రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత – బి. సింధు ప్రియ

ఒక్క క్షణం అందరి కంట సంద్రమై కన్నీరు ఉప్పొంగింది. ఆ అమ్మాయి మరణం అందరినీ దుఃఖ సంద్రంలో ముంచింది. గుండెలు పగిలేలా తల్లిదండ్రుల ఆర్తనాదాలకు మనసు చలించింది. ఆ అమ్మాయి పేరు రిషితేశ్వరి. దైవంగా కొలిచే గురువులే పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తే ఏం చేయాలి? ఇలాంటి సంఘటన రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణం. ఆ మరణం వెనుక దాగిన రహస్యం అందరికంట చేరినప్పుడు, మహిళలందరూ విద్యార్థులందరూ విప్లవంలా మారి న్యాయం కోసం పోరాటం జరుపుతున్నారు. చదువంటే ప్రాణం, ఎలాంటి ఆకర్షణలకు లొంగని ఆ అమ్మాయిని జ్ఞానాన్ని అందించాల్సిన గురువే బలితీసుకొన్నాడు. ర్యాగింగే కారణమంటున్న స్నేహితులు, ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకీ రాకూడదంటున్న తల్లిదండ్రులు, చిరునవ్వుతో వెలిగే ముఖంలో దుఃఖాన్ని చేర్చింది. ఎంతో శోకంతో నిండి ఉన్న ఆ రిషితేశ్వరి ఆత్మహత్య లేఖ, అందరి మనసులను కదిలించింది. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ఎన్నో కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు కాకపోతే, ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది? ఇలాంటి సమస్యలకు చావే శరణ్యమా? ఆలోచించండి!

 

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.