మీ రాజ్యం మీరేలండి నవలలో సామాజీకత – అయ్యప్ప గారి స్వప్న

మీ రాజ్యం మీరేలండి నవలాకర్త బండి నారాయణ స్వామి. నవలల్లో చాలా వరకూ కల్పనలకే ప్రాధాన్యముండవచ్చును కానీ, సామాజిక ఇతివృత్తం నేపథ్యంలో వచ్చిన నవలలు వాస్తవిక చిత్రణలకే ఎక్కువ ప్రాతినిథ్యాన్ని కల్పించేయి. సంఘటనాత్మక కథాకథనాలతో ప్రాత్రచిత్రణలతో నవలలు వెలుగుచూస్తూంటాయి.

ఈ వ్యాసం సుప్రసిద్ధ- నవలారచయిత, వివిధ విశిష్టపురస్కారాల స్వీకర్త బండి నారాయణస్వామి – ‘‘మీరాజ్యంమీరేలండి’’ నవలలో అనంతపురం జీవనానికి ప్రతింబింబంగా భాసిల్లే తావులను ఆవిష్కరిస్తుంది. నవల ప్రత్యేకతలు, నవలలో చిత్రితమైన సాంఘికజీవనవిధానాలు, అంటరానితనం, రాజకీయాధిపత్యం మొదలైన అంశాలను వివిధ కోణాలలో ఈ వ్యాసం చర్చిస్తుంది.
ఉపోద్ఘాతం ‘‘ప్రజాకంటకుల గుండెల్లో తుపాకి చప్పుడు మోగింది. చీకటి నెత్తుటి మడుగులో తేలకుండా తూర్పున ఉదయం రానంది. ముఠానాయకులై తొంభైమంది భుజాలెక్కిన పదిమంది రెడ్లూ, చౌదరీలు హఠాత్తుగా మానవతా వాదులై ప్రజాస్వామికులై హాహాకారాలు చేస్తుంటే మల్లయ్య అడుగుతీస్తున్నాడు. తన గ్రామ విముక్తి వైపు. అగ్రశూద్ర కులాల రాజకీయ ఆధిపత్యం నుంచీ జాతి ముఖం వైపు. అగ్రశూద్ర కులాల రాజకీయ ఆధిపత్యం నుంచీ జాతి ముఖంపై రుద్దిన బ్రాహ్మణ కుల సంస్కృతి నుంచీ రాజకీయ పాలెగాళ్ళకు నిచ్చెనగా మారిన దళిత రౌడీల విషాదచరిత్రల నుంచీ తన కాళ్ళను పెల్లగించుకొని తీస్తున్నాడు మల్లయ్య. ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకుతినే దొరల్ని గాడిదల మీద ఊరేగించే ప్రజాకోర్టుల వైపు. దళితుడు మరో దళిత కులం పట్ల అనుకంపన చెందే ఔన్నత్యం వైపు. సనాతన సంస్కృతిని చెమట పరం చేసే శూద్రకులాల మూలం వైపు. వ్యక్తిగతపు ‘నేను’ను విచ్ఛేదమ్‌ చేసుకునే అద్వైత చింతన వైపూ, కమ్యూనిస్ట్‌ సమాజం వైపు’’ (నారాయణస్వామి, బండి., మీ రాజ్యం మీరేలండి, పుట.191) అంటూ ఒక సామాన్యవ్యక్తి ఎలా చైతన్యవంతుడయ్యాడో తెలిపాడు సుప్రసిద్ధ నవలాకారుడు బండి నారాయణ స్వామి.
1. నవల్లోని పాత్రలు: అనంతపురం జిల్లా సమాజ దర్పణంగా రూపుదిద్దుకున్న ఈ నవలకు మాదిగ వడ్డెర, కురుమ, దూదేకుల, చాకలి వంటి శూద్రకులాల సజీవ సమాజ జీవనచిత్రణ ఆయువుపట్టుగా ఉంది. రెడ్డి, కమ్మ బ్రాహ్మణ వంటి ఆధిపత్యకులాల వ్యవహార సరళిని కూడా రచయిత ఇందులో లోతుగా చర్చించారు. మాదిగ దేవన్న, బోయ భూమయ్య, వడ్డెలోకప్ప, గొర్లతిరుపాలు వంటి తొలితరం మనుషులు, పండయ్య(మాదిగ), మల్లయ్య(బోయ), విరూపాక్షి (వడ్డెర), వెంకట లక్ష్మి (మాదిగ) వంటి రెండో తరం వారు, గోవిందు (చాకలి), భాస్కర నాయుడు (లింకుల చౌదరి) వంటి రౌడీలు, దళారీలూ, రాజారెడ్డి, కొండారెడ్డి, గంగుల రెడ్డి, వీరప్ప నాయుడు, గరుడ శేఖర నాయుడు వంటి ఆధిపత్య పాలక కులాలకు చెందినవారు ఈ వాస్తవిక నవలలో మనకు తారసపడతారు. సుమారు (1970-2000) మూడు దశాబ్దాల రాజకీయ సాంఘిక జీవనం ఈ నవలలో చిత్రితమైంది. ఈ జీవనం రాయలసీమ అందులోనూ ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజల జీవనంగా ఉంది.
అనంతపురం పట్టణానికి సమీపంలో పండమేరు గ్రామం వుంది. పండమేటి స్వామి సమాది óదగ్గరే గుడి వెలుస్తుంది. అంటరానితనం కారణంగా మాదిగలకు ఈ గుడిలో ప్రవేశం లేదు. మిగతా అన్ని కులాల వాళ్ళకు గుడిలో స్వామి దర్శనం ఉంటుంది. తర్వాత పండమేటి గ్రామానికి తూర్పు దిక్కున వందమైళ్ల అవతల ఒక కుగ్రామంలో తాళప్రతాలుదొరికినాయి, ‘‘ఆ తాళపత్రాల్లో పండమేటిస్వామి గురించిన శతక పద్యాలున్నాయి. ఆ పద్యాల్లో పండమేటి స్వామి పుట్టిన ఊరు చిత్రచేడు అని, అతని పూర్వనామం కేశన్న అని, కులం మాదిగ, గోత్రం మందల అని తెలిసి పండమేటి ప్రజల్ని ఆశ్చర్యపరిచింది.’’ దీనితో మధ్యలో పండమేటి స్వామి స్వయానా మాదిగ కులస్తుడనే నిజం వెలుగు చూస్తుంది. రెడ్లు, కమ్మలు ఏకమై వ్యతిరేకించినా, లెక్కచేయక మాదిగలు మొదటిసారి గుడిలోకి ప్రవేశించి తమ స్వామిని దర్శించుకుంటారు. ఈ ఘటనతో మాదిగలకు, బోయ, కురుమ, ఈడిగ, వడ్డెర వంటి ఇతర కులాలకు చెందినవారికీ మధ్య ఉన్న అంటరానితనం మూలంగా ఏర్పడిన అగాధం క్రమంగా తొలగిపోతుంది. ఇందులోని వస్తువు ఇదే అయినా దీనికి అనుబంధంగా అనేక సామాజింకాంశాలు ముడిపడి ఉన్నాయి.
2. పేదరికంలో భార్యాభర్తలు: ఈ నవలలో పేదదంపతుల బంధం అద్భుతంగా చెప్పబడిరది. ‘‘ఒకసారి ఇరుగు పొరుగు
వాళ్ళు తీర్థయాత్రలకు పోతుంటే పెద్దక్క కూడా పోయింది. మహానంది, అహెరీబిలం, శ్రీశైలం, యాగంటి, బ్రహ్మంగారి మఠం, అన్నీ దర్శించుకొని వచ్చింది. తీర్థయాత్రలకు మున్నూరు రూపాయల ఖర్చు పెట్టుకొని వచ్చింది. ఆమే తీర్థయాత్రలకు పోయిన ఆ మూడు రోజులూ ఉత్తపేయితిప్పన్న – నా భార్య తీర్థయాత్రలకు పోయిందీ, నా భార్య తీర్థయాత్రకు పోయిందీ! అని ఊర్లో అందరికి చెప్పి సంతోషపడినాడు. పెద్దక్క మహానంది నుంచి తెచ్చిన విబూది పండునీ, శ్రీశైలం నుంచీ తెచ్చిన ప్రసాదాన్నీ అహెరీబిలం నుంచి తెచ్చిన నరసింహస్వామి పటాన్ని పిల్లోడు చూసినట్టు అబ్బురంగా చూసినాడు తిప్పన్న. తన తీర్థయాత్రల విషయాన్ని తన మొగుడు ఊరందరికి చెప్పుకుని సంతోషపడిన వైనాన్ని విని పెద్దక్క భోరుమని ఏడ్చిందంట. అయ్యో! పాపిష్టి దాన్ని! నా మొగుడు ఎంత తిక్కొడు అయితే మాత్రం, ఆయన్ని విడిచిపెట్టి తగుదునమ్మా! అని నేను ఒక్క దాన్నే తీర్థయాత్రలకు పోవల్లా? అయ్యో! నా తిక్క మొగున్ని పిల్చుకొని పోతే, ఇంకో మూడు నూర్లు ఖర్చు అయిపోతాయి కదా అనుకున్న లోభిముండని! భగవంతుడు నన్ను చెమిస్తాడా?’’ (అదే. పుట. 5) అని పశ్చాత్తాప పడుతుంది. ఈ సన్నివేశంలో నిరక్షరాస్యులైన దంపతులకు ఒకరిపై మరొకరికి ఎలాంటి ప్రేమానురాగాలున్నాయో నవలాకారుడు అద్భుతంగా చెప్పాడు. అదే ధనవంతులకు ఈ అక్షరాస్యులకు, ఉద్యోగులకు ఇలాంటి బంధమున్నట్లు చెప్పడం సాహసమే అవుతుంది.
3 అస్పృశ్యత: అంటరానితనం ఎంత దారుణంగా ఉందో బండి నారాయణ స్వామి స్పష్టంగా పేర్కొన్నాడు భూమయ్య అనే వ్యక్తి తన తమ్మున్ని ఇలా మందలిస్తాడు. ‘‘ఒలే! మాదిగొల్లతో సావాసాలేందిరా? బోయోల్లతో తిరుగు, వడ్డేవాల్లతో తిరుగు, గొల్లొల్లతో తిరుగు, పోయి పోయి మాదిగోల్లతో, మాలోల్లతో తిరుగుతానంట వేందిరా! ఈ కులాలన్నీ దేవుడు ఎందుకు పెట్టినాడు? నువ్వు బోయెల్లలో పుట్టుపో! నువ్వు రెడ్లలో పుట్టుపో! నీవు బాపనోల్లలో పుట్టుపో అని ఏ కులంలో పుట్టాల్సిన వాన్ని ఆ కులంలో ఎందుకు పుట్టిస్తాండాడు? ఒరే మల్లిగా, మనం మనుషులం. దేవుడు పుట్టీకపోతే మనం యాడుండేవాల్లం. ఈ పొద్దు నాలుగచ్చరాలు సదువుకున్నావో, లేదో కులం లేదు, గిలం లేదు అని వితండవాదం చేస్తావా? అసలు కులాలు పెట్టిందెవడ్రా దేవుడు! దేవుని కంటే నీకెక్కువ తెల్సా అని ఖయ్యిఖయ్యిమని లేచేవాడు. తమ్ముని మీదికి పూజారి భూమయ్య’’ (అదే. పుట. 21) అంటాడు. నవలాకారుడు బండి నారాయణ స్వామి. అనంతపురం జిల్లాలో అంటరానితనం ఏ స్థాయిలో ఉందో ఈ ఒక్క ఘటన చాలు చెప్పడానికి ఒక్క అనంతపురంలోనే కాదు రాయలసీమంతా ఇదే పరిస్థితి ఉంది. ఒక దళిత బాలునికి అగ్రవర్ణాల వారు బాత్‌రూంలో భోజనం పెడతారు. ఆ ఘటనతో ఆ బాలుడు ఎంతగానో ఆవేదన చెందుతాడు. ఈ విషయాన్ని రచయిత బండి నారాయణస్వామి ఇలా తెలిపాడు. ‘‘ఏం పాండూ! బాగున్నావా? అంది. ఈ మధ్యమన ఇంటికి రావడం లేదు? అని అడిగింది…. ` ఒరే పాండూ, రారా! ఈ బాత్‌రూమ్‌లోకి రా ` అని గునగునగా అరిచి బాత్‌ రూమ్‌లోకి దారి తీసింది. తనుబాత్‌ రూమ్‌లోకి పోతూనే ఆ ఇస్తరాకును తన రెండు చేతుల్లో పెట్టి, ఆప్యాయంగా తినరా, పాండూ! తిను నీళ్ళు తెస్తాను! అని వెళ్ళిపోయింది. అంత వరకూ తను గుప్త పక్కన కూర్చుని భోజనం చేయబోతున్నాడనే అనుకున్నాడు. బాత్‌ రూంలో అన్నం తినేదాన్ని ఊహించుకోలేక పోయినాడు. తనను వీళ్ళు భోజనానికి ఎందుకు పిల్చల్ల? ఇంత అవమానం ఎందుకు చేయల్ల అనుకున్నాడు… వెంటనే ఛఛ అవమానమా? గుప్త ఎట్లాంటివాడు? గుప్త తల్లి ఎట్లాంటిది? ఎంత మంచి వాళ్ళు తనని ఎందుకు అవమానం చేస్తారు అనుకొని తింటాడు. ఇంకెప్పుడూ నాతో మాట్లాడొద్దు!
ఏమీ? మీరంతా చాలా ఛీప్‌ మనుషులు అన్నాడు మా అన్న. నువ్వు అట్లాంటి వానివి కాదని వాదించినాను. రుజువు చేస్తే పాండుగానితో స్నేహం విడిచి పెడతావా అన్నాడు మా అన్న. నేను నీ మీద నమ్మకంతో ఒప్పుకున్నాను. మా అన్నే కరెక్ట్‌! నీవు చాలా ఛీప్‌ నా కొడుకువి! ఎంత చీప్‌ నా కొడుకువి కాకపోతే అన్నానికి మొగం వాచినట్లు అట్ల బాత్‌రూములో తింటావు? థూ! థూ! ఇంకెప్పుడూ నాతో మాట్లాడొద్దు…’’ (అదే. పుట. 39) అంటూ దళితుడైన పాండుకు బాత్‌ రూంలో భోజనంపెడతారు. ఇలాంటి అమానవీయ మనస్తత్వం గల మనుషులు కూడా ఉన్నారు.
బొడ్డురాయికి ఒక దళిత బాలిక నీళ్ళు పోసిందని తెలుసుకున్న అగ్రవర్ణ స్త్రీ ఆ విద్యార్థిని తీవ్రంగా మందలిస్తుంది. దాంతో ఆ బాలిక భయపడి దూరంగా వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని రచయిత బండి నారాయణ స్వామి ఇలా తెలిపాడు.‘‘ఊర్లో ఇంతమంది ఉండారు. ఒక్కరంటే ఒక్కరన్నా ఆ పాప మాదిగోల్ల పాప అని కనిపెట్టలేక పోయినారా? అని తనపక్కన నోర్లు తెరుచుకొని నిలబడిన ఆడవాళ్ల మీద రంకెలేసింది. రెడ్డెమ్మ బొడ్డురాయికి నీళ్ళు పోసే బడి పిల్లోల్ల వైపు తిరిగి, పొండి పొండి యానీళ్ళుపోయద్దు పొండి. ఒక మాదిగ దానితో మైల పడిపోయినంక, ఇంక ఎన్ని నీళ్ళ బిందెలు గుమ్మరిస్తే ఏం ఫలితమొచ్చే. పొండి, పొండి అని ఉక్రోషం పట్టలేక ఏడుస్తున్న జీతగాళ్ళ వెంకటలక్ష్మి నెత్తి పునక మీద ఇంకో ఏటు వేసింది. ఆ తరువాత ఆ పిల్లని కట్టడి చెయ్యకుండా పెంచుతున్నారని జీతగాళ్ళ వెంకలక్ష్మి అబ్బనూ, అమ్మనూ, వంశాన్నీ, కులాన్నీ తిట్టి తిట్టిమెటికలు విరిచి శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయింది. ఆ విధంగా జీతగాళ్ళ వెంకటలశస్వ స్వరూపజ్ఞానం పొందేదానికి అంకురార్పణ చేసిన ఆది గురువు రెడ్డెమ్మ!’’ (అదే. పుట. 87) అంటూ రచయిత తెలిపాడు దైవం దగ్గర కూడా ఇంత వర్ణ వివక్ష చూపడం అత్యంత హేయం. బుద్ధి తెలిసి, తెలియని పిల్ల పట్ల అంత కోపం చూపడం దారుణం. దీనిని అమానుషంగా పేర్కొనవచ్చు. పసిబిడ్డల మనస్సును గాయపరచడమే కాకుండా భౌతికంగా దాడి చేయడం హీనమైన చర్యగా భావించాల్సి ఉంది. ఒక పక్క దళితులపై ఆధారపడి జీవిస్తూ ఆ దళితుల పైన్నే అగ్రవర్ణాల వారు దాడులకు పాల్పడుతున్నారు. అది మానసికంగా, శారీరకంగా కూడా కావచ్చు. దళితుల శ్రమలేకపోతే అగ్రవర్ణాలకు తిండి ఉందు. దాంతో ఆకలితో అలమటించి చావాల్సిందే. ఈ సత్యం దళితులకూ, అగ్రవర్ణాలకు కూడా తెలుసు. అయినా దళితులు ఎప్పుడూ సహాయనిరాకరణ పాటించలేదు.
4 మనిషి మలాన్ని ఎత్తుట: గతంలో అంటే ఐదు దశాబ్దాలప్పుడు మనిషి మలాన్ని దళితులు ఎత్తి గంపలో వేసుకొని మోసుకొని పోయేవాళ్ళు. ఈ విషయాన్ని బండి నారాయణ స్వామి ఇలా అంటాడు. ‘‘ఒక చేతికి ఇనుప గంప తీసుకొనేవాడు. ఇంకో చేతికి ఇనుపరేకు తీసుకునేవాడు. వీధిలోని జనాలు ఊపిరి బిగపట్టుకొని, ఆడవాళ్ళు ముఖం వికారంగా పెట్టి పైట చెంగుతో ముక్కు మూసుకొని గబగబ అడుగులేస్తూ పారిపోతుండగా, పండయ్య పెద్ద నాయన రోడ్డు వైపు నింపాదిగా నడిచి, చేతిలోని రేకుతో దొడ్డిలోని అమేధ్యాన్నంతా గంపలోని నూక్కోనొచ్చి నిర్వికారంగా ట్రాక్టరులోని డ్రమ్ములు నింపుతుండేవాడు. అదంతా తలచుకునేదానికి ఒకప్పుడు పండయ్యకు ఇష్టముండేది కాదు. ప్రస్తుతం అతనికి ఏమనిపిస్తుందంటే కడుపులోని పెద్ద పేగుల్లోనే అది తయారై ఉన్నప్పుడు లేని అసహ్యం, అది కాస్తా బైట పడినప్పుడు మాత్రం ఎందుకు కలగాలో? ఒక వేళ కలిగిందో అనుకో, శుభ్రం చేసేవాన్ని చూసి ఎందుకు అసహ్యించుకోవాలో? పుండును ముట్టుకొని పరీక్షించి శుభ్రం చేసే డాక్టర్ని గౌరవించారు గానీ, ఆమేద్యాన్ని ఊడ్చేసి, శుభ్రం చేసే వాన్ని గౌరవించరు.
ముగింపు: ఈ నవల మాదిగల చైతన్యానికి సంకేతంగా నిలుస్తుందనీ, అనంతపురం జిల్లా ప్రజా జీవనానికి ప్రతిబింబంగా నిలుస్తుందనీ, ఈ నవలలోని వస్తువు భావికాలంలో చరిత్రకారులకు ఆధారంగా నిలబడుతుందని చెప్పవచ్చు. దీనికి హేతువుగా నారాయణ స్వామికి సమాజం పట్ల ఉన్న అవగాహన, సామాజిక స్పృహయేనని చెప్పవచ్చు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.