Category Archives: వ్యాసాలు

వ్యాసాలు

దిండుక్కల్‌ దళిత మహిళలు సంఘటితమైన వేళ – గోకుల్‌ జి.కె.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి రమ, లత వారి కార్మిక సంఘంతో కలిసి తమిళనాడు లోని తమ దుస్తుల తయారీ కర్మాగారంలో ఎదురవుతున్న లింగ వివక్షనూ, కులపరమైన వేధింపులనూ అంతం చేయడానికి దృఢంగా పోరాడారు, ప్రపంచ ఫ్యాషన్‌ రంగంలో మైలురాయి లాంటి దిండుక్కల్‌ ఒప్పందం

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

వలసాంధ్రలో వెలువడ్డ రెండవ స్త్రీల పత్రిక ‘తెలుగు జనానా’. ఇది 1893 నుండి 1907 వరకు ప్రచురితమైంది. ప్రారంభ సంచికల్లో ఆంగ్లంలో ‘ఎ మంత్లీ జర్నల్‌ ఫర్‌ జనానా రీడిరగ్‌’ (మే 1902) అనీ, తర్వాత కాలంలో ‘తెలుగు దేశపు స్త్రీల కొరకును బాలికల కొరకును

Share
Posted in వ్యాసాలు | 1 Comment

తెరిగాథ`బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు -బొల్లోజు బాబా

(గత సంచిక తరువాయి…) వ్యభిచారం అనేది అతి ప్రాచీన వ్యవస్థీకృత వ్యాపారం. థెరి గాథలకు ధమ్మపాలుడు చేసిన వ్యాఖ్యానంలో ఒక వేశ్య సంపాదించిన ధనంలో సగం ఆమెకు చెందగా మిగిలిన సగం వేశ్యావాటిక నిర్వహించేవారికి చెందుతుంది అంటాడు. దాన్ని బట్టి సుమారు రెండున్నర వేల సంవత్సరాల క్రితపు గణికావ్యవస్థ ఆర్థిక అంశాలు కొంతమేరకు అర్థమౌతాయి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గోరఖ్‌పూర్‌లో జ్వరాలు, భయాలు, తప్పుడు గణాంకాలు -పార్ధ్‌ యం.ఎన్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి గత నాలుగు దశాబ్దాలుగా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మెదడువాపు వ్యాధి వేలాదిమంది చిన్నారులను బలితీసుకుంది. ఇప్పుడు కేసులు బాగా తగ్గిపోయాయని అధికార లెక్కలు చూపుతున్నప్పటికీ, అలా తగ్గించి చూపడం పట్ల కలిగే ఆందోళనల మధ్య ఆ వ్యాధి ఇప్పటికీ భయాన్ని కలిగిస్తూనే ఉంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : సతీహిత బోధిని (1883`1905) -డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

18, 19 శతాబ్దాలనాటి వలస భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమం ముమ్మరంగా సాగింది. సంస్కరణోద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయడానికి సంఘ సంస్కర్తలు వివిధ భారతీయ భాషల్లో పత్రికల్ని ప్రారంభించారు. సంఘ సంస్కరణోద్యమానికి స్త్రీల సమస్యలు ప్రధాన కేంద్ర బిందువుగా ఉండేవి. అందుకే స్త్రీలలో సంఘ సంస్కరణ సందేశాన్ని ప్రచారం

Share
Posted in వ్యాసాలు | Leave a comment

‘ఒక దేశం, ఒక రేషన్‌ కార్డ్‌’ అయినా రేషన్‌ లేదు- సంస్క్రితి తల్వార్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి లాక్‌డౌన్‌ కారణంగా బీహార్‌, దర్బంగా జిల్లాలోని తన ఇంటికి తిరిగివచ్చిన రుఖ్సానా ఖాతూన్‌కు, ఎట్టకేలకు నవంబర్‌ 2020లో ఒక రేషన్‌ కార్డు వచ్చింది. ప్రస్తుతం ఢల్లీికి తిరిగి వచ్చిన ఆమె, చట్టబద్ధంగా తనకు లభించే ఆహారధాన్యాలను పొందేందుకు మరోసారి అవస్థలు పడుతున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఇప్పటికీ చర్చనీయాలే – జూపాక సుభద్ర

రత్నమాలది విప్లవతరమే, ఉద్యమాల తరమే. ఈ తరంలో తెలంగాణ నేలమీద విప్లవ సాహిత్య పత్రిక నడిపిన మొదటి తెలంగాణ మహిళ రత్నమాల. నక్సల్బరి, శ్రీకాకుళ పోరాటాల తర్వాత, జై తెలంగాణ, జై ఆంధ్ర పోరాటాల పిదప ఎమర్జెన్సీ చీకట్ల నుంచి దేశం అప్పుడప్పుడే

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సాహిత్యరంగంలో నోబెల్‌ బహుమతి పొందిన మహిళలు -మన్నేపల్లి లలితమ్మ

స్త్రీలను ఆకాశంలో సగం అన్నారు. అయితే అట్టి ఆకాశం సగం మేఘావృతం అయితే సగం చీకటిలో ఉండిపోతుంది. అదే విధంగా సమాజంలో స్త్రీని నిరాదరణకు గురిచేస్తే సగం సమాజం అంధకారంలో మగ్గిపోతుంది. స్త్రీ పురుషులిద్దరూ సృష్టికి మూలస్తంభాల వంటివారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అమ్మ ఒక యుద్ధగీతం… -రాంపల్లి రమేష్‌

‘‘కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం గారి, సుత్తీ కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓటు’’… రాత్రి ఆ అక్షరాలు రాస్తున్నప్పుడు తెలియదు నాకు… తెల్లవారితే అవి అగ్గి రాజేస్తాయని… సూర్యునితోపాటే మా ఇంటి గోడ మీద దర్శనమిచ్చిన ఆ రాతలు పెద్ద

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హ్యాపీ ఫెమినిస్ట్స్‌ -చిమమండా అడిచే

– అనువాదం : ఎ. సునీత ఆ మాట పురుషులు ఎప్పుడు అంటారంటే, వాళ్ళు చెయ్యకూడని పనులు ఆపేసినప్పుడు. వాళ్ళ స్నేహితులకి, తమ మగతనాన్ని నిరూపించుకుంటూ, ముద్దుగా ఇలా చెప్పుకుంటారు. ‘‘మా ఆవిడ ప్రతి రాత్రి క్లబ్బుకెళ్ళకూడదని అంటోందోయ్‌. ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని వీకెండ్‌లోనే వెళ్తానని ప్రామిస్‌ చేశాను’’.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

బీడ్‌లో బాలవధువులు: చెరకు కోతల్లో నలిగిపోయిన ఆశలు- పార్ధ్‌ ఎం.ఎన్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

(అనువాదం: అపర్ణ తోట) మహారాష్ట్ర బీడ్‌ జిల్లాలో అసలే కష్టంగా సాగుతున్న రేఖ వంటి ఆడపిల్లల జీవితాలలో ఈ మహారోగం ఇంకా కష్టాలను తెచ్చిపెట్టింది. పెరుగుతున్న పేదరికం, బడులు మూతబడడం, ఇటువంటి కారణాలెన్నో చిన్నవయసులోనే ఆడపిల్లల పెళ్ళిళ్ళకు కారణమవుతున్నాయి. రేఖకు పది రోజుల క్రితమే, పెళ్ళి చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని అర్థమైపోయింది. ఆమె … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనలేకపోయిన ఒక తిరుగుబాటుదారు మహిళ ‘ఈలా’ -ఎస్‌.రాజ్యలక్ష్మి

(1940వ సంవత్సరంలో ఒలింపిక్‌ ఆటల్లోని పరుగు పందెంలో పాల్గొనవలసిన ఈలా మిత్రా, ఆ తర్వాతి కాలంలో బెంగాల్‌లో అప్పుడే ఊపిరి పోసుకుంటున్న తెభంగా అనే ప్రముఖ రైతు ఉద్యమంలో పనిచేసినందుకు గాను జైలులో బంధింపబడి, ఎంతో హింసకు గురయ్యారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆక్సిజన్‌ దొరకని ఆత్మనిర్భర భారతం – సతీష్‌ బైరెడ్డి

దేశాన్ని కరోనా రెండవ కెరటం ముంచెత్తుతోంది. ఆసుపత్రులను కరోనా రోగులు ముంచెత్తుతుంటే స్మశాన వాటికల ముందు పొడవాటి బారులు కనిపిస్తున్నాయి. కరోనా లక్షణాలు తీవ్రమైన వెంటనే ఆసుపత్రుల కోసం జనం హాహాకారాలు పెడుతూ పరుగెడుతున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కీర్తించబడని హౌషాబాయి ధీరత్వం పి.సాయినాథ్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా (అనువాదం: అపర్ణ తోట)

91 ఏళ్ళ హౌషాబాయి పాటిల్‌ బ్రిటిష్‌ కార్యాలయాలపై దారుణమైన దాడులు చేసిన విప్లవాత్మక కార్యదర్శి. 1943`46 మధ్య, ఆమె అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నప్పుడు, మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో ఆయుధాలు, బస్సులు మరియు పోలీస్‌స్టేషన్లను దోచుకుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సాలిహాన్‌ రాజు మీద ఎదురుదాడి చేయగా – డా॥ పి.సాయినాథ్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

పది స్వాతంత్య్ర గాథలు ` 1. ఒడిశాలోని నువాపడాలో డేమాతి డే సబర్‌, ఆమె స్నేహితులు తుపాకీతో బ్రిటిష్‌ అధికారులను ఎదుర్కొన్నారు. ఆమె వేరే ఆదివాసీ ఆడవారితో కలిసి పొలంలో పనిచేస్తుండగా, వారి ఊరు సలిహా నుంచి ఒక యువకుడు వారివైపు వేగంగా పరిగెత్తుతూ అరిచాడు

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల సంక్షేమ చట్టం: ఒక పరిశీలన – డా॥ పి.కె.వి.ఎస్‌. రామారావు

సీనియర్‌ సిటిజన్స్‌ (వయోవృద్ధుల)కు మన ప్రభుత్వం ఎన్నో ప్రయోజనాలను కల్పించింది. రైల్‌ టికెట్లలో రాయితీ, బ్యాంకు డిపాజిట్లలో అధిక వడ్డీ, ప్రభుత్వ పింఛన్లు, దేవాలయాలలో ప్రత్యేక దర్శనాలవంటివి కొన్ని సౌకర్యాలు ఉదాహరణలుగా చెప్పవచ్చు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment