళనో నాకు కట్టబెట్టడానికి వెతుకుతోంది / కిందా మీదా పడి నాకు పెళ్ళి చేసి / ఇప్పుడు నన్ను పంపేటప్పుడు / తన రెండు చేతులతో పాటు / అమ్మ ప్రాణాన్నే నేను తీసుకెళ్తున్నట్టుంది / అమ్మ నుండి నన్ను దూరం చేస్తుంటే / నాకు అమ్మే కావాలి అనిపించి / గుక్క పట్టి ఏడ్చుకుంటూ వచ్చా / నేను లేకుండా నా పిచ్చితల్లి / యట్టా బతికిద్దో / నాకు తెల్వడంలా / ఇప్పుడు అమ్మ ఒంటరి… ఇలా తల్లీ ప్లిలల మధ్య బంధంతో కూడిన చాలా సంఘటనలు మనం గుర్తు చేసుకోవచ్చు.

చాలామంది కవులు స్త్రీల అందాలను అణువణువు వర్ణించారే తప్ప, బాధలను ఎవరూ వర్ణించలేదని దేశంలో స్త్రీలపై జరిగే సంఘటనలు బాధాతప్త హృదయంతో కలాలు కదిలించాలని తంగిరాల సోనీ ‘బ్లాక్‌ వాయిస్‌’ కవిత్వం ద్వారా తెలియచేశారు. ‘నా నెత్తురుతో’ అనే కవితలో ఓ స్త్రీ ఆవేదనతో… నా అందాలు వర్ణించడానికి, ప్రతి అవయవాలు కొలవడానికి, మమ్మల్ని ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో, ఎలా రేప్‌ చేశారో రాయడానికి మాత్రమే మీ కలాలు కదులుతాయి గాని, మా బాధలు మా రోదనలు రాయడానికి మీ కలాలకు కుష్టు రోగం వచ్చింది కదా! మేము సమాజంలో రావాలి అంటే భయం, జీవించాలంటే భయుం. ఎక్కడ చూసినా మనుషుల్లో మానవత్వం చచ్చి, మృగం ఆవహించి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. అదేమంటే ఇది చేసే పనికి అలాగే జరగాలని వేదమంత్రంలా పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ సరదాగా నాపై జోకులు వేసుకుంటూ అనరాని మాటలతో చచ్చిన తర్వాత కూడా ఇది ఇలా, అది అలా అంటూ ఈ మాటల పోటులతో మమ్మల్ని చంపుతుంటారని తన బాధను వ్యక్తం చేస్తూ… ”నా దేహంపై కప్పుకున్న గుడ్డని తీసి / నాపై పొర్లడానికే కలాలు కదులుతాయి / బయట మాత్రం మేం స్త్రీ వాదులం / అని చెప్పే గొప్ప హింసావాదులు ఉన్న / పరమ కిరాతక పురుషలోకం… కప్పుకోండి… ప్పుకోండి…కప్పుకోండి…/ నా శరీరం తోలు వలిచి తయారుచేసిన / వజ్రాల శాలువతో సత్కరించుకోండి / నా రొమ్ములు కొరికి సిరా నింపిన / కలాలు తీసుకోండి / నన్ను చంపి బంగారంతో తయారుచేసిన / పతకాల సర్టిఫికెట్లు అందుకోండి… / మీక్కావాల్సింది నా పతనమే కదా/ మీక్కావలసింది నా బానిసత్వమే కదా/ మీక్కావలసింది నాపై పెత్తనమే కదా / మీక్కావాల్సింది నా శరీరమే కదా / ఒరే… ఒరే… ఒరే… / తలతిప్పితేనే వరసకట్టి / హింసించే పరమ దుర్మార్గులారా / మీ ఇళ్ళల్లో కూడా నేను ఉంటానని / మీరు కూడా నా నుండే వచ్చారని తెలుసుకోండి…” ఇలా దేశంలో జరుగుతున్న దాడులకు నిరసనగా తంగిరాల సోనీ ‘నా నెత్తురుతో’ అనే కవితలో స్త్రీల బాధలను వ్యక్తం చేశారు.

ఒప్పుడు మనం కట్టెలతోనే భోజనం వండుకునేవాళ్ళం. రాను రాను గ్యాస్‌, కరెంటుతో అలవాటైపోయింది మనకి. చెప్పాలంటే రోగాలు కూడా దగ్గర అయ్యాయే తప్ప మళ్ళీ కట్టెలతో వండడం లేదు. పల్లెల్లో ఎక్కువ శాతం తల్లిదండ్రులు కలిసి వరిచేల్లో పనికి వెళ్ళి పనిచేసి వస్తూ వస్తూ కొన్ని కట్టెలు తీసుకుని వస్తూ ఉంటారు. ఆ కట్టెలు పచ్చివైనా, ఎండువైనా వీటితోనే వంట చేసేవారు. కట్టెలతో వండుకున్న భోజనం తింటే ఎలాంటి రోగాలకు దరిచేరనీయకుండా గ్యాస్‌కు దూరంగా ఉంచుతాయి. పల్లెల్లో కట్టెలమోపు తీసుకువస్తున్నారంటే ఎక్కువమంది స్త్రీలే. అమ్మ కట్టెలమోపు తీసుకు వస్తూ వస్తూ ఈ కట్టెల మోపు అనే కవితలో అమ్మ చేసే పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువేననిపిస్తుంది…”పొద్దున్నే పరగడుపున నీళ్ళు తాగి / తలకు కట్టుకోవాల్సిన తువ్వాలు ఒకటి తీసుకుని / చేతిలో కొడవలి పట్టుకుని / గబగబా ఇంటి తాడిక నెట్టి / అందర్నీ లేపుకుని / పుల్లలు ఏరడానికి పోయేది అమ్మ… / కంది కట్టె, పొగాకు కట్టె, పత్తి కట్టె / నెత్తిమీద / మోస్తావుంటే /అంత బరువు యట్టా మోస్తున్నావే / అనీ… ఊరిలో జనం నోరు ఎళ్ళబెట్టే

వాళ్ళు / అమ్మ ఇంటి చుట్టూరా / తడిక కట్టిందంటే / ‘ఎంత అందంగా కట్టివే’ అనీ / చుట్టుపక్కల వాళ్ళు మురిసేటోలు…/ పరగడుపునే పుల్లలకు పోయీ / వస్తా వస్తా చీరచెంగులో రేగు పళ్ళు తెచ్చేది / నోట్లో వేపపుల్ల పెట్టుకుని / ఆకలిని ఎండగడుతూ ఉండేది అమ్మ / రాత్రిళ్ళు సగం బువ్వతోనే/ చెయ్యి కడిగే మా అమ్మ / పొద్దున్నే మంచినీళ్ళతోనే కడుపు నింపుకునేది / వారంలో ఒక్కసారి అయినా సరిగ్గా / బువ్వతిందో లేదో కానీ … / పనికి వంగిందంటే / యంత్రమైన వంగి దండం పెట్టాల్సిందే అమ్మకు… ఇలా అమ్మ పనితనం గురించి చక్కని సందేశం తన కవిత్వం ద్వారా తెలియచేశారు సోనీ గారు.

ప్రాచీన కాలం నుంచి వస్తున్న మాట అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మ చేసే పనుల గురించి, త్యాగాల గురించి ఎంత చెప్పినా తక్కువేననిపిస్తుంది. నడక, నేర్పరి, శైలి, భాష అన్నీ మొదటిగా అమ్మ దగ్గరే నేర్చుకుంటాము. కవిత్వాలు, నవలలు, కథలు, మొదలైనవి ఏవైనా అమ్మ గురించే ఎక్కువ రాస్తుంటారు రచయితలు.. అలాంటి అమ్మ గురించి ఎవరైనా అమర్యాదగా మాట్లాడితే అమ్మ విలువ తెలిసినవారికి ఎవరికైనా కోపం వస్తుంది. అమ్మ గురించి చులకనగా మాట్లాడినా, దూషించినా బిడ్డలు తిరగబడతారో లేదో తెలియదు కానీ కచ్చితంగా తల్లి తిరగబడాలి అని సోనీగారు చెప్పే అమ్మ కవిత్వంలో… పొడిచే పొద్దు కన్నా అమ్మ ముందే లేచి ఇల్లు వాకిలి ఊడ్చి పేడ నీళ్ళు చల్లిచట్టెలో గిద్దెడు బియ్యం పోసి కట్టె పొయ్యిలో ఉడుకు తురడగా బయట దొరగారి పిలుపుకి కాలిస సాసరును పక్కన పెట్టి ఏందయ్యగారు పిలిచారు అనేలోపే దొరసాని ఇంట్లోంచి కేకలు వినిపిస్తున్నాయి. ఇంకా రాలేదేమిటా అని నీకోసం ఎదురు చూస్తున్నా ఇంట్లో పనంతా చేసి ఆ చద్దికూడు తీసుకొని వెళ్ళు అని చెప్పి దొరసాని మళ్ళీ పడుకుంది. పనంత చేసేసరికి సాయంత్రం అయింది. పనిచేసి వస్తూ వస్తూ కొంతమంది దొరలు దారిలో అరుగులమీద పంచలు సర్దుకుంటూ, పళ్ళు నూరుతూ, కండ్లు కొడుతూ, రొమ్ము ఇరుస్తూ, పళ్ళు పెదాల మీద కొరుకుతూ… ”ఏందే…! నీమొగుడు సచ్చాక… / చాలా

ఒళ్ళు చేశావంటూ / సరసాల మాటలు మాట్లాడుతున్నారు / కాగుతున్న నూనెలో ఎయ్యాలి / ఈ దొరగాండ్లను అంటూ / తలదించుకొని నడుస్తుంది అమ్మ… / ఆకలితో పేగులు మాడిన డొక్కలో / వాడికి సౌందర్యం కనబడిందంట…!/ అలసి సొలసి పనులతో నిద్రలేమి నా కళ్ళల్లో / కామపు చూపు కనపడిందంట / పాలురాని నా రొమ్ములో / వాడికి నయాగరా జలపాతాలు కనపడ్డాయంట…!/ ఈ…దొరగాండ్లకు…/ ఒక్కపూట బువ్వ లేకపోతే…. ! / బతకలేని వెధవలు… / దొరసాని ముందుకెళ్తే… / దొరగారు కుక్కపిల్లలా, కుక్కిన పేనులా పడుండాలి… / బయట రోషం లేని మీసం మెలేస్తారు / గాంభీర్యం ప్రదర్శిస్తారు… అంటూ నా మొగుడు ఇంటా మగగాడే బయటా మగాడే మా ఆయనకు దేనికీ చాలరు ఈ దొరగాండ్లు. మా ఆయన పొలం పనికిపోతే పని చిటికెలో అయిపోతాది. మా ఆయన పనిచేసి బయటకు వస్తుంంటే ఈ దొరగాండ్లు రెండు చేతులు తీసుకువెళ్లి రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకుని కూర్చుని భయపడుతూ తలదించచుకుని చూస్తుంటారు. నా మగాడి పేరు చెబితే మీకు పంచెలు తడవాలా అంటూ…. ఏడుస్తున్న పిల్లాడ్ని ఎత్తుకొని ముద్దాడుకుంటూ… గుమ్మంలో కూలబడి తన రొమ్ములో రాని పాలు ఇస్తూ బిడ్డలో వాళ్ళయ్యను చూసుకుంటూ మురిసిపోతోంది అమ్మ…!

తంగిరాల సోనీగారు దేశంలో స్త్రీలపై జరుగుతున్న దాడులకు గద్గద స్వరంతో వినిపించిన ‘బ్లాక్‌ వాయిస్‌’ కవిత్వంలో ఎక్కువ శాతం స్త్రీవాద కవిత్వమే ఉందని చెప్పవచ్చు. ప్రతి స్త్రీలో మన ఇంట్లో స్త్రీలతో సమానంగా చూడాలని సరికొత్త గొంతుతో స్త్రీ వాద భావజాలాన్ని ఈ సమాజం అందిపుచ్చుకోవాలని స్త్రీలపై జరిపే దాడులలో గృహ హింస, హత్యాయత్నం, చులకన భావన, బానిసత్వం వంటి వాటినుండి ప్రజలు స్వేచ్ఛగా తమకు తాము నచ్చే విధంగా నడుచుకోవాలని, ఇంటి పనికి, వంట పనికి పరిమితమైన స్త్రీలు స్వేచ్ఛ సమాజంలోకి అడుగుపెట్టడానికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా స్వాతంత్య్రంలో స్త్రీలకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రూపొందించిందని తంగిరాల సోనీ కవిత్వం బ్లాక్‌ వాయిస్‌ ద్వారా వినిపించారు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.