స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి కిరణం ` సావిత్రిబాయి ఫూలే -దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు

తొలితరం విద్యా కుసుమం
సావిత్రిబాయి ఫూలే
భారతీయ సంఘ సంస్కర్తలలో మేటి
తొలి భారతీయ ఉపాధ్యాయురాలు
తొలి నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి
తొలి బాలికల పాఠశాలలను కట్టించిన సాహసి

తొలి సారిగా సకల హక్కుల కోసం పోరాటం
తొలి తరం మహిళా ఉద్యమకారిణి
తొలి మహిళా సంఘం స్థాపన
తొలి సత్యశోధన సంఘం ఆవిర్భావం
సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి
భారతదేశ చరిత్రలో సావిత్రి బాయి ఫూలే తెలియని వారు ఉండరేమో! ఈమె పుట్టుక భారతదేశానికి ఒక విప్లవ ఉద్యమ అధ్యాయం మొదలైంది. సావిత్రిబాయి ఫూలే భారతీయ సంఘ సంస్కర్త, తొలి
ఉపాధ్యాయురాలు, తొలి రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావ్‌ ఫూలే భార్య, కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణెలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం యోధురాలు మహిళా ఉద్యమకారిణి.
జీవిత చరిత్ర:సావిత్రిబాయి ఫూలే మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో, 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో జన్మించింది. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్‌ జిల్లాలో బోధన్‌, నాందేడ్‌ కొండల్‌ వాడి ప్రాంతంలో, ఆదిలాబాద్‌ చుట్టుపక్కల ఉన్నారు. బోధన్‌ ప్రాంతపు మున్నూరు కాపులు వీరికి చుట్టాలు. ఆమె తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలేను 1840లో వివాహమాడిరది. నిరక్షరాస్యురాలిగా
ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు ఫూలే మొదటి గురువు. జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్‌ నగర్‌లో ఉపాధ్యాయ శిక్షణ పొంది, 1848లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణెలో మొదటి పాఠశాలను ప్రారంభించింది. ఈ పాఠశాల నడపటం ఉన్నత, అగ్రవర్ణాలకు నచ్చలేదు. దీంతో ఆమెపై వేధింపులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్ళు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్ళిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా ‘‘నా విధిని నేను నిర్వహిస్తున్నాను’’ అని చెప్పేది. అయినా రోజూ వేధింపులకు విసిగి ఒకరోజు ఒకడి చెంప పగులకొట్టింది. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం, గుర్తింపు లభించాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించాడు. కొంతమంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్‌, వాల్వేకర్‌, దియోరావ్‌ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఆ దంపతులకు స్వంత పిల్లలు లేరు. కానీ ఆ జంట యశ్వంతరావు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు) ను దత్తత తీసుకున్నారు.
భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు`సావిత్రిబాయి ఫూలే: భారతదేశంలోనే ధనిక పేద బహుజన మరియు అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో, ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పాఠశాలలు ప్రారంభించి, 1848 మే 12న దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం 4 సంవత్సరాలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి, ఉచిత విద్యనందించారు. 1848లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె. దళితుల, స్త్రీల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 సంవత్సరాలు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారినుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే 1849లో ఫూలే, సావిత్రీబాయి దంపతులను గృహ బహిష్కారానికి గురిచేశారు. అయినా ఆమె విశ్వాసానికి బాలికలకు మంచి చదువు అందించాలనే ప్రయత్నం చాలా దృఢంగా బలపడిరది.
సామాజిక విప్లవ ఉద్యమ కారిణిగా: మహాత్మ జ్యోతిరావు ఫూలే బాటల్లోనే సావిత్రిబాయి ఫూలే కూడా ముందుడుగు వేశారు. సావిత్రిబాయి ఫూలే మానవ హక్కుల గురించి, ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవా మండల్‌ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించారు. లింగ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారత కోసం ఈ సంస్థ కృషి చేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించింది సావిత్రిబాయి ఫూలే. అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి 1873లో తన భర్త మహాత్మా ఫూలేతో కలిసి ‘‘సత్యశోధక్‌ సమాజ్‌’’ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా, వితంతువు పునర్వివాహాల కొరకు అసమాన బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతోమంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్ళు పోసి వారి కళ్ళల్లో వెలుగు చూశారు. అలా పురుడు పోసుకుని తనవద్దే వదిలేసి పోయిన ఒక బిడ్డను అక్కున చేర్చుకున్నారు. యశ్వంత్‌గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేశారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండిరచి, క్షురకులను చైతన్యపరచి వారిచేత వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి. తరువాత 1873 సెప్టెంబరు 24న ‘‘సత్యశోధక్‌ సమాజ్‌’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యశోధన కోసం ఉద్యమాన్ని నడిపారు ఫూలే. ఈ సత్యశోధక్‌ సమాజ్‌ మహిళా విభాగం సావిత్రీబాయి నేతృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభకార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యశోధక్‌ సమాజ్‌ ఆధ్వర్యాన వివాహం జరిపించారామె. 1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870లో ఒకసారి, 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం. కరువు వాతపడిన కుటుంబాలలోని దాదాపు 2,000 మంది అనాథ బాలలను అక్కున చేర్చుకున్నారు. తమ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించారు. సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే కాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 1854లోనే ఆమె తన కవితా సంపుటి ‘కావ్యఫూలే’ను ప్రచురించారు. మరో కవితా సంపుటి ‘పావన కాశీ సుబోధ్‌ రత్నాకర్‌’ను 1891లో ప్రచురించారు. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తక రూపంలో వచ్చాయి.
మహాత్మ జ్యోతిరావు ఫూలే మరణం: జ్యోతిరావు ఫూలే 1890 నవంబరు 28న మరణించడంతో సావిత్రిబాయి అంతులేని దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖంలో నుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త ఫూలే చితికి తానే స్వయంగా నిప్పు పెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారత దేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది. ఫూలే మరణానంతరం సత్యశోధక్‌ సమాజ్‌ బాధ్యతను స్వీకరించి నడిపించారు. 1897లో ఫ్లేగు వ్యాధి పూణే నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రీబాయి ఫూలే, కొడుకు యశ్వంత్‌తో కలిసి వ్యాధిగ్రస్తులకు సేవచేశారు.
సావిత్రిబాయి ఫూలే మరణం: 1896`97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులు, పేదల కోసం జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు సావిత్రిబాయి. ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించారు. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు రెండు వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించారు. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్‌ లాంటి దళిత పిల్లలను తన చంకన వేసుకుని చికిత్స చేసి కాపాడారు. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకు సోకి, మార్చి 10, 1897లో మరణించారు. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్‌ ఆమె అంత్యక్రియలు జరిపించారు. సావిత్రిబాయి జయంతిని భారత దేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 1997లో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా బిళ్ళను విడుదల చేసింది. పూణే విశ్వవిద్యాలయంతో పాటు అనేక సంస్థలకు, విద్యాలయాలకు, వసతి గృహాలకు సావిత్రిబాయి ఫూలే పేరు పెట్టడం జరిగింది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.