Category Archives: వ్యాసాలు

వ్యాసాలు

అవతార దేవుళ్ళ అసలు నిజరూపాలు -నంబూరి పరిపూర్ణ

తమకు కష్టమన్నది లేకుండా ఇతర పరాయి ప్రాంతపు పాడి పంటలను, ప్రకృతి ఫలాలను దోచుకు బ్రతకాలనుకునే దూరప్రాంతాల ఆక్రమణదారులు చరిత్రలో తక్కువేమీ లేరు. తాము అడుగుపెట్టిన ఇతర ప్రాంతపు భూమిపుత్రుల్ని నిర్మూలించి, తాము సుఖరీతిలో బ్రతుకు

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గాలిలో ప్రాణవాయువు -దేవి

మన ప్రభుత్వం పరిపాలిస్తున్న తీరుతో చాలామంది ప్రజలు నిరాశ పడుతున్నట్లు నేను గమనించాను. ఇదే ప్రభుత్వాన్ని పరిపాలనకు ఏ మాత్రం సంబంధం లేని కారణాలతో వీరే ప్రేమగా ఓటేసి తిరిగి అధికారంలోకి తెచ్చారు. ఈ నిరాశకు మూలకారణం మామూలే… జరగనివి

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆకలిని అక్షరాలతో అలంకరించిన జాషువా -రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

గుర్రం జాషువా మరణించి 50 ఏళ్ళు పూర్తయింది. అంతకు ముందు ఒక యాభై ఏళ్ళ నుంచి ఆయన కవిత్వం రాశాడు. ఈ వందేళ్ళలో మన దేశంలో చాలా మార్పులొచ్చాయి. పేదరిక నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు పాలకులు. ఎన్ని పథకాలను

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వివాహ మంత్రాల తాత్పర్యం -అబ్బూరి ఛాయాదేవి

ఇది పెళ్ళిళ్ళ సమయం. ఎందరో వధూవరులు పెళ్ళిపీటల మీద కూర్చుని పురోహితుడు చదివే మంత్రాలను వింటున్నారు. కొన్నింటిని చిలక పలుకుల్లా పురోహితుడు చెప్పమన్నట్లు చెబుతున్నారు. అందులో ఎందరికి తెలుసు వివాహ మంత్రాల అర్థాలు? పీటలమీద కూర్చున్న వాళ్ళకి తెలియవు. పెళ్ళికి వచ్చిన ఆహుతులకూ తెలియవు, ఎవరో ఒకరిద్దరికి తప్ప.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రకృతి బిడ్డలు -రమాదేవి చేలూరు

పచ్చగా, దట్టంగా, నిండుగా, ఏపుగా అడవి అల్లిబిల్లిగా ఉంది. అడవికావల ఏరు యదేచ్ఛగా తేటగా వయ్యారంగా పారుతూ ఉంది. ఏటిగట్టున ఊరుంది. ఊరు ఒద్దికగా, ముద్దుగా, చిక్కుడు పందిరి ప్పుకున్న గుడిసెల్లో నవవధువులా ముచ్చటగా ఉంది. ఊరు చుట్టూ మైదానంలో పోడు వ్యవసాయ భూములున్నాయి. జొన్న, మొక్కజొన్న, ఉలవలు, సామలు పండుతాయి. అది ఆదివాసీల గూడెం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కనీస మద్దతు ధర అంటే ఏమిటి? ఎందుకు? – పి.ఎస్‌.అజయ్‌కుమార్‌

అందరికీ ఒక మాట సుపరిచితమయింది. అదే ‘కనీస మద్దతు ధర’ (వీూూ-వీఱఅఱఎబఎ ూబజూజూశీత్‌ీ ూతీఱషవ). ఇది దేశ రాజధాని చుట్టూ మోహరించిన రైతు ఉద్యమం వలనే సాధ్యమయింది. అనేక దశాబ్దాలుగా రైతులు వ్యవసాయంలో సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇప్పటివరకూ 3.5 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. వీటి పరంపర ఇంకా కొనసాగుతూనే

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కార్పొరేట్లకు ప్రత్యామ్నాయం సహకార సంఘాలే – కన్నెగంటి రవి

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రైతాంగ ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతున్నది. కేంద్రం ఏకపక్షంగా రైతుల ఆకాంక్షలను, అన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలను పక్కనపెట్టి తనకున్న బండ మెజారిటీతో ఆమోదించిన 3 వ్యవసాయ రంగ చట్టాలు, దేశంలో చర్చకు పెట్టిన విద్యుత్‌ బిల్లు 2020 గ్రామీణ ప్రజలలో భయాందోళనలను రేకెత్తించాయి. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా, కేంద్ర ప్రభుత్వం … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వ్యవసాయ చట్టాలు ఎవరికి చుట్టాలు – అబ్దుల్‌ వాహెద్‌

భారతీయ జనతా పార్టీపై రైతులు మండిపడుతున్నారన్నది స్పష్టంగా తెలుస్తున్న వాస్తవం. రైతుల ఆగ్రహం ఇప్పుడు బీజేపీకి, ఎన్డీయేలో మిత్రపక్షాలకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సవాలుగా మారవచ్చు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లోని రైతులే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, కేరళ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దేశంలో కొత్త రైతు చట్టం – దాని పరిణామాలు – ఎర్రోజు శ్రీనివాస్‌

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రైతు చట్టాలను, వాటి పర్యవసానాలను తెలుసుకునే కంటే ముందు పాత చట్టం ఏమి చెబుతుందో కూడా పరిశీలిద్దాం. భారతదేశంలో గల భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక భిన్నత్వాన్ని రూపుు మార్చాలని, దేశాన్ని ఏకరూప రాజ్యాంగా మార్చాలని అనుకునే కుట్రలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా నూతన చట్టాలు రూపొందించబడ్డాయి. ఇది … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

విస్మృత కథారచయిత్రి – వేదుల మీనాక్షీదేవి శీలా సుభద్రాదేవి

ఆధునిక సాహిత్యరంగంలో స్వాతంత్య్రానంతరం అధిక సంఖ్యలోనే మహిళలు సాహిత్య రంగంలోకి వచ్చారు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే దానికి సమాంతరంగా స్త్రీ విద్యపై కూడా మహిళలు కొంత ఉద్యమస్ఫూర్తితో రచనలు చేయటం కావచ్చు, స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలు కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు కావటం వలన కావచ్చు, సాంస్కృతికంగా, ఆర్థికపరంగా వెసులుబాటుగల కుటుంబాలలోని స్త్రీలకు విద్యావంతులయ్యే అవకాశం లభించింది. … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అసలు యుద్ధం దేనిపైనా?! -దేవి

”లవ్‌ జిహాద్‌” ఆర్డినెన్స్‌ తెచ్చేసింది యు.పి. యోగి సర్కారు. ఈ అరుపు ఇవ్వాళ కొత్తగా మొదలు కాలేదు. భాజపా ప్రభుత్వాల చేతకానితనం, అసమర్ధత, పరిపాలనలో అవకతవకలు బయటపడినప్పుడల్లా సంఘ్‌ పరివార్‌లోని ఏదో ఒక అంశం భజరంగ్‌దళ్‌ లేదా విశ్వ హిందూ పరిషత్‌ గొంతు చించుకొని లవ్‌ జిహాద్‌ అంటూ రంకె వేస్తుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మనకు మనమే ప్రతిధ్వనులుగా ఉండిపోవద్దు -మమత కొడిదెల

”నువ్వు బిఎల్‌ఎమ్‌ ను సమర్ధిస్తావు కదా. మరి రామ మందిరాన్ని ఎందుకు సమర్ధించవు?” వాట్సాప్‌ గ్రూప్‌లో సౌమ్యంగా అడిగింది ఇరవై ఐదేళ్ళ క్రితం కాలేజిలో పరిచయమైన స్నేహితురాలు. తల తిరిగిపోయే ఇలాంటి ఉపమానాలు ఈ మధ్య దాదాపు ప్రతిరోజూ వింటూనే ఉన్నా. విన్న ప్రతిసారీ కోసుకుపోతున్నట్లుండే నొప్పి గుండెలో. హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారని ఇన్నాళ్ళూ అనుకున్న స్నేహితుల … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ సమయంలో మహిళలపై పెరిగిన గృహ హింస -కందగట్ల శ్రవణ్‌ కుమార్‌

పితృస్వామ్య అధికారం ఆధారంగా ఏర్పడిన లింగ విభజనలో భాగంగా పుట్టిన గృహ హింసలో అనేక కోణాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్‌.ఓ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళలలో ఒకరు వారి జీవిత కాలంలో శారీరక లేదా లైంగిక హింసను అనుభవిస్తున్నారు. వైవాహిక సంబంధాలలో ఉన్న మహిళల్లో కనీసం 30 శాతం తమ భాగస్వాములచే … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

శృంగార దేవత మార్లిన్‌ మన్రో -రొంపిచర్ల భార్గవి

మార్లిన్‌ మన్రో పేరు చెప్పగానే కలల్లో తేలిపోయి వెర్రెక్కిపోయే అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా చాలామందే ఉన్నారు. ఆమె చనిపోయి సుమారు 58 ఏళ్ళయినా అత్యత ప్రజాదరణ పొందిన శృంగార తారగా ఆమె స్థానం చలన చిత్ర ప్రపంచంలో ఈనాటికీ చెక్కుచెదరలేదు. అంతేకాదు అది ఎప్పటికీ చెరిగిపోలేని శాశ్వత స్థానమే అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చలన … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వ్యవసాయ రంగంపై నోట్‌ మరియు నిర్దిష్ట డిమాండ్లు – ప్రజా అసెంబ్లీ

తెలంగాణా ప్రజా అసెంబ్లీ – 2020 సెప్టెంబర్‌ 4, 5, 6 తెలంగాణ వ్యవసాయ రంగం గురించి, గ్రామీణ ప్రాంతం గురించి మాట్లాడుకోవడం అంటే రాష్ట్రంలో 65 శాతం జనాభా గురించి చర్చించడం. రాష్ట్ర ఆహార భద్రత గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుకోవడం. మొత్తంగా మెజారిటీ ప్రజల జీవనోపాధుల గురించి మాట్లాడుకోవడం. ఇంత కీలక … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రజారోగ్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక శ్రద్ధ పెట్టాలి – ప్రజా అసెంబ్లీ

సరిపడినంత సురక్షితమైన పోషకాహారము, సురక్షితమైన నీరు, స్వచ్ఛమైన గాలి వంటివి లేని పరిస్థితులలో, ప్రజలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజారోగ్య వ్యవస్థ నిర్లక్ష్యానికి గురై, ప్రైవేటు కార్పొరేట్‌ శక్తులు వైద్య రంగాన్ని వ్యాపారంగా మార్చివేయడంతో వైద్య ఖర్చులు … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment