సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్‌’- కస్తూరి మురళీకృష్ణ

పైగా పాటలు పాడే నటీనటులు శిక్షణ పొందిన గాయనీ గాయకులు కారు. దాంతో సంగీత దర్శకులు కూడా బాణీలను తేలికగా ఉంచేవారు. నేపథ్యగానం సాధ్యమైన తరువాత పాటలు పాడే బాధ నటీనటులకు తప్పింది. లత బొంబాయిలో అడుగుపెట్టినప్పుడు నేపథ్యగానం ఇంకా అంతగా ప్రాచుర్యం పొందలేదు. సైగల్‌, సురేంద్ర, నూర్జహాన్‌, సురయ్య వంటి వారు తమ పాటలు తామే పాడుకునేవారు. శంషాద్‌ బేగం వంటి వారు రంగప్రవేశం చేసి పేరు

సంపాదిస్తున్నారు. ఆ కాలంలో రికార్డింగ్‌ వ్యవస్థ అభివృద్ధి చెందక పోవటంతో పాటలు పాడేవారి గొంతులు బలంగా ఉండాల్సిన అవసరం ఉండేది. దాంతో నేపథ్యగాయనిగా అవకాశాలు లభించటం బలహీనమైన గొంతు ఉన్న లత వంటి వారికి కష్టమే.
ఆ కాలంలో సినిమా సంగీత రంగంలో ముఠాలుండేవి. గోవింద్‌ రావ్‌ తెంబే, కేశవ్‌ రావ్‌ భోలే, మాస్టర్‌ కృష్ఠారావ్‌, పండిత్‌ బి.ఆర్‌.దేవధర్‌ వంటివారు మహారాష్ట్ర సంగీతాన్ని సినీ సంగీతంగా భావించేవారు. ఆర్‌సీ బోరాల్‌, పంకజ్‌ మల్లిక్‌, కె.ఎల్‌.సైగల్‌, కానన్‌ దేవి, కె.సి.డే, పహారి సన్యాల్‌, పన్నాలాల్‌ ఘోష్‌, అనిల్‌ బిశ్వాస్‌ వంటివారు బెంగాలీ సంగీతానికి చెందినవారు. గులామ్‌ హైదర్‌ పంజాబీ సంగీతానికి, నౌషాద్‌ ఉత్తరప్రదేశ్‌ సంగీతానికి చెందినవారు. గాయనీ గాయకులు ఈ సంగీత ముఠాల్లో ఏదో ఒకదానికి చెందితే వారికి అవకాశాలు అధికంగా లభించే వీలుంటుంది. శంషాద్‌ బేగం పంజాబీ, ఉత్తరప్రదేశ్‌ సంగీత దర్శకుల మనిషిగా పేరు పొందింది. బెంగాలీ వారికి పారుల్‌ ఘోష్‌ ఉండేది. 1946లో గీతాదత్‌ స్వరం లభించింది. మహారాష్ట్ర సంగీత దర్శకులకు వారి గాయనిలుండేవారు. దాంతో లతా మంగేష్కర్‌ ఏ జట్టుకూ చెందనిదయింది. పైగా వినాయక్‌ రావు ‘మనిషి’గా ముద్రపడటంతో ఇతరులు ఆమెను ఆదరించేందుకు సిద్ధంగా లేరు. చేతిలో డబ్బు లేదు, ఉండటానికి ఇల్లు లేదు. వినాయక్‌ రావు నేతృత్వంలో పనిచేస్తున్న కంపెనీ దుర్దశలో ఉండటంతో ఆరు నెలలుగా జీతాలు లేవు. ఎలాగైతే తండ్రి మరణించిన ఎనిమిదవ రోజునే ముఖానికి రంగు వేసుకుని వినాయక్‌ రావు కంపెనీ సినిమాలో నటించాల్సి వచ్చిందో, అలాగే మళ్ళీ వినాయక్‌ రావు మరణంతో సినిమా అవకాశాల కోసం వెతకాల్సి వచ్చింది.
సినిమాలకు ఎక్స్‌ట్రాలను అందించేవారినీ అవకాశాల కోసం అడిగింది. కానీ వారు నటన అవకాశాలిప్పించగలరు కానీ పాట పాడే అవకాశాలు ఇప్పించలేరు. లతకు నటించటం ఇష్టంలేదు. దీనికితోడు కొత్త ఇల్లు వెతుక్కోవాలి. బొంబాయిలో ఇళ్ళు దొరకటం కన్నా అడ్వాన్సులు ఇవ్వటం కష్టం! ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో లతకు కెమెరామేన్‌ ‘పాపా బుల్బులే’ సహాయం చేశాడు. ఈయన మాస్టర్‌ వినాయక్‌ ఫిల్మ్‌ కంపెనీలో పనిచేసేవాడు. లత మంగేష్కర్‌ వాళ్ళుంటున్న ఇంటి వరుసలోనే ఉండేవాడు.
‘నాకు తెలిసిన ఒక సంగీత దర్శకుడు కొత్త స్వరం కోసం వెతుకుతున్నాడు. నీకు పాడాలని ఉంటే నాతో రా. పాడే అవకాశం లభిస్తుంది’ అన్నాడు. పాడే అవకాశం కన్నా పాడితే వచ్చే డబ్బు ఆ సమయంలో ఎంతో అవసరం. అందుకని లత అతనితో ‘తార్దియో’లోని సెంట్రల్‌ స్టూడియోకు వెళ్ళింది. అక్కడ లతను హరిశ్చంద్ర బాలికి పరిచయం చేశాడు ‘పాపా బుల్బులే’.
హెచ్‌.సి.బాలిగా ప్రసిద్ధి చెందిన హరిశ్చంద్ర బాలి 1933లో ‘నక్ష`ఎ`సులైమాని’ అనే సినిమాలో నటుడిగా తన కెరీర్‌ను ఆరంభించాడు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన వాడవటంతో సినీ సంగీత దర్శకత్వం వైపు మళ్ళాడు. ‘ఔరత్‌ కె దిల్‌’ (1933) సంగీత దర్శకుడిగా అతనికి ప్రథమ చిత్రం. ఇరవై ఆరు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడాయన. లత కలిసినప్పుడు ఈయన ‘లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌’ అనే సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ కాలంలో హెచ్‌.సి.బాలికి గొప్ప పేరుండేది. కుందన్‌ లాల్‌ సైగల్‌ అనే యువకుడి పాటను విని మెచ్చి, సంగీత దర్శకుడు ఆర్సీ బోరాల్‌కు ఆ యువకుడిని పరిచయం చేశాడు హెచ్‌.సి.బాలి. అంతకు ముందే ఒక సిగరెట్టు దుకాణం వద్ద ఓ యువకుడి పాట విని మెచ్చాడు ఆర్సీ బోరాల్‌, కానీ అతడి పేరు తెలుసుకోలేదు. హెచ్‌.సి. బాలి పరిచయం చేసింది ఆ యువకుడినే. అలా టైప్‌ రైటర్లు అమ్మే ఉద్యోగం చేస్తున్న సైగల్‌ సినీ ప్రపంచంలో గాయకుడిగా తరతరాలను ప్రభావితం చేసేందుకు కారణమయ్యాడు హెచ్‌.సి.బాలి. ఆయన లత పాటను విని మెచ్చి ‘లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌’ సినిమాలో కొన్ని పాటలు లతతో పాడిరచాడు. ఆ సినిమా అసంపూర్ణంగా మిగిలిపోయింది. పాటలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ లతకు అత్యంత అవసరమైన సమయంలో అవకాశం ఇచ్చి ఆదుకున్నట్లయింది. హెచ్‌.సి.బోరాల్‌కు దీనానాథ్‌ మంగేష్కర్‌తో పరిచయం, అభిమానం ఉన్నాయి.
‘లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌’ పాటలు రికార్డు చేస్తున్న సమయంలో కొత్త గాయని గురించి సినీ పరిశ్రమకు తెలిసింది. ఆమెకు మాస్టర్‌ గులామ్‌ హైదర్‌ నుంచి పిలుపు వచ్చింది.
సినీ రంగంలో ఆ కాలంలో ‘గులామ్‌ హైదర్‌’ నుంచి పిలుపు అంటే, విజయానికి దారి దొరికినట్లే. అంతకుముందు 1941లో సంగీతంలో శిక్షణ లేని, శంషాద్‌ బేగంతో ‘ఖజాంచి’ సినిమాలో పాటలు పాడిరచాడు గులామ్‌ హైదర్‌. ‘ఖజాంచి’ పాటలు సినీ సంగీత ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులకు కారణమయ్యాయి. అంతవరకూ శాస్త్రీయ రాగాల ఆధారిత బాణీలనే సినీ పాటలకు కుదిర్చేవారు సంగీత దర్శకులు. కానీ గులామ్‌ హైదర్‌ శాస్త్రీయ రాగాలను స్వేచ్ఛగా తనకు నచ్చినట్లు వాడి మెప్పించటంతో సంగీత దర్శకులకు ‘సృజనాత్మక స్వేచ్ఛ’ లభించింది. ఈయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన సి.రామచంద్ర తాను స్వతంత్ర సంగీత దర్శకుడైనప్పుడు శాస్త్రీయ రాగాలకు, పాశ్చాత్య లయను జోడిరచి సినీ సంగీతాన్ని సంపూర్ణంగా రూపాంతరం చెందించాడు. ఇలా రూపాంతరం చెందిస్తూ ఎదగటంలో అతనికి బాణీలకు ప్రాణం పోసి ‘చిరంజీవులు’గా నిలిపిన స్వరం లతది. లతను తొలిసారిగా సి.రామచంద్ర, గులామ్‌ హైదర్‌ పాటల రిహార్సల్స్‌ సందర్భంలోనే కలిశాడు. నూర్జహాన్‌ తొలి సినిమా ‘ఖాందాన్‌’ సంగీత దర్శకుడు కూడా గులామ్‌ హైదరే!
గతంలో లత ‘ఖజాంచి’ సినిమా పాటల పోటీలో పాల్గొని విజయం సాధించింది. ఆ ‘ఖజాంచి’ సంగీత దర్శకుడి నుంచి పిలుపు రావటంతో లత నమ్మలేకపోయింది. గులామ్‌ హైదర్‌ లాహోర్‌ సంగీత దర్శకుల జట్టుకు చెందినవాడు. అందుకే అతడ్ని కలిసేందుకు లత ఎంతో ఉద్విగ్నత చెందింది. గులామ్‌ హైదర్‌ సంగీత దర్శకత్వం వహించిన ‘హుమాయూన్‌’ సినిమాలోని ‘మై తో ఓడూ గులాబీ చునరియా ఆజ్‌ రే’ అనే పాటను, ‘జీనత్‌’ సినిమాలో నూర్జహాన్‌ పాడిన ‘బుల్బులో మత్‌ రో యహాన్‌’ అనే పాటను పాడిరది. అయితే ఉద్విగ్నత వల్ల పాడటంలో పొరపాట్లు చేసింది.
‘నీకు సంగీతంలో శిక్షణ ఉందా?’ అని అడిగాడు గులామ్‌ హైదర్‌ ఆ పాటలు విని.
‘ఉంది’
‘ఎవరు నీ గురువు?’
‘అమానత్‌ ఖాన్‌ దేవసాలే’ సమాధానమిచ్చింది లత.
‘ఖాన్‌ సాహెబ్‌ దగ్గర శిష్యరికం చేశావు. బాణీకి తగ్గట్లు లయబద్ధంగా పాడటం రాదా?’ అన్నాడు గులామ్‌ హైదర్‌ నవ్వుతూ.
ఆ సమయంలో లత మనస్సులో చెలరేగిన నిరాశా తుఫానులను ఊహించటం కష్టం. గులామ్‌ హైదర్‌ మెప్పు పొందటమంటే మాటలు కాదు. శంషాద్‌ బేగం, నూర్జహాన్‌ వంటి వారిలో ప్రతిభను గుర్తించి, వారికి అవకాశాలిచ్చి సూపర్‌ సింగర్లుగా నిలిపినవాడు గులామ్‌ హైదర్‌. అలాంటి వాడికి పాట వినిపించే అవకాశం రావటం అదృష్టం. కానీ పాటలు తప్పుగా పాడటం దురదృష్టం. చేతికి అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్న భావన కలిగి ఉంటుంది లతకు. నిరాశకు గురై ఉంటుంది.
ఇక్కడ గులామ్‌ హైదర్‌ గొప్పతనాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో హిందీ సినీ సంగీత ప్రపంచానికి మకుటం లేని మహారాణిగా లత నిలుస్తుందని విధి నిశ్చయించింది. దానికి తిరుగులేదు. పాటను తప్పుగా పాడినా లత స్వరంలోని గొప్పతనాన్ని, ఆమె ప్రతిభను గుర్తించాడు గులామ్‌ హైదర్‌. అప్పుడు ప్రచలితంలో ఉన్న స్వరాలన్నిటికీ లత స్వరం భిన్నమైనది, బలహీనమైనది. కానీ ఆ స్వరంలోని మాధుర్యాన్ని, సినీ సంగీత ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోగల ‘శక్తి’ని గులామ్‌ హైదర్‌ గుర్తించాడు. అదేరోజు లతను తీసుకుని ఫిల్మిస్థాన్‌ స్టూడియోకు తీసుకువెళ్ళాడు. ఆ కాలంలో ఫిల్మిస్థాన్‌ స్టూడియో నెంబర్‌ వన్‌ స్టూడియో. శశిధర్‌ ముఖర్జీ లేదా ఎస్‌.ముఖర్జీ ‘బోంబే టాకీస్‌’ సినిమా నిర్మాత. చక్కని చిత్రాల నిర్మాతగా పేరుపొందాడు. అతని భార్య సతీదేవికి ముగ్గురు తమ్ముళ్ళు. అశోక్‌ కుమార్‌, కిషోర్‌ కుమార్‌, అనూప్‌ కుమార్‌లు. అప్పటికే అశోక్‌ కుమార్‌ పెద్ద స్టార్‌. హిమాన్షురాయ్‌ మరణం తర్వాత ‘బోంబే టాకీస్‌’ విషయంలో దేవికారాణితో భేదాభిప్రాయాలు రావటం వల్ల ఎస్‌.ముఖర్జీ, అశోక్‌ కుమార్‌లు, రాయబహదూర్‌ చున్నీలాల్‌, గ్యాన్‌ ముఖర్జీలతో కలిసి ‘ఫిల్మిస్థాన్‌ స్టూడియో’ను స్థాపించారు. సాదత్‌ హాసన్‌ మాంటో, ఇస్మత్‌ చుగ్తాయ్‌ వంటివారు కూడా ‘ఫిల్మిస్థాన్‌’లో చేరారు. దాంతో ఆ కాలంలో ఆ స్టూడియోకి లతను తీసుకెళ్ళినపుడు ఎస్‌.ముఖర్జీ ‘షహీద్‌’ అనే సినిమా నిర్మాణంలో ఉన్నాడు.
గులామ్‌ హైదర్‌ లతను ఎస్‌.ముఖర్జీకి పరిచయం చేశాడు. లత పాట విన్నాడు ముఖర్జీ. లత పాట ఎస్‌.ముఖర్జీకి నచ్చలేదు. ‘ఆమె గొంతు సినిమా పాటలకు పనికిరాదన్నా’డు. సినిమాలో నాయిక కామినీ కౌశల్‌కు ఆమె గొంతు సరిపోదన్నాడు. అప్పటికే అతను ఆ పాటకు గీతారాయ్‌ను ఎంచుకున్నాడు. ఆయన లత స్వరాన్ని తిరస్కరించేందుకు, అప్పటికే తాను నిర్మిస్తున్న సినిమాలో పాట గీతాదత్‌తో పాడిరచాలని నిర్ణయించుకోవటమేనని అంటారు. పధ్నాలుగేళ్ళ వయసులో గీతాదత్‌ ‘భక్త ప్రహ్లాద’ సినిమాలో తొలిపాట పాడిరది. పాడిరది రెండు లైన్లే అయినా ఆమె గొంతు అందరికీ నచ్చింది. పైగా ఆమె బెంగాల్‌కు చెందింది కావటం కూడా ఎస్‌.ముఖర్జీ ఆమెవైపు మొగ్గు చూపటంలో తన వంతు పాత్ర పోషించింది.
ఎస్‌.ముఖర్జీ తిరస్కారం గులామ్‌ హైదర్‌కు ఆగ్రహం కలిగించింది. ‘‘ఈ పిల్ల నూర్జహాన్‌ని సైతం మరిపిస్తుంది చూడు’’ అన్నాడు. ఆమెను తీసుకుని మలాద్‌లోని ‘‘బోంబే టాకీస్‌’’కు బయల్దేరాడు. అప్పుడాయన ‘మజ్బూర్‌’ అనే సినిమాకు పాటలను రూపొందిస్తున్నాడు. ‘గుర్గావ్‌’ రైల్వేస్టేషన్‌లో 555 సిగరెట్‌ పెట్టెపై తాళం వేస్తూ ఆమెకు ‘దిల్‌ మేరా తోడా’ పాట బాణీ నేర్పాడు. బయట వర్షం పడుతోంది. రైళ్ళు వస్తూ పోతున్నాయి. ప్రయాణికులు రైళ్ళు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ప్లాట్‌ఫాం తినుబండారాలు అమ్మేవాళ్ళ అరుపులతో దద్దరిల్లుతోంది. అయినా సంగీత దర్శకుడు గులామ్‌ హైదర్‌, గాయని లతా మంగేష్కర్‌ ఆ ప్లాట్‌ఫాంపై, ఆ రణగొణ ధ్వనుల నడుమ సర్వం మరిచి పాటలో లీనమయ్యారు. లతకు పాట సరిగ్గా వచ్చిందని నిర్ధారణ అయ్యాక, ఆమెను వెంట తీసుకుని స్టూడియోకు రికార్డింగ్‌కు వెళ్ళాడు గులామ్‌ హైదర్‌.
అత్యంత అద్భుతమైన ఘట్టం అది!
అందరూ ఆమె స్వరాన్ని తిరస్కరించారు. ఆమె కూడా నిరాశకు గురవుతోంది. భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తోంది. దొరక్క దొరక్క గులామ్‌ హైదర్‌ లాంటి సంగీత దర్శకుడికి తన స్వరం వినిపించే అవకాశం వస్తే, అక్కడా పొరపాట్లు చేసింది. అయినా ఆమె స్వరంపై విశ్వాసంతో పెద్ద నిర్మాత దగ్గరకు వెళ్తే ఆయన ఆమె స్వరాన్ని పనికిరాదంటూ తిరస్కరించాడు. అలాంటి పరిస్థితిలో వారిద్దరూ రైల్వే ప్లాట్‌ఫారంపై నిలబడి సర్వం మరిచి పాటను సాధన చేయటం ఊహిస్తేనే ‘అద్భుతం’ అనిపిస్తుంది.
అంతగా ఆమెతో సాధన చేయించటం ఎందుకంటే, ఈసారి ఆమెని ఇతరులకు పరిచయం చేసి పాడిరచినప్పుడు ఆమె పొరపాటు చేయకూడదని, విన్నవాళ్ళు ఆమె పనికిరాదని అనకూడదని. ఇక్కడే మానవాతీతమైన శక్తిని నమ్మవలసి వస్తుంది. ప్రపంచం ఎంతగా ‘యాదృచ్ఛికం’ అనుకున్నా వ్యక్తి విజయానికి అతని/ఆమె ప్రతిభ ఎంతగా కారణం అనుకున్నా కనబడని చెయ్యి నడిపించే నాటకం ఈ ప్రపంచం అనిపిస్తుంది.
భగవంతుడు లతకు అద్భుతమైన స్వరాన్ని ఇచ్చాడు. అది లేకపోతే ఈనాడు లత గురించి మాట్లాడుకునే అవసరమే లేదు. ఆమె తండ్రి మరణం వల్ల జీవిక కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. మాస్టర్‌ వినాయక్‌ కొల్హాపూర్‌ వదలి బొంబాయి రావటం ఒక మలుపు. ఆయన మరణంతో మళ్ళీ పోరాటం ఆరంభం. దీనానాథ్‌ మంగేష్కర్‌ దీర్ఘకాలం జీవించి ఉంటే లత బయటి ప్రపంచానికి తెలిసే వీలుండేది కాదు. మాస్టర్‌ వినాయక్‌కు అకాల మరణం సంభవించకుండా ఉండి ఉంటే, లతకు బొంబాయిలో అవకాశం కోసం వెతకాల్సిన ఆవశ్యకత ఉండేది కాదు. ఆమె వినాయక్‌ కంపెనీలోనే సంతృప్తిగా ఉండేది, పైగా వినాయక్‌ జట్టుకే పరిమితమై పోయేది. ఒక జట్టుకు చెందినదానిగా ముద్రపడిపోయేది. కానీ వినాయక్‌ రావు హఠాన్మరణంతో మళ్ళీ లతకు బొంబాయిలో అవకాశాల కోసం ఒంటరిగా వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె హెచ్‌.సి.బాలి దగ్గర పాటల సాధన చేస్తున్న విషయం పరిశ్రమలో పదిమందికి తెలిసింది. ఫలితంగా గులామ్‌ హైదర్‌ నుంచి పిలుపు వచ్చింది. గులామ్‌ హైదర్‌ లత స్వరంలోని గొప్పతనాన్ని, మాధుర్యాన్ని, ఇతరులకు భిన్నమైన అలౌకికత్వాన్ని గుర్తించటం ఒక గొప్ప మలుపు. అయితే ఎస్‌.ముఖర్జీ, కామినీ కౌశల్‌కు లత స్వరం సరిపోదని తిరస్కరించటంతో అహం దెబ్బతిన్న గులామ్‌ హైదర్‌ లత స్వరాన్ని తానే ప్రపంచానికి పరిచయం చేయాలని, ఆమె గొప్పతనాన్ని తానే ప్రదర్శించాలని నిశ్చయించుకోవటం నిర్ణయాత్మకమైన ఘట్టం.
ఆ కాలంలో ఎంతోమంది నిష్ణాతులైన సంగీత దర్శకులు ఉండేవారు. కానీ గాయనీ గాయకుల స్వరాల మాధుర్యాన్ని, ప్రతిభను గుర్తించటంలో గులామ్‌ హైదర్‌ను మించినవారు లేరు. ఈ సందర్భంగా గులామ్‌ హైదర్‌ శంషాద్‌ బేగం స్వర మాధుర్యాన్ని గమనించి ఆమెను తొలి నేపథ్య గాయనిగా సినీరంగానికి పరిచయం చేసిన విధానాన్ని స్మరించాల్సి ఉంటుంది.
శంషాద్‌ బేగం సాంప్రదాయిక ముస్లిం జాట్‌ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రికి శంషాద్‌ బేగం పాడటం ఇష్టం లేదు. కానీ ఆమె చాచా అమీరుద్దీన్‌ ఆమెను పాడేందుకు ప్రోత్సహించాడు. ‘జియెన్‌`ఓ`ఫోన్‌’ అనే సంస్థ గాయనిల కోసం అన్వేషిస్తున్నప్పుడు ఆమె చాచా ఆమెను ఆడిషన్‌ కోసం తీసుకువెళ్ళాడు. అతి కష్టం మీద శంషాద్‌ బేగం తండ్రిని ఒప్పించాడు. ఆయన కొన్ని నియమాలు విధించాడు. ఎట్టి పరిస్థితుల్లోను పాట తప్ప మరో పని చేయకూడదు, పాడిన వెంటనే ఇంటికి వచ్చేయాలి, ఫోటోలకు ఫోజులివ్వకూడదు, పార్టీలకు వెళ్ళకూడదు, స్టూడియోకు వెళ్ళటం, పాడటం ఇంటికి వచ్చేయటం. అంతే… షరతులకు ఒప్పుకొని శంషాద్‌ ఆడిషన్‌కు వెళ్ళింది. ఆమె ఆడిషన్‌కు వెళ్ళిన కంపెనీ సంగీత దర్శకుడు గులామ్‌ హైదర్‌! ఆడిషన్‌లో శంషాద్‌ బేగం, బహదూర్‌ షా జఫర్‌ గజల్‌ ‘మేరా యార్‌ గలే మిలే’ పాటను పాడిరది. ఆ తర్వాత జరిగిన విషయాన్ని శంషాద్‌ బేగం ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది.
‘‘మాస్టర్‌ గులామ్‌ నా స్వరం విని ముగ్ధుడయ్యాడు. నన్ను పన్నెండు పాటల ఒప్పందంపై సంతకం పెట్టమన్నాడు. ఆ కాలంలో పాటకు రూ.12.50 అతి పెద్ద మొత్తం. సంతకం పెట్టేముందు నేను ‘తాలీమ్‌?’ (శిక్షణ) అని అడిగాను. నాకు శిక్షణ అవసరం లేదన్నాడు. చెప్పినట్టు పాడితే చాలన్నాడు. నాకు అప్పుడు 12`13 ఏళ్ళు. మాస్టర్‌ జీ చాలా గొప్పవాడు. ప్రతిభను క్షణంలో గుర్తిస్తాడు. ఆయన నన్ను చౌముఖియా (బహుముఖ ప్రజ్ఞాశాలి) అనేవాడు. ఎలాంటి పాటనైనా సమర్ధవంతంగా పాడతానని నమ్మేవాడు. మేరా ఉస్తాద్‌ జన్నత్‌ మే రaాలే (నా గురువు స్వర్గంలో సుఖంగా ఉండాలి).’’
ఒక 12`13 ఏళ్ళ వ్యక్తిని, సంగీతంలో ఎలాంటి శిక్షణ లేని అమ్మాయి ప్రతిభను గుర్తించి ఆమెను సినీరంగానికి పరిచయం చేయటం గులామ్‌ హైదర్‌ సహృదయానికి నిదర్శనం. ఆ తర్వాత శంషాద్‌ బేగం ఎంతో పేరు సంపాదించింది. తొలి నేపథ్య గాయనిగా (ఖీఱతీర్‌ జూతీశీటవంంఱశీఅaశ్రీ జూశ్రీaవపaషస ంఱఅస్త్రవతీ) గుర్తింపు పొందటమే కాదు అగ్రశ్రేణి గాయనిగా నిలిచింది. నూర్జహాన్‌ తొమ్మిదేళ్ళ బాలికగా ఉన్నప్పుడు ఆమె స్వరంలోని మాధుర్యాన్ని, గొప్పతనాన్ని గుర్తించాడు గులామ్‌ హైదర్‌. 1935లో ‘పింద్‌ ది కురి’ సినిమాలో తన ఇతర సోదరిలతో కలిసి పాడిరది నూర్జహాన్‌. ఆ పాటలో నూర్జహాన్‌ స్వరం విన్న గులామ్‌ హైదర్‌ ఆమెకు పాటలు పాడే అవకాశమిచ్చాడు. 1942లో ప్రాణ్‌ హీరోగా, నూర్జహాన్‌ నాయికగా నటించి పాడిన ‘ఖాన్‌దాన్‌’ సినిమాతో గుర్తింపు పొందింది.
ఇలా ఇద్దరు ప్రసిద్ధ గాయనిలను పరిచయం చేసిన గులామ్‌ హైదర్‌ దృష్టిలో లత పడటం, ఆయన లతకు అవకాశాలు ఇవ్వటం ఎంత యాదృచ్ఛికం అనుకున్నా, ‘అదృష్టం’, ‘విధి’ లాంటి పదాలు గుర్తుకు రాక తప్పదు. గుర్గావ్‌ రైల్వే ప్లాట్‌ఫాం పైన గులామ్‌ హైదర్‌ పాడి లతకు నేర్పిన పాట ‘దిల్‌ మేరా తోడా’. ఆ తర్వాత ఇద్దరూ మలాద్‌లోని స్టూడియోకు వెళ్ళారు. మూడు రోజుల రిహార్సల్స్‌ తర్వాత పాట రికార్డయింది. ‘మజ్బూర్‌’ సినిమాలోని ‘దిల్‌ మేరా తోడా’ పాటలతపో హిందీ సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది లత. భవిష్యత్తులో హిందీ సినీ సంగీత ప్రపంచానికి ‘మహారాణి’గా లత స్థిరపడేందుకు నాందీ ప్రస్తావన ‘మజ్బూర్‌’ సినిమా పాటల రికార్డింగ్‌ సమయంలోనే జరిగింది.
శంషాద్‌ బేగం, నూర్జహాన్‌ల తర్వాత గులామ్‌ హైదర్‌ మరో కొత్త గాయనిని పరిచయం చేస్తున్నాడన్న వార్త సినీ ప్రపంచంలో విస్తరించింది. ‘ఎవరీ అమ్మాయి?’ అన్న కుతూహలం జనించింది. దాంతో పాటల రికార్డింగ్‌ సమయంలో లత స్వరం వినేందుకు నౌషాద్‌, ఖేం చంద్‌ ప్రకాశ్‌, అనిల్‌ బిశ్వాస్‌ వంటి ప్రఖ్యాత సంగీత దర్శకులు వచ్చారు, లత స్వరం విన్నారు.
అంతకుముందే దత్తాదావ్జేకర్‌ సంగీత దర్శకత్వంలో ‘ఆప్‌ కీ సేవా మే’ సినిమాలో ‘పా లాగూన్‌ కర్‌ జోరీ’ అనే పాట పాడిరది లత. ఆ పాటతో శాస్త్రీయ గానంలో తన ప్రతిభను ప్రదర్శించింది. 1945లో నూర్జహాన్‌తో కలిసి నటించిన సినిమా ‘బడీ మా’లో ‘మాతా తేరే చరణోంమే’ అన్న భజన పాడిరది. అదే సమయంలో ‘సుభద్ర’ సినిమాలో పాటల రికార్డింగ్‌ అప్పుడు సంగీత దర్శకుడు వసంత దేశాయ్‌తో లతకు పరిచయమైంది. మజ్బూర్‌ సినిమా పాటల సందర్బంగా ముఖేష్‌తో పరిచయమైంది. ముఖేష్‌తో కలిసి ‘అబ్‌ డర్‌ నే కీ కోయీ బాత్‌ నహీ’ అనే పాట పాడిరది. కానీ మజ్బూర్‌ సినిమాలో గులామ్‌ హైదర్‌ లతతో పాటలు పాడిరచటంతో, లతా మంగేష్కర్‌ జీవితంలో సంఘర్షణాత్మక దినాల అంతానికి ఆరంభమైంది. మరో రకమైన సంఘర్షణకు నాందీ ప్రస్తావన అయింది. మజ్బూర్‌ సినిమా నిజానికి లత సినీ సంగీత జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా. మహల్‌ సినిమాలోని ‘ఆయేగా ఆనేవాలా’ పాటతో లత సూపర్‌ సింగర్‌గా గుర్తింపు పొందింది. కానీ మహల్‌ సినిమాలో ఖేం చంద్‌ ప్రకాశ్‌ లతకు అవకాశమివ్వటం వెనుక మజ్బూర్‌ సినిమా రికార్డింగ్‌ సమయంలో ఆయన లత స్వరం వినటం ప్రధాన పాత్ర పోషించింది. ‘అనిల్‌ బిశ్వాస్‌’ లతతో పాటలు పాడిరచేందుకు ప్రధాన కారణం గులామ్‌ హైదర్‌ లతను పాడేందుకు ఎంచుకోవడం. ఒక్క మజ్బూర్‌ సినిమాతో లత ఆనాటి సినీ సంగీత ప్రపంచంలో ఉన్న అన్నిరకాల సంగీత జట్టుల ప్రతిబంధనాలను అధిగమించింది, అడ్డుగోడలను ఛేదించింది. బెంగాలీ స్కూల్‌కు చెందిన అనిల్‌ బిశ్వాస్‌, ఉత్తరప్రదేశ్‌ బాణీల నౌషాద్‌, శాస్త్రీయ సంగీత రాగాల ఖేంచంద్‌ ప్రకాశ్‌, శాస్త్రీయ పాశ్చాత్య రాగాల మిశ్రమ సంగీతం సృజించే సి.రామచంద్ర వంటి వారు లత స్వరం విన్నదీ, ఆమె ప్రతిభతో పరిచయమయిందీ మజ్బూర్‌ సినిమా పాటల రికార్డింగ్‌ సమయంలోనే. అంటే నేపథ్య గాయనిగా లత జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన మజ్బూర్‌ సినిమాలో పాటలు పాడేందుకు గులామ్‌ హైదర్‌ లతను ఎంచుకోవటమే!
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఉంది. ఎస్‌.ముఖర్జీ ‘షహీద్‌’ సినిమాలో ఏ పాట కోసం లతను కాదని గీతాదత్‌ను ఎంచుకున్నాడో ఆ పాట ‘ఆజా బేదర్దీ బాల్‌ మా’. ఆ కాలంలో అది పెద్ద హిట్‌, ఇప్పుడు ఆ పాటను ఎవరూ అంతగా వినరు. కానీ, ‘షహీద్‌’ సినిమాలో అవకాశం తప్పిపోవటం, ‘మజ్బూర్‌’ సినిమాలో అవకాశం లభించటం సినీరంగంపై లత తిరుగులేని రీతిలో తన ముద్ర వేసేందుకు భూమికను కల్పించింది. ఆ తర్వాత జరిగిన దేశవిభజన లత శిఖరారోహణకు మార్గం సులభతరం చేసింది, వేగవంతం చేసింది. అందుకే ఓ సినీ విమర్శకుడు ‘మజ్బూర్‌’ (బలహీనత) సినిమా లతను ‘మజ్బూత్‌’ (శక్తివంతం) చేసిన సినిమా’ అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్య వెనుక ఉన్న నిజం 1945 నుంచి 1950 వరకూ ప్రతి సంవత్సరం విడుదలైన సినిమాల్లో లత పాడిన పాటల సంఖ్యను గమనిస్తే స్పష్టమవుతుంది.
మార్చి 12, 1971 ఫిల్మ్‌ఫేర్‌ సంచికలో సంవత్సరాల వారీగా లత పాటల జాబితాను ప్రకటించారు. ఆ జాబితా ప్రకారం 1945 నుంచి 1950 వరకూ లత పాడిన పాటలు మొత్తం 363.
సంవత్సరం పాడిన సినిమాల సంఖ్య పాడిన పాటల సంఖ్య సోలో
1945 1 1 1
1946 3 6 4
1947 3 5 3
1948 17 48 42
1949 40 151 105
1950 36 152 93
మొత్తం 100 356లి 248
లిఫిల్మ్‌ ఫేర్‌ ప్రకారం లత పాటలు పాడిన సంఖ్యకూ, పైన టేబిల్‌లో ఇచ్చిన సంఖ్యకూ తేడా (3)కి కారణం, ఆ జాబితా తయారయిన తర్వాత లత పాడిన మూడు కొత్త పాటలు లభించటం వల్ల.
ఫిల్మ్‌ఫేర్‌ అందించిన వివరాలతో హర్‌ మందిర్‌ సింగ్‌ రూపొందించిన ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ హిందీ ఫిల్మ్‌ సాంగ్‌’ అన్న పుస్తకంలోని వివరాలు పోల్చి జతపరిస్తే సంవత్సరం వారీగా 1945 నుండి 1950 వరకూ లత ఎన్ని సినిమాలలో పాడిరది, వాటిల్లో ఎన్ని పాటలు పాడిరది, ఎన్ని పాటలు లత ఒంటరిగా (సోలో) పాడిరది అన్న వివరాలు తెలుస్తాయి.
ఈ వివరాలను, సంగీత కళావిహార్‌, అక్టోబర్‌ 1977లో సురేష్‌ బాద్వాంకర్‌ ప్రచురించిన గణాంక వివరాలతో పోలిస్తే అద్భుతమైన సత్యం స్పష్టమవుతుంది. 1941`50 నడుమ 1236 సినిమాలు విడుదలయ్యాయి. వాటిల్లో 11,124 పాటలున్నాయి. అంటే సంవత్సరానికి సగటున 123.6 సినిమాలలో 1112.4 పాటలు ఉంటున్నాయి. వాటిలో 1945లో ఒక పాట, 1947లో ఐదు పాటలు పాడిన లత 1948 కల్లా 48, 1949 కల్లా 151, 1950 కల్లా 152 పాటలు పాడటం, ఎంత త్వరగా ఒకటి, రెండు సంవత్సరాలలో లతా మంగేష్కర్‌ అగ్రస్థానానికి చేరుకుందో స్పష్టం చేస్తుంది. తన స్వర మాయాజాలంతో సంగీతదర్శకులను, ప్రేక్షకులను సమ్మోహితులను చేసిందో అర్థం చేసుకోవచ్చు. 1946లో లత వసంత దేశాయ్‌, డి.సి.దత్‌ అనే సంగీత దర్శకులకు పాటలు పాడిరది. 1947లో ముగ్గురు సంగీత దర్శకులు దత్త దావ్జేకర్‌ (డి.సి.దత్‌), పండిత్‌ రమాకాంత్‌ పైన్‌ గాన్‌ కర్‌, సి.రామచంద్రల సంగీతదర్శకత్వంలో పాటలు పాడిపది. 1948లో 15 మంది సంగీత దర్శకులు పాటలు పాడిరది. అనిల్‌ బిశ్వాస్‌, ఖేంచంద్‌ ప్రకాశ్‌, హన్స్‌రాజ్‌ బహల్‌, సి.రామచంద్ర, గులామ్‌ హైదర్‌ వంటి సంగీత దర్శకుల పాటలు పాడిరది లత. అంటే 1946లో మజ్బూర్‌ పాటలు రికార్డయ్యి, 1948లో సినిమా విడుదలయ్యేలోగా ఇతర సంగీత దర్శకులు లతతో పాటలు పాడిరచటానికి ఉత్సాహం చూపిస్తూ, ఆమె స్వరంతో తమ బాణీలకు ప్రాణం పోసుకోవటం ప్రారంభించారన్నమాట.
దేశ విభజన లత కెరీర్‌పై ప్రభావం చూపించటం గణాంక వివరాలు విస్పష్టం చేస్తాయి. 1949లో లత 151 పాటలు పాడిరది. 1946లో, 1947లో మూడు సినిమా పాటలు పాడిన లత, 1948లో పదిహేడు, 1949లో నలభై సినిమాలకు పాడటం, 1950లో 36 సినిమాలకు పాడినా మొత్తంగా ఆ సంవత్సరం 152 పాటలు పాడటం ఏ రకంగా దేశ విభజన తరువాత, సినీ సంగీత రంగంలో లోటు ఏర్పడిరదో, ఆ లోటును లత ఎంత సమర్ధవంతంగా తన స్వరంతో భర్తీ చేసిందో చెప్పకనే చెప్తుంది. 1946లో ఇద్దరు సంగీత దర్శకులకు పాడిన లత 1948 కల్లా పధ్నాలుగు, 1949లో పదిహేను, 1950లోనూ పదిహేను మంది సంగీత దర్శకుల పాటలు పాడటం ఆమెను సంగీత దర్శకులు ఎంతగా ఆదరించటం ప్రారంభించారో తెలుపుతుంది. అంతేకాదు 1946 నుంచి 1950 నడుమ 31 మంది సంగీత దర్శకులు లతతో పాటలు పాడిరచారన్న నిజాన్ని గమనిస్తే, అంతవరకూ సినీ సంగీత ప్రపంచంలో ఉన్న బెంగాలీ జట్టు, మరాఠీ జట్టు, పంజాబీ జట్టు, ఉత్తరప్రదేశ్‌ జట్టు వంటివన్నీ అదృశ్యమై ఒక్క లతా మంగేష్కర్‌ జట్టు మాత్రమే మిగిలిందని అర్థమవుతుంది. ఇలా ఎలాంటి తేడాలు, భేదభావాలు లేకుండా అందరినీ తన స్వరప్రభావానికి గురిచేసి, తన్మయులను చేసి ఆకర్షించటం వల్ల తిరుగులేని రీతిలో ఎదురులేని గాయనిగా నిలిచింది. ఏ ఒక్క నిర్మాణ సంస్థకో పరిమితం కాకుండా, ఏ ఒక్క సంగీత దర్శకుడి అండనో ఆశించకుండా తన స్వర మహిమతో, ఎవరి దయాదాక్షిణ్యాల అవసరం లేకుండా స్వతంత్రంగా నిలవటం లత శక్తి, ఆమె బలం. ఆమె ఆత్మ విశ్వాసం. ఆమె అహంకారం!
భగవంతుడు లతకు ఇచ్చిన అమూల్యమైన వరం ఆమె స్వరం. అదే లేకపోతే ఎవరెంత సహాయం చేసినా, ఎన్ని అవకాశాలిచ్చినా, ఎంత ప్రచారం చేసినా లత ‘లత’గా ఎదగలేకపోయేది. భగవద్దత్త స్వరం ప్రజలను మంత్రముగ్ధులను చేయటంలో ఆశ్చర్యం లేదు. ఆ స్వరం ప్రజలను చేరటంలో సహాయపడిన వారంతా విధి చేతిలో సాధనాలు తప్ప మరేమీ కాదు. ‘నేను లత విజయానికి కారణం’, ‘నేను లతను గొప్ప గాయనిని చేశాను’ అని ఎవరైనా అనుకుని అహంకరిస్తే అది వారి అజ్ఞానం వల్ల కలిగిన అపోహ తప్ప వాస్తవం కాదు. ఎందుకంటే లతకు భగవద్దత్తమైన మహాద్భుతమైన స్వరం లేకపోతే వారెంత తల్లక్రిందులుగా తపస్సు చేసినా ఆమెను అగ్రశ్రేణి గాయనిగా నిలపటం సాధ్యమయ్యేది కాదు. భవిష్యత్తులో కొందరు సంగీత దర్శకులు ‘తామే లత విజయానికి కారకులు’ అన్న భ్రమలో ఇతర గాయనిలను లతకు పోటీగా నిలపాలని ప్రయత్నించి భంగపడ్డప్పుడు కూడా లత ఎలాంటి స్పందనను ప్రదర్శించలేదు. బహుశా వారి అహంకారాన్ని, అపోహలను అర్థం చేసుకుని మౌనంగా నవ్వుకుని ఉంటుంది. ‘లతకు నేనిది నేర్పించాను’ అనే వారి ప్రకటనలను కూడా లత ఎప్పుడూ ఖండిరచలేదు, స్పందించలేదు. నిజం తెలిసిన తర్వాత ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా ఏమీ లాభం లేదు. అందుకే లత ‘యతీంద్ర మిశ్రా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మురేa భీ కహీ బచ్‌పన్‌ సే హీ మన్‌ మే యప్‌ా దబా`ఛి ప ఎహసాస్‌ బనా రహా హై కి మై సిర్ఫ్‌ ఇసీలియే కుఛ్‌ అలగ్‌ హు కి మై పండిత్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌ కీ బేటీ హు’ అంది. (సురగాథ`పేజీ నెం.218)
‘బాల్యం నుంచీ నేను పండిత్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌ కూతుర్ని కాబట్టి, ఇతరుల కన్నా భిన్నం అన్న భావన నా మనసులో ఉంది’. అందుకే కొందరు ‘ఆయేగా ఆనేవాలా’తో లత జీవితం మలుపు తిరిగిందన్న అభిప్రాయం ప్రకటించినా లత కాదనలేదు. కానీ తనకు అవకాశం దొరికినప్పుడల్లా ‘నా లెక్క ప్రకారం మాస్టర్‌ గులామ్‌ హైదర్‌ వల్లనే సినీ సంగీత ప్రపంచంలో నాకు గుర్తింపు లభించింది. ఆయన వల్లనే నాకు ఇతరుల మద్దతు లభించింది. ఆయన వల్లనే నాకు ఖేంచంద్‌ ప్రకాశ్‌, అనిల్‌ బిశ్వాస్‌ వంటి వారి పరిచయమైంది. ‘మజ్బూర్‌’ సినిమా తర్వాత పరిశ్రమలో అందరూ నన్ను గుర్తించటం ప్రారంభించారు. అడగకుండానే నాకు అవకాశాలు లభించాయి. సంగీత దర్శకులందరూ ఎవరో కొత్త అమ్మాయి లతా మంగేష్కర్‌ అట, ఆమెను గులామ్‌ హైదర్‌, ఖేంచంద్‌ ప్రకాశ్‌లు మెచ్చి అవకాశాలు ఇస్తున్నారట అనుకునేవారు. ‘మజ్బూర్‌’ తర్వాత నాకు ఏ సినిమాలో పాడే అవకాశం వచ్చినా మాస్టర్‌ గులామ్‌ హైదర్‌ దానికి కారణం’. దేశవిభజన సమయంలో మాస్టర్‌ గులామ్‌ హైదర్‌ పాకిస్తాన్‌ వెళ్ళిపోయాడు. అయితే అక్కడ సినీ పరిశ్రమలో సరైన స్వరాలు లభించక, అవకాశాలు లభించక ఆయన నిరాశ చెందాడు. నవంబర్‌ 9, 1953న 45 ఏళ్ళ వయసులో గులామ్‌ హైదర్‌ మరణించాడు.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.