జీవితపు ఆటలో గెలిచిన మాతంగి బిడ్డ సుశీల -చల్లపల్లి స్వరూపరాణి

సమాజం వారిని చిన్న చూపు చూసింది. మతం పేరుతో ఊరుమ్మడి వస్తువును చేసింది. ఊరు బాగుండాలంటే మాతమ్మలు చిందేయా లంది. వర్షాలు కురిసి భూములు పండాలంటే మాతమ్మ పూనకం తెచ్చుకుని సిడి మాను ఎక్కాలంది. అయినా ఆమె తన స్వయంశక్తితో తన తలరాత

మార్చుకుంటుంది. ఆమే పద్దెని మిదేళ్ళ కొండా సుశీల. జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి. ఆమె తల్లి ఒక ‘మాతంగి’, మాదిగ కులంలో పుట్టింది. ఆమెది చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం, తొండవాడ గ్రామం. ఆమె తల్లి తన మేనమామ సహాయంతో ఆ మురికి కూపం నుంచి బైటకొచ్చి పెళ్ళి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది. తన పాత పేరు ‘మాతమ్మ’ తానున్న బురదను సూచిస్తుందని ‘రేణుక’గా మార్చుకుంది. అయినా కొత్తపేరు ఎవరికీ పెద్దగా తెలీదు. అందరూ ఆమెను ‘మాతమ్మ’ అనే పిలుస్తారు. ఆచారం ఒదిలినా, పేరు మార్చుకున్నా దురదృష్టం భర్తగా మారి ఆమెని వెంటాడిరది. చేసుకున్నవాడు పచ్చి తాగుబోతు, పైసా సంపాదించకుండా భార్యని బండబూతులు తిట్టి, కొట్టేవాడు. ఆమె గతాన్ని పదే పదే గుర్తుచేసేవాడు. ఆమెకి నలుగురు పిల్లలు. తాగుబోతు భర్త ఒకవైపు, కటిక దరిద్రం మరోవైపు ఆమెను పట్టి పీడిరచాయి. కూలి నాలి చేసుకున్నా అది పిల్లలకు పెట్టడానికి లేకుండా అతని తాగుడుకే తగలేయాల్సి వచ్చేది. మరోవైపు ‘మాతంగి’ అనే గతం ఆమెని నీడలా వెంటాడిరది. ఇల్లూ వాకిలి లేదు. పిల్లలూ, తనూ తినడానికి తిండి లేదు. అదనంగా తిట్లు, తన్నులు భరిం చాల్సిన పరిస్థితిలో చేసేదేమీ లేక కన్నవారి ఇంటికి బయల్దేరింది. అక్కడా కటిక పేదరికంలో మగ్గుతున్న తల్లిదండ్రులు తమకే గతిలేక నానా అవస్థలు పడుతున్నారు. వారు కూడా భర్తను వదిలేసి వచ్చిన నలుగురు బిడ్డల తల్లిjైున కూతురిని కలో గంజో కల్సి తాగుదాం ఇసంట రమ్మనలేకపోయారు. అయినా ఆమె ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. మాతమ్మ గుడి దగ్గరే కొన్నాళ్ళు బతికింది. ఆరు బయట పిల్లల్ని పెట్టుకుని కూలి చేసి వచ్చిన పది రూపాయలతో పిల్లలకు ఇంత అన్నం ఉడకేసి పెట్టింది. ఎవర్నీ రూపాయి అడుక్కోలేదు, పల్లె విడిచి పోలేదు. వెక్కిరించిన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. చావో రేవో తేల్చుకోవాలనుకుంది. జీవితం చేతిలో క్షణం క్షణం ఓడిపోతూ, పడుతూ, లేస్తూ రేణుక ఇప్పుడి ప్పుడే నిలబడుతోంది.
ఇది ఒక ‘జోగిని’ కథ. చిత్తూరు జిల్లాలో ఆడపిల్లల్ని చిన్నప్పుడే దేవుడికిచ్చి పెళ్ళి చేసే ఆచారాన్ని ‘మాతంగి’ అంటారు. సుశీల తల్లి మాతమ్మని అభం శుభం తెలియని వయసులోనే తల్లిదండ్రులు, గ్రామపెద్దలు గ్రామ దేవతకి అంకితమిచ్చారు. అప్పటినుంచి ఆమె ఆరు బయలు జీవితంలో అందరి వస్తువైంది. దేవుడు, దెయ్యం పాపం, పుణ్యం తెలియకపోయినా ఊరోళ్ళు ఆడమంటే ఆడిరది, తాగమంటే తాగింది. ఊరి జాతరలు, కొలుపుల్లో తానే దేవు నికి ప్రతిరూపం. అందరినీ ‘మాత’ అయ్యి దీవిస్తుంది. కానీ ఆమెని ఎవరూ అమ్మలాగా చూడరు. హిందూ మతంలోని హిపోక్రసీకి ఈ వ్యవహారం నిలువెత్తు సాక్ష్యం. ఉత్సవాల్లో ఆమె కాళ్ళు మొక్కిన వాళ్ళే తర్వాత ఆమె గుడిసె తలుపు తడతారు, కొంచెపు మాటలతో ఆమెని తూట్లు పొడుస్తారు. జాతరలో ఆమె చేత మొహాన
ఉమ్మేయించున్న వాళ్ళే తర్వాత ఆమెని చీదరించు కుంటారు. ఆమెచేత బూతులు తిట్టించుకున్నోళ్ళే ఆమెని ‘లంజా’, ‘లమ్డీ’ అంటారు. దేవత కాస్తా జాతర, కొలుపులు అయ్మాక అలగా దెయ్యం అవుతుంది. ఇలాంటి వైవిధ్యం ప్రపంచంలో మరెక్కడా చూడం. సుశీల తల్లి రేణుక ఈ దుర్మార్గాన్ని భరించలేకపోయింది. మేనమామ సాయంతో ఆ రొచ్చు నుంచి బయటపడిరది. కొన్నాళ్ళు కూలి పనులు చేశాక ఒక హాస్పిటల్లో కాంట్రాక్ట్‌ స్వీపర్‌గా పనిచేస్తోంది. నెలకు ఆరు వేలు సంపాదిస్తూ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని తన నలుగురు పిల్లల్నీ చదివిస్తోంది.
రేణుక మాతంగి వ్యవస్థ నుంచి బైటపడి అంతటితో దాన్ని మర్చిపోలేదు. ఆమె తనలాంటి మాతమ్మల పరిస్థితి కూడా మారాలని గ్రామాలలో ఆడపిల్లలను దేవుడికి అంకితమివ్వడాన్ని ఆపే ఉద్యమంలో ఆమె క్రియాశీలకంగా పనిచేస్తోంది. జోగినీ వ్యతిరేక స్వచ్ఛంద సంస్థ, గ్రేస్‌ నిర్మల గారి ఆధ్వర్యంలో నడిచే ‘ఆసరా’లో ఆమె కమిటీ సభ్యురాలు, చిత్తూరు జిల్లా బాధ్యురాలు. అయితే చిత్తూరు జిల్లాలో మాతమ్మలకు ప్రభుత్వం ఇచ్చే పునరావాస సదుపాయాలను ఆమె ఉపయోగించు కోలేదు. ఇప్పటికీ ఆమెకు సొంత ఇల్లు లేదు. ఐదు వందల రూపాయల చాలీచాలని అద్దె కొంప లో నలుగురు పిల్లలతో జీవిస్తోంది. తాగుబోతు భర్తని వదిలేశాక ఆమెకి సంపూర్ణ స్వేచ్ఛ లభిం చింది. అయినా తన గతం ఆమెని నీడలా వెంటాడి వెక్కిరిస్తే రేణుక అవేమీ పట్టించు కోకుండా తన కర్తవ్యం వైపు వేగంగా అడుగు లేస్తోంది. ఎక్కడ ఆడపిల్లలను మాతమ్మలను చేసి గుడికి అంకిత మిస్తున్నారని తెల్సినా ఆమె వెంటనే అక్కడికి వెళ్ళి ఆపడం, పోలీసులకు కబురు పంపి, తన సంస్థ నుంచి ఇతర కార్యకర్తలను సమీకరించి పోరాడడం చేస్తోంది. మాతంగి వ్యవస్థ నిర్మూలన మీద ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా అన్ని పనులు మానుకుని మరీ హాజరవుతుంది.
భర్త సహకారం లేకున్నా మాతమ్మ తన నలుగురు పిల్లల్నీ ముందునుంచీ తన రెక్కల కష్టంతోనే సాకింది. తన పిల్లలకు ఏది ఇష్టమో అదే చేయమంటుంది. పిల్లలు సాంఘిక సంక్షేమ హాస్టళ్ళలో చదువుకుంటూ తమకు నచ్చినట్లు అభిరుచుల్ని ఏర్పరచుకున్నారు. పెద్దకొడుకు డిగ్రీ అయ్యాక విజయవాడ వెళ్ళి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కూతురు సుశీల హాకీ క్రీడలో జాతీయస్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. సుశీలకి ఇప్పుడు పద్దెనిమిదేళ్ళు. ఇంటర్మీడియట్‌ పూర్త యింది. ఆమె ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పటి నుంచి హాకీ క్రీడ పట్ల ఆసక్తి ఏర్పడిరది. ఇతరులు ఆడడం చూసి తనే స్వంతంగా ప్రాక్టీస్‌ చేసింది. మూడో క్లాసు వరకు తొండవాడలో చదివాక తిరుపతి నెహ్రు మున్సిపల్‌ హైస్కూల్లో చేరి అక్కడే హాస్టల్‌లో ఉండి హైస్కూల్‌ చదువు పూర్తి చేసింది. గ్రౌండ్‌లో స్టిక్‌, బాల్‌ తీసుకుని ఎప్పుడూ ఆడుతూనే ఉండేది. ఇంటికెళ్ళినపుడు కూడా గోడకేసి కిక్స్‌ కొడుతూ ఉంటుంది. ఉదయం, సాయంత్రం ఒక్కతే గ్రౌండ్‌కి వెళ్ళి ఎంతో పట్టుదలగా ప్రాక్టీస్‌ చేసేది. ఆమె చెల్లెలు ఎనిమిదో తరగతి చదివే ‘భూమిక’ కూడా హాకీ క్రీడలో ఆసక్తి పెంచుకుని స్కూల్లో ఆడుతోంది. ఊర్లో ఇతరులు, ఆమె తల్లికి మగతోడు లేకపోవడాన్ని, ఆమె గతాన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడే హీనమైన మాటల్ని పంటి బిగువున భరిస్తూ సుశీల తన లక్ష్యం వైపు దృష్టి పెట్టి పట్టుదలతో హాకీ ఆటలో ప్రావీణ్యం సంపాదించి విజయం వైపు దూసు కెళ్తోంది. తను బాగా చదువుకుని తన క్రీడా రంగంలో కష్టపడి రాణించి సమాజం నుంచి ఎదురయ్యే అన్ని రకాల వ్యతిరేక పరిస్థితులను అధిగమించవచ్చునని సుశీల అంటుంది. ఆమె తల్లి కూడా తాను ఒక ఉద్యమ కార్యకర్తననే అను కుంటుంది గానీ బాధితురాలినని భావించదు. ఆ భావనే ఆమెని ముళ్ళకంప వంటి జీవితం మీద విజేతని చేసింది.

Share
This entry was posted in మిణుగురులు . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.