‘ఒక దేశం, ఒక రేషన్‌ కార్డ్‌’ అయినా రేషన్‌ లేదు- సంస్క్రితి తల్వార్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి
లాక్‌డౌన్‌ కారణంగా బీహార్‌, దర్బంగా జిల్లాలోని తన ఇంటికి తిరిగివచ్చిన రుఖ్సానా ఖాతూన్‌కు, ఎట్టకేలకు నవంబర్‌ 2020లో ఒక రేషన్‌ కార్డు వచ్చింది. ప్రస్తుతం ఢల్లీికి తిరిగి వచ్చిన ఆమె, చట్టబద్ధంగా తనకు లభించే ఆహారధాన్యాలను పొందేందుకు మరోసారి అవస్థలు పడుతున్నారు.

ఇక తన కుటుంబ పోషణ గురించి చింతించాల్సిన అవసరం లేదని రుఖ్సానా ఖాతూన్‌ భావించారు. రేషన్‌ కార్డు కోసం రెండు సంవత్సరాల పాటు కొనసాగిన ఆమె ప్రయత్నాలు మూడోసారి ఫలించి, 2020 నవంబర్‌లో ఆమెకు రేషన్‌ కార్డు వచ్చింది. అకస్మాత్తుగా, కోవిడ్‌ విజృంభించిన ఆ సంవత్సరంలోని గడ్డు నెలలు వెనక్కుపోయినట్లు ఆమెకు అనిపించింది. ఇది జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ), 2013 కింద ఒక ‘ప్రాధాన్య కుటుంబాలు’ కార్డ్‌. దీని కింద అర్హులైన లబ్దిదారులను రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయి.
ఆ కార్డు, ఆ సమయంలో వారు నివసిస్తున్న వారి స్థానిక ఇంటి చిరునామాను కలిగి ఉంది. బీహార్‌లోని దర్బంగా జిల్లాలోని ఒక మురికి మునిసిపల్‌ కౌన్సిల్‌ ప్రాంతంలో ఇటీవలే విలీనం చేయబడిరది వారి గ్రామం. తన ఏడుగురు సభ్యుల కుటుంబానికి రాయితీతో కూడిన రేషన్‌లను రుఖ్సానా చివరకు పొందగలిగారు. ఆ తర్వాత వారందరూ ఆగస్టు 2021లో ఢల్లీికి తిరిగి వెళ్ళారు. ఆమె కుటుంబానికి చట్టబద్ధంగా లభించే ఆహార ధాన్యాలను పొందడం ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడిరది.
కేంద్ర ప్రభుత్వ ‘ఒక దేశం, ఒక రేషన్‌ కార్డ్‌’ (ఓఎన్‌ఓఆర్‌సి) పథకం కింద, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ లబ్దిదారులు ‘ప్రాధాన్య కుటుంబాలు’, ‘పేదవారిలోకెల్లా పేదవారు’ కింద వర్గీకరించబడినవారు. వీరు ఏ చౌక ధరల దుకాణం నుండైనా తమ ఆహార ధాన్యాల కోటాను సేకరించడానికి అర్హులు. ఆధార్‌ కార్డ్‌ లింక్‌ అయివున్న బయోమెట్రిక్‌ ప్రామాణికతను ఉపయోగించి, ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌) కింద వస్తువులను పంపిణీ చేయడానికి ఈ దుకాణాలను లైసెన్స్‌ పొందాయి. కానీ రుఖ్సానా తన నెలవారీ కోటా కోసం పశ్చిమ ఢల్లీిలోని షాదీపూర్‌ మెయిన్‌ బజార్‌ ప్రాంతంలోని చౌకధరల దుకాణాన్ని సందర్శించిన ప్రతిసారీ, ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (వూూూ) మెషీన్‌లో ఇలా రాసి ఉంటోంది: ‘ఐఎంపిడిఎస్‌లో రేషన్‌ కార్డు లేదు’.
ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌) కింద పంపిణీ చేయడానికి ఆహార ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఓఎన్‌ఓఆర్‌సి పథకం కింద దేశంలోని ఏ ప్రాంతం నుండైనా అర్హులైన వలసదారులు తమకు రావలసిన ఆహార ధాన్యాలను తీసుకునేలా 2018లో ఇంటిగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ (ఐఎంపిడిఎస్‌) ఏర్పాటు చేయబడిరది.
కోవిడ్‌`19 లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆమె కుటుంబ ఆర్థిక స్థితిగతులు దిగజారిపోవడంతో, ఢల్లీిలో ఇంటిపని చేసే కార్మికురాలిగా పనిచేస్తున్న రుఖ్సానా, ఒక రేషన్‌ కార్డును పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అక్టోబర్‌ 2020లో, ూARI నివేదించింది. ఉచిత ఆహార పంపిణీ జరిగే ప్రదేశాల వద్ద ఆమె క్యూలో నిలబడవలసి వచ్చింది. చేసేందుకు పని దొరక్క, పిడిఎస్‌ కింద ఆహారధాన్యాలు కూడా అందుబాటులోకి రాకపోవడంతో, చివరకు ఆమె తన పిల్లలను తీసుకొని దర్భంగాకు తిరిగివచ్చింది.
ూARI రుఖ్సానా గురించిన నివేదికను ప్రచురించిన కొన్ని వారాలకు, అధికారులు బీహార్‌లో ఉన్న రుఖ్సానాను కలిశారు. ఆమె కుటుంబ ఆధార్‌ కార్డులను పరిశీలించిన తర్వాత ఆమెకు ఒక రేషన్‌ కార్డును మంజూరు చేశారు.
‘‘బీహార్‌లో, బొటనవేలును (వూూూ-వేలిముద్రను గుర్తించే స్కానర్‌పై) అలా ఉంచిన వెంటనే మా రేషన్‌ మాకు వచ్చేది’’ అని ఆమె చెప్పారు. అక్కడ రేషన్‌ షాపుకు ఆమె వెళ్ళలేకపోతే ఆమె 11 ఏళ్ళ కొడుకు లేదా 13 ఏళ్ళ కూతురు కూడా తమ ఆహారధాన్యాలను ఇంటికి తీసుకువచ్చేవాళ్ళు. ‘‘జబ్‌ సబ్‌ ఆన్‌లైన్‌ హువా మై, ఫిర్‌ క్యోఁ నహీ ఆ రహా యహాఁ (ఇప్పుడంతా ఆన్‌లైన్‌ అయినప్పుడు, మేం ఇక్కడ (ఢల్లీిలో) మా వివరాలను ఎందుకు చూడలేకపోతున్నాం?)’’ రుఖ్సానా (31), ఆమె భర్త మహమ్మద్‌ వకీల్‌ (35), వారి ఐదుగురు పిల్లలతో కలిసి ఆగస్టు 25, 2021న రైలులో ఢల్లీికి తిరిగి వచ్చారు. ఆమె పశ్చిమ ఢల్లీిలోని పటేల్‌ నగర్‌లో నాలుగు ఇళ్ళల్లో గృహ కార్మికురాలిగా తిరిగి తన పనిని మొదలుపెట్టి, నెలకు రూ.6,000 సంపాదిస్తున్నారు. బీహార్‌కు తిరిగి వెళ్ళడానికి ముందే, 2020 నవంబర్‌లో తన టైలరింగ్‌ దుకాణాన్ని మూసివేసిన వకీల్‌కు, చివరకు 2022 మార్చిలో ఈశాన్య ఢల్లీిలోని గాంధీ నగర్‌ మార్కెట్‌లో టైలర్‌గా పని దొరికింది. ఆయన సంపాదన నెలకు రూ.8,000.
మార్చి 2020లో లాక్‌డౌన్‌ ప్రారంభం కావడానికి ముందు ఆ ఇద్దరి సంపాదన మొత్తం నెలకు దాదాపు రూ.27,000. సెప్టెంబర్‌ 2021 నుండి రుఖ్సానా, రేషన్‌ షాపు చుట్టూ ఎన్నిసార్లు తిరిగారో తానే మర్చిపోయారు. ‘‘బీహార్‌ నుండి రేషన్‌ కార్డును బ్లాక్‌ చేశారని ఇక్కడి డీలర్‌ నాతో చెప్పారు. బీహార్‌ వెళ్ళి మా ఆధార్‌ కార్డులన్నింటినీ నా రేషన్‌ కార్డుతో లింక్‌ చేయమని అడిగారు. మా మామగారు బేనీపుర్‌లోని రేషన్‌ కార్యాలయానికి వెళ్ళారు. కానీ మా ఆధార్‌ కార్డులన్నింటినీ ఢల్లీిలోని రేషన్‌ కార్యాలయంలోనే సమర్పించమని అక్కడివాళ్ళు ఆయనకు చెప్పారు. మేము బీహార్‌లో విచారించినపుడు, ఢల్లీిలో తనిఖీ చేయించమని చెప్పారు. ఢల్లీిలో అడిగితే, బీహార్‌లో తనిఖీ చేయాలని వారు మాట్లాడుతున్నారు’’ అని రుఖ్సానా వాపోయారు.
… … …
రుఖ్సానా తన స్వగ్రామమైన మోహన్‌ బహెరాలో నివసించడానికి ఇష్టపడతారు. ఈ గ్రామం మరో 23 గ్రామాలతో కలిసి దర్బంగాలోని బేనీపూర్‌ నగర్‌పరిషత్‌గా 2009లో ఏర్పాటయింది. ‘‘మా గ్రామంలో నాకు విశ్రాంతిగా ఉన్నట్టుండేది. అక్కడ నేను చేయాల్సిందల్లా ఆహారం సిద్ధం చేయడం, తినడం, పిల్లలను చూసుకోవడం’’ అంటారు రుఖ్సానా. ఢల్లీిలో అయితే, తన కుటుంబానికి వంట చేసే సమయానికి తిరిగి ఇంటికి రావాలంటే, ముందు ఆమె తన యజమానుల ఇళ్ళల్లో పనిని ఉరుకుల పరుగుల మీద ముగించాల్సి ఉంటుంది.
షాదీపూర్‌ మెయిన్‌ బజార్‌లోని నివాస గృహాల్‌ ఒక ప్రధాన మార్కెట్‌ రోడ్డు చుట్టూ విస్తరించిన చిన్న చిన్న ఇళ్ళతో కూడిన ఎత్తు తక్కువ నిర్మాణాలు. ఇక్కడ సెప్టెంబర్‌ 2021 నుండి రుఖ్సానా నివసించే ఇల్లు ఒక చిన్న, కిక్కిరిసి ఉన్న గది. దీని అద్దె నెలకు రూ.5,000. ఒకవైపు వంట కోసం ఎత్తుగా కట్టిన అరుగు, దానికి ఎదురుగా ఒక మంచం. వీటి మధ్య వకీల్‌ కుట్టు మిషన్‌, బట్టల కొలతల కోసం
ఉపయోగించే ఒక పెద్ద టేబుల్‌ ఉన్నాయి. ప్రవేశ ద్వారం దగ్గర కుడి మూలలో ఒక టాయిలెట్‌ ఇరికించినట్టుగా ఉంది. రుఖ్సానా, ఆమె ముగ్గురు చిన్న కూతుళ్ళు నజ్మిన్‌ (9), జమ్జమ్‌ (3), అసియా (1) ఇనుప మంచం మీద పడుకుంటారు. వకీల్‌, కపిల్‌ (11), పెద్ద కుమార్తె చాందిని (13) నేలపై పరచి ఉన్న దూది పరుపుపై పడుకుంటారు. ‘‘గ్రామాల్లో అయితే జనం తమ జంతువులను ఇలాంటి గదులలో వదులుతారు. నేను హాస్యమాడడం లేదు. వాళ్ళు తమ పశువులను ఇంతకంటే మంచి గదుల్లో ఉంచుతారు’’ అని వకీల్‌ చెప్పారు. ‘‘ఇక్కడ, ప్రజలే స్వయంగా జంతువులు అవుతారు’’.
ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కింద, భారతదేశంలోని గ్రామీణ జనాభాలో 75 శాతం మంది, పట్టణ జనాభాలో 50 శాతం మంది సబ్సిడీ ఆహార ధాన్యాలను కొనుగోలు చేయడానికి అర్హులు. వీరు కిలో బియ్యం రూ.3, గోధుమలు రూ.2, ముడి తృణధాన్యాలు (మిల్లెట్లు) కిలో ఒక్కింటికి రూ.1 చొప్పున గుర్తింపు పొందిన చౌక దరల దుకాణాల నుండి కొనుగోలు చేయవచ్చు. ‘ప్రాధాన్య కుటుంబాలు’ కార్డులో జాబితా చేయబడిన ప్రతి ఒక్కరు నెలకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు తీసుకోవడానికి అర్హులు. అత్యంత నిరుపేద కుటుంబాలు, లేదా ‘‘పేదలలో కెల్లా పేదవారు’’, అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) కింద ప్రతినెలా 35 కిలోల వరకు ఆహార ధాన్యాలు తీసుకునేందుకు అర్హులు.
రుఖ్సానా కుటుంబ సభ్యులలోని ఆరుగురు ఆమె ప్రాధాన్య కుటుంబ కార్డులో నమోదై
ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరికి నెలకు 3 కిలోల బియ్యం, 2 కిలోల గోధుమలు అందుతాయి.
వివిధ వినియోగ, ఆదాయ ప్రమాణాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గాల అర్హతను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు, ఢల్లీిలో వార్షిక ఆదాయం రూ.లక్ష కంటే తక్కువ ఉన్న కుటుంబాలు ‘ప్రాధాన్య కుటుంబాలు, ఎఎవై కేటగిరీ’లలో చేర్చడానికి అర్హులు. ప్రతి కుటుంబం యొక్క సామాజిక, వృత్తిపరమైన, గృహపరమైన దుర్బలతలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా వారే వర్గానికి చెందుతారో నిర్ణయించబడుతుంది. అయితే, ఆదాయపరమైన అర్హత ఉన్నప్పటికీ, వ్యక్తిగత ఉపయోగం కోసం నాలుగు చక్రాల వాహనాన్ని కలిగి ఉన్న కుటుంబాలు లేదా రాష్ట్రంలోని నిర్దిష్ట ప్రాంతాలలో భవనం లేదా భూమి
ఉన్నవారు లేదా 2 కిలోవాట్ల కంటే ఎక్కువ వాడకం ఉన్న విద్యుత్‌ కనెక్షన్‌ని కలిగి ఉన్న కుటుంబాలు ఈ వర్గాల నుండి మినహాయించబడ్డాయి. వేరొక పథకం కింద సబ్సిడీ ఆహారాన్ని పొందుతున్న కుటుంబాలు, లేదా ఆదాయపు పన్ను చెల్లించే సభ్యులున్న కుటుంబం లేదా ప్రభుత్వ ఉద్యోగి అయితే కూడా ఈ పథకాలకు అర్హులు కారు.
బీహార్‌లో, మినహాయింపు ప్రమాణాల ద్వారా అర్హత నిర్ణయించబడుతుంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మార్గదర్శకాలు, మోటారు వాహనం (మూడు లేదా నాలుగు చక్రాల వాహనం), లేదా మూడు లేదా అంతకంటే ఎక్కువ పక్కా గదులు ఉన్న ఇల్లు, లేదా 2.5 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ సాగునీటి వసతి కలిగి ఉన్న పొలం ఉన్న ఏ కుటుంబాన్నయినా అనర్హులుగా చేస్తాయి. కుటుంబంలోని ఒక సభ్యుడు నెలకు రూ.10,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నా, లేదా ప్రభుత్వ ఉద్యోగి అయినా ఇందులోంచి మినహాయించబడతారు.
2019లో పైలట్‌ పథకంగా ప్రారంభించబడిన ‘ఒక దేశం, ఒక రేషన్‌ కార్డ్‌’ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు కేంద్రం మే 2020లో ప్రకటించింది. కార్డు కలిగి ఉన్నవారి ఆధార్‌ నంబర్‌ ఒకసారి ‘సీడ్‌’ అయిన తర్వాత, ఆ రేషన్‌ కార్డ్‌ ఎక్కడ రిజిస్టర్‌ చేయబడి ఉన్నా సరే, దాని ‘పోర్టబిలిటీ’ని ఇది అనుమతిస్తుంది. ఇది రుఖ్సానా పరిస్థితిలో ఉన్న ఎవరైనా, దేశంలోని ఏ ఔట్‌లెట్‌ నుండి అయినా పిడిఎస్‌ ద్వారా వారికి లభించే సౌకర్యాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది.
ఢల్లీి ప్రభుత్వం ఈ పథకాన్ని జులై 2021లో అమలులోకి తెచ్చింది.
… … …
రుఖ్సానా ప్రతి రోజూ, ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు, తాను పనిచేసే ఇళ్ళల్లో ఊడ్చి, నేలను తుడిచి, పాత్రలను తోమి
శుభ్రం చేస్తారు. రుఖ్సానా సోదరి రూబీతో కలిసి ఈ రిపోర్టర్‌, డిసెంబరు 1, 2021న పటేల్‌ నగర్‌లోని ఆహార సరఫరాల శాఖ సర్కిల్‌ కార్యాలయానికి ‘రుఖ్సానా తనకు రావలసిన రేషన్‌ను ఢల్లీిలో ఎందుకు పొందలేకపోతున్నారో అడిగేందుకు’ వెళ్ళారు.
‘మేరా రేషన్‌’ మొబైల్‌ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసి, కుటుంబ సభ్యులందరి ఆధార్‌ కార్డులు సీడ్‌ చేయబడి ఉన్నాయో లేదో తనిఖీ చేయమని వారు మాకు సలహా ఇచ్చారు. ఆ రోజు వారి కార్యాలయంలో ఈ వెబ్‌ పోర్టల్‌ పనిచేయడం లేదు.
ఆ మధ్యాహ్నం మేము రుఖ్సానా రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు వివరాలను అప్లికేషన్‌లో పొందుపరిచి చూశాం. ఏడాది వయసున్న చిన్నారి అసియా మినహా మిగతా కుటుంబ సభ్యులందరి ఆధార్‌ కార్డులు ‘సీడెడ్‌’గా కనిపించాయి. కానీ ఓఎన్‌ఓఆర్‌సి రిజిస్ట్రేషన్‌ కోసం రుఖ్సానా వలస వచ్చిన సమాచారాన్ని నవీకరించడానికి ప్రయత్నించినపుడు, ఒక పాప్‌`అప్‌ సందేశం కనిపించిందిః ‘డేటాను పోస్ట్‌ చేయడం సాధ్యం కాదు. దయచేసి తర్వాత ప్రయత్నించండి’.
డిసెంబర్‌ 7న మరోసారి ప్రయత్నించినపుడు కూడా అదే పాప్‌`అప్‌ సందేశం వచ్చింది.
చివరికి, ఒక పిడిఎస్‌ డీలర్‌ మాట్లాడుతూ, ఐఎంపిడిఎస్‌ సర్వర్‌ కొన్నిసార్లు వలసదారుల స్థానిక గ్రామాల్లో పంపిణీ ప్రారంభమైన అదే సమయంలో ఢల్లీిలో నివసించే వారి కోసం పనిచేయడం కూడా ప్రారంభిస్తుందని, ఢల్లీి లబ్దిదారులు నవంబర్‌ 31 సాయంత్రంలోపు తమ కోటాను పొందారని, బీహార్‌లో తదుపరి రౌండ్‌ పంపిణీ డిసెంబర్‌ 5 నుండి ప్రారంభమవుతుందని తెలిపారు.
రుఖ్సానా అప్పటికీ ఆశ చావక, డిసెంబర్‌ 5న రేషన్‌ అవుట్‌లెట్‌కి వెళ్ళారు. యంత్రం స్పందించింది ‘ఐఎంపిడిఎస్‌లో రేషన్‌ కార్డు కనిపించలేదు’ అంటూ.
సెప్టెంబర్‌ 2021 నుండి రుఖ్సానా ఇంటిల్లిపాదికీ ఆహారాన్ని సమకూర్చడం కోసం తమ యజమానుల సహాయంపై ఆధారపడవలసి వచ్చింది. ‘ఒకరు నాకు కొన్ని పచ్చి కూరగాయలు ఇస్తారు. మరికొన్నిసార్లు ఇంకో యజమాని అవుట్‌లెట్‌ నుండి తీసుకొచ్చిన తన రేషన్‌లో కొంత భాగాన్ని మాకు ఇస్తారు’.
‘‘కబ్‌ సే కోషిష్‌ కర్‌ రహీ హుఁ (నేను చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నాను)’’ అని రుఖ్సానా చెప్పారు. ఆమెలో నిరాశ స్పష్టంగా కనిపించింది. బీహార్‌నుండి ఆమెతోపాటు ఢల్లీికి తిరిగి వచ్చిన కొంతమంది 2021 ఆగస్టు, డిసెంబర్‌ల మధ్య కనీసం మూడుసార్లు తమ కోటాను తీసుకున్నారు.
2020 డిసెంబరు నుంచి ఢల్లీిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం స్థానంలో పంపిణీ చేసిన డ్రై రేషన్‌ కిట్‌ ఉపయోగకరంగా ఉండిరది. ఆమె ఇద్దరు పెద్ద పిల్లలు కపిల్‌, చాందినీలు పటేల్‌ నగర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీళ్ళిద్దరికీ తలా పదేసి కిలోల బియ్యం, రెండు కిలోల పప్పు, ఒక లీటర్‌ రిఫైన్డ్‌ ఆయిల్‌ అందుకున్నారు. అయితే మార్చి 2022లో మధ్యాహ్న భోజనం తిరిగి ప్రారంభం కాగానే ఈ కిట్లు ఆగిపోయాయని రుఖ్సానా చెప్పారు.
… … …
ఢల్లీి ప్రభుత్వ ఓఎన్‌ఓఆర్‌సీ హెల్ప్‌లైన్‌ నంబరుకు చేసిన ప్రయత్నాలు ఏ ఫలితమూ ఇవ్వలేదు. నెట్‌వర్క్‌ ఎప్పుడూ ‘రద్దీ’గానే
ఉండిరది. దర్భంగాలోని బోనీపూర్‌లో 1991 నుంచి చౌక ధరల దుకాణం నడిపిన రేషన్‌ డీలర్‌ పర్వేజ్‌ ఆలమ్‌ మాతో ఫోన్‌లో మాట్లాడుతూ, ఈ సమస్య రుఖ్సానా ఒక్కరిదే కాదని, చాలామంది ఢల్లీికి వెళ్ళిన వలస కార్మికులు ఢల్లీిలో తమ రేషన్‌ తీసుకోలేకపోతున్నామని ఫోన్లు చేసి చెబుతున్నారని చెప్పారు.
దర్భంగా జిల్లా పంపిణీ అధికారి అజయ్‌ కుమార్‌ ఫోన్లో మాట్లాడుతూ తమ కార్యాలయంలో అన్ని పనులూ సవ్యంగా సాగుతున్నట్లు చెప్పారు. ఢల్లీిలోని అధికారులు సరిగ్గా ఎక్కవ సమస్య ఉందో మీకు చెబుతారు (ఢల్లీి తప్ప) ఇంకే రాష్ట్రంలోనూ ఏ సమస్యలూ ఉన్నట్టుగా నివేదించబడటం లేదు అన్నారాయన.
ఢల్లీిలోని ఆహార సరఫరాల విభాగానికి చెందిన అదనపు కమిషనర్‌ కుల్‌దీప్‌ సింగ్‌ మాట్లాడుతూ బీహార్‌కు చెందిన వలస కార్మికులకు సంబంధించి డిసెంబరులో ఇప్పటికి 43,000 పైగా లావాదేవీలు జరిగాయని అది ఒక ప్రత్యేకమైన కేసు అయి ఉంటుందనిÑ లబ్ధిదారు పేరును బహుశా బీహార్‌లో తొలగించి ఉండటానికి అవకాశం ఉందని అన్నారు.
2022 ఫిబ్రవరి 24న రుఖ్సానా, ఆమె కుటుంబం తమకుటుంబానికి చెందిన ఒకరి వివాహం సందర్భంగా దర్భంగా ప్రయాణమయ్యారు. వాళ్ళు ఊరికి వచ్చిన మర్నాడు అంటే ఫిబ్రవరి 26న తమ కూతురిని మోహన్‌ బహేర్‌లోని చౌక ధరల దుకాణానికి పంపారు రుఖ్సానా. అక్కడ వాళ్ళ కుటుంబం ఆ నెల తమ రేషన్లను తీసుకోగలిగింది.
అయితే, ఢల్లీికి తిరిగి వెళ్ళడానికి ముందు మార్చి 21న, రుఖ్సానా రేషన్‌ తీసుకోవడానికి వెళ్ళినపుడు, గ్రామంలోని డీలర్‌ ఆమె రేషన్‌ కార్డు రద్దయిందని చెప్పాడు. ‘‘ఊపర్‌ సే బంద్‌ హోగయా హై (పై నుంచి ఆగిపోయింది)’’ అని చెప్పాడు.
గత నెలలో పని చేసిందని, అలా ఎలా రద్దవుతుందని రుఖ్సానా డీలర్‌ని ప్రశ్నించారు.
ఇంట్లో వాళ్ళందరి ఆధార్‌ కార్డులు తీసుకుని బేనీపూర్‌లోని బ్లాక్‌ రేషన్‌ ఆఫాసుకు వెళ్ళమని డీలర్‌ ఆమెకు సలహా ఇచ్చాడు. అలాగే ఢల్లీిలోని ఆఫీసుకి కూడా ఆధార్‌ కార్డులు తీసుకెళ్ళమని కూడా ఆమెకు సూచించాడు.
ఈ విధంగా రేషన్‌ కార్డు రద్దు కాదని డీఎస్‌ఓ అజయ్‌కుమార్‌ చెప్పారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రుఖ్సానా, ఆమె కుటుంబం కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.
తిరిగి ఢల్లీి వస్తే, ఇప్పట్లో ఏమీ మారే సంకేతాలు కనబడని పరిస్థితులలో రాజీ పడిపోయానని రుఖ్సానా చెప్పారు ‘‘రేషన్‌ తో మేరా బంద్‌ హీ హోగయా (నా రేషన్‌ అయితే బంద్‌ అయిపోయింది)’’.
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/en/articles/one-nation-one-ration-card-still-no-ration/)
పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా (తీబతీaశ్రీఱఅసఱaశీఅశ్రీఱఅవ.శీతీస్త్ర)(ruralindiaonline.org) ఏప్రిల్‌ 28, 2022 లో మొదట ప్రచురితమైనది.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.